• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జ‌న‌సేన నేత‌ల‌కు బెయిల్.. ప‌వ‌న్ రియాక్ష‌న్ ఇదే!

న్యాయంపై న‌మ్మకం ఉంది.. ప‌వ‌న్ రియాక్ష‌న్ ఎందుకంటే!

NA bureau by NA bureau
October 22, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
91
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

విశాఖ ఎయిర్పోర్టులో వైసీపీ మంత్రులపై దాడి చేశారనే ఆరోపణలతో అరెస్టైన జనసేన నేతలకు బెయిల్ మంజూరు అయ్యింది. బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. దీంతో  అరెస్ట్ అయిన 9 మంది జనసేన నేతలను విడుద‌ల చేయ‌నున్నారు.

మంత్రులపై దాడి చేశారనే ఆరోపణలతో 70 మంది జనసేన నేతలపై విశాఖ పోలీసులు పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అంతకుముందు 61 మందికి బెయిల్ మంజూరు కాగా 9మందికి దిగువ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషన్పై విచారించిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం అరెస్ట్ అయిన జనసేన నేతలు విశాఖ కారాగారంలో ఉన్నారు. శ‌నివారం ఉద‌యం లోగా వారిని విడుద‌ల చేయ‌నున్నారు.

ప‌వ‌న్ రియాక్ష‌న్ ఇదే

హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడం సంతోషకరంమ‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ పేర్కొన్నారు. జనసేన నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించిందని   మండిపడ్డారు. పార్టీ నేతలకు బెయిల్‌ మంజూరు చేయడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థను తామేప్పుడు సంపూర్ణంగా విశ్వసిస్తామని పవన్‌ వ్యాఖ్యానించారు.

త‌ప్పెవ‌రిది?  శిక్షెవ‌రికి?

విశాఖ గర్జన పేరిట ఉత్తరాంధ్ర జేఏసీ విశాఖలో చేపట్టిన కార్యక్రమానికి వైసీపీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మంత్రులు, కీలక నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం జరిగిన రోజే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా విశాఖకు వచ్చారు.

ఈ సందర్భంగా పవన్కు స్వాగతం చెప్పేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన జనసైనికులు.. విశాఖ గర్జన ముగించుకుని వెళ్తున్న మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేశ్, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడికి దిగారనేది ఆరోప‌ణ‌.

అయితే.. మంత్రులు కొంద‌రు రెచ్చ‌గొట్టిన వీడియో.. ముఖ్యంగా మంత్రి రోజా.. త‌న మ‌ధ్య‌వేలును చూపిస్తూ.. క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన వీడియోను జ‌న‌సేన నాయ‌కులు సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. పోలీసులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించార‌నే ఆరోప‌ణ‌లు వున్నాయి.

ఈ ఘటనలో పోలీసులు 70 మంది జన సైనికులను అరెస్ట్ చేశారు. వీరందరినీ కోర్టులో హాజరుపరచగా.. అరెస్టయిన వారిలో 61 మంది నిందితులకు అక్కడికక్కడే బెయిల్ లభించింది. మిగిలిన 9 మందికి ఈ నెల 28 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. తాము కూడా కేసులు పెట్టినా.. వైసీపీ వారిపై పోలీసులు ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి కేసు న‌మోదు చేయ‌లేద‌ని.. జ‌న‌సేన నాయ‌కులు ఆరోపించారు.

Tags: janasenavisakhapatnamvizag
Previous Post

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోవర్టే…ఇదే ప్రూఫ్?

Next Post

పాద‌యాత్ర‌పై వైసీపీ వ్యూహం…ఎన్ని ట్విస్టులో

Related Posts

tdp and ycp logos
Politics

వైసీపీ ఎమ్మెల్యేల‌పై సస్పెన్ష‌న్‌.. మ‌రి వారు ఎలా రియాక్ట్ అయ్యారంటే!

March 24, 2023
pawan with bjp
Movies

పవన్ సినిమాకు ‘మెగా’ మార్కు డేట్ 

March 24, 2023
manchu family
Movies

మనోజ్‌తో గొడవపై విష్ణు స్పందన

March 24, 2023
kcr in munugode
Telangana

‘సౌండ్ పెంచమని చెప్పు’ అనేందుకు అలా చేసుడేంది కేసీఆర్?

March 24, 2023
Top Stories

స్పీకర్ తమ్మినేని గుట్టు విప్పిన టీడీపీ నేత

March 24, 2023
Trending

చంద్రబాబు లెక్కసరిచేశారా?

March 24, 2023
Load More
Next Post

పాద‌యాత్ర‌పై వైసీపీ వ్యూహం...ఎన్ని ట్విస్టులో

Latest News

  • వైసీపీ ఎమ్మెల్యేల‌పై సస్పెన్ష‌న్‌.. మ‌రి వారు ఎలా రియాక్ట్ అయ్యారంటే!
  • పవన్ సినిమాకు ‘మెగా’ మార్కు డేట్ 
  • మనోజ్‌తో గొడవపై విష్ణు స్పందన
  • ‘సౌండ్ పెంచమని చెప్పు’ అనేందుకు అలా చేసుడేంది కేసీఆర్?
  • రచ్చకెక్కుతున్న ‘మంచు’ గొడవ
  • స్పీకర్ తమ్మినేని గుట్టు విప్పిన టీడీపీ నేత
  • చంద్రబాబు లెక్కసరిచేశారా?
  • నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే
  • ఎమ్మెల్యేలను పూచికపుల్లలా తీసేస్తే ఇలాగే ఉంటుంది జగన్ మావా !
  • టీఎస్ పీఎస్సీ బోర్డే వివాదాస్పదమా ? 
  • టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?
  • స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?
  • వైసీపీలో వారిపై  అనుమానం చూపులు
  • ‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం
  • నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!

Most Read

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra