• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వైసీపీకి జైకొట్టి తప్పు చేశామా? నలుగురు రెబల్ ‘తమ్ముళ్ల’ అంతర్మధనం?

admin by admin
August 14, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
691
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో ప్రత్యేకించి చెప్పలేని పరిస్థితి. అంచనాలు ఒకలా.. వాస్తవాలు మరోలా ఉండటం కామనే. తాము వేసిన అంచనాలకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని నలుగురు రెబల్ తమ్ముళ్లు ఇప్పుడు ఫీల్ అవుతున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చూసిన టీడీపీ.. కేవలం 23 మంది ఎమ్మెల్యేల్ని మాత్రమే గెలిపించుకోగలిగింది. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు జనగ్ ప్రభుత్వానికి జై కొట్టటమే కాదు.. ఆ పార్టీకి జంప్ అయినట్లుగా చెప్పాలి.

అధికారికంగా పార్టీ మారనప్పటికీ.. టీడీపీలోనే ఉంటూ.. వైసీపీకి ఓపెన్ గా మద్దతు ఇస్తున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరో కాదు.. టీడీపీకి హార్డ్ కోర్ కార్యకర్తగా పేరున్న క్రిష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకరైతే.. రెండో ఎమ్మెల్యే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నుంచి టీడీపీ టికెట్ మీద పోటీ చేసి గెలిచిన మద్దాల గిరి. ఇక.. సీనియర్ నేతగా టీడీపీలో సుపరిచితుడైన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం మూడో నేత కాగా.. నాలుగో నేత విశాఖ దక్షిణం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వాసుపల్లి గణేశ్ గా చెప్పాలి. ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికి టీడీపీ తరఫునే ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు రికార్డుల్లో ఉన్నా.. వారి మాటలు చేతలన్ని కూడా అధికారపార్టీ తరఫునే పని చేస్తున్నాయని అందరికి తెలిసిందే.

పార్టీ మారి వైసీపీ కండువాలు మెడలో వేసుకోలేదు కానీ.. వారి మాటలన్నిజగన్ చుట్టూనే తిరగటం తెలిసిందే. అంతే కాదు.. పాత పార్టీని వదిలేసి కొత్త పార్టీలోకి చేరేందుకు సిద్ధమైన వారంతా.. తమ కమిట్ మెంట్ ఎంతన్న విషయాన్ని ప్రదర్శించుకోవటంతో పాటు.. జగన్ మీద తమకున్న స్వామిభక్తిని నిరూపించుకోవటం కోసం తమ మాజీ బాస్ చంద్రబాబుపై ఒంటికాలిపై లేచేవారు. తిట్టాల్సిన అవసరం లేకున్నా.. ఘాటు వ్యాఖ్యలు చేయటం ద్వారా.. వైసీపీ నేతలు సైతం చేయలేని పనిని తాము మాత్రమే చేస్తున్నట్లుగా వ్యవహరించేవారు. వైసీపీ నేతలు చంద్రబాబు తిట్టే దానితో పోలిస్తే.. పార్టీ టికెట్ మీద గెలిచి ఎమ్మెల్యేలుగా ఉన్న టీడీపీ నేతల చేత తిట్టిస్తే వచ్చే పొలిటికల్ మైలేజీ ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో.. అలాంటి తిట్ల కార్యక్రమాన్ని అధికార పార్టీ కూడా ఎంకరేజ్ చేసిందన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

ఇదిలా ఉండగా.. పార్టీ మారితే ఎమ్మెల్యే గిరి పోయే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో.. అధికారికంగా పార్టీలో చేరని నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు మార్పు వచ్చినట్లుగా చెబుతున్నారు. తాము తప్పు చేశామా? తొందరపాటుతో వ్యవహరించామా? అన్న సందేహం వారి మదిలో మెదులుతుందన్న మాట చెబుతున్నారు. ఉన్న పార్టీ పోయిందని.. కొత్త పార్టీలో తమకు దక్కాల్సినంత గౌరవ మర్యాదలు దక్కటం లేదని వాపోతున్నారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు..వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకోవటమే కాదు.. కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చేయటం తెలిసిందే.

అదే రీతిలో జగన్ కూడా తమకు మంత్రి పదవులు.. లేదంటే కీలకమైన అధికారాలుకట్టబెడతారని భావించిన నలుగురికి.. వైసీపీ నేతల నుంచి వస్తున్న వ్యతిరేకత ఇబ్బందికరంగా మారిందంటున్నారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే పార్టీలోకి వస్తే.. అప్పటికే పార్టీలో ఉన్న వారింతా తమ ఫ్యూచర్ మీద బెంగపడుతున్నారు. దీంతో.. తమ్ముళ్లకు చెక్ పెట్టేప్రయత్నాలు ముమ్మరంచేస్తున్నారు. దీనికి చక్కటి ఉదాహరణగా చీరాల నియోజకవర్గ రాజకీయమే. అక్కడ వైసీపీ నేతగా ఉన్న అమంచి క్రిష్ణమోహన్ కు.. టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాంకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. దీంతో నిత్యం పంచాయితీలే అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఈ ఇష్యూను పార్టీ అధినేత కమ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏదైనా సెటిల్ చేస్తారంటే.. ఆయన పట్టించుకోనట్లుగా ఉంటున్నట్లు చెబుతున్నారు.

దీంతో.. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా నలుగురు టీడీపీ (?) ఎమ్మెల్యేల పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు ఎలా వెళ్లాలన్నది అర్థం కావట్లేదని వారు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితే కొనసాగితే.. వచ్చే ఎన్నికల్లో తమకు జగన్ టికెట్లు ఇస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారిందంటున్నారు. పార్టీ వీడిన సంకేతాలతో.. తమకు పదవులు లభిస్తాయని.. అందుకు రంగం సిద్దం చేసుకున్న తర్వాత అధికారికంగా పార్టీకి గుడ్ బై చెప్పాలన్న యోచనలో ఉన్న వారికి.. జగన్ నుంచి ఎలాంటి సంకేతాలు అందటం లేదంటున్నారు. దీంతో.. చంద్రబాబుపై ఒంటికాలిపై లేచిన నేతలకు ఇప్పుడేం చేయాలో పాలుపోవటం లేదంటున్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిలా మారిందన్న మాట వినిపిస్తోంది.

Tags: 4 tdp mlas supporting ycp4 tdp rebel mlasap cm jaganthose 4 tdp mlas regretting
Previous Post

సోనియా దగ్గరకు రేవంత్, కోమటిరెడ్డిల పంచాయతీ?

Next Post

సీపీ సజ్జన్నార్ పిలిచి మరీ ఆ హీరోను సన్మానించారెందుకు?

Related Posts

Amaravati rally
Politics

AP : అమరావతిలో పోలీసులను లెక్క చేయని ప్రజలు

October 1, 2023
pawan kalyan varahi yatra
Politics

సైకిల్, గ్లాస్ కలిసి ఫ్యాన్‌ను తరిమేయడం ఖాయం – పవన్

October 1, 2023
Andhra

TANA-విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్న ఠాగూర్‌ మల్లినేని!

October 1, 2023
nara bhuvaneswari with lokesh
Andhra

భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!

October 1, 2023
nara bramhani with janasena
Andhra

నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!

October 1, 2023
jagan thinks about kamma
Andhra

జగన్ ఊహించని రెండు పరిణామాలు

October 1, 2023
Load More
Next Post

సీపీ సజ్జన్నార్ పిలిచి మరీ ఆ హీరోను సన్మానించారెందుకు?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • AP : అమరావతిలో పోలీసులను లెక్క చేయని ప్రజలు
  • సైకిల్, గ్లాస్ కలిసి ఫ్యాన్‌ను తరిమేయడం ఖాయం – పవన్
  • శశికాంత్‌ వల్లేపల్లి ఉదారత…700మందికి వైద్యసేవలు!
  • TANA-విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్న ఠాగూర్‌ మల్లినేని!
  • భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!
  • నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!
  • జగన్ ఊహించని రెండు పరిణామాలు
  • కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!
  • రెండు దశాబ్దాలు..!మృత్యుంజయుడై నిలిచిన చంద్రబాబు!!
  • మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్
  • ‘హుకూం’ పాట అసలు లేనే లేదట
  • ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?
  • ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ
  • Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?
  • చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

కమ్మ కులం పూజారి జగన్ !

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra