• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ అవినీతిని ఏకిపారేసిన మోడీ

admin by admin
May 6, 2024
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
69
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రాజమండ్రి బహిరంగ సభలో జగన్ పాలనలో అవినీతిని ప్రధాని నరేంద్ర మోడీ ఏకిపారేశారు.
నా ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు….రాజమండ్రి వాసులందరికీ నమస్కారాలు అంటూ ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఆదికవి నన్నయ నడయాడిన నేల ఇదని ఇక్కడే ఆయన తెలుగులో తొలి కావ్యాన్ని రచించారని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. ఈ గడ్డ నుంచి ఏపీలో నవ చరిత్ర మొదలుకాబోతుందని తనకు స్పష్టంగా తెలుస్తోందని మోదీ అన్నారు.

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జనసేనాని పవన్ కళ్యాణ్ , ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు హాజరయ్యారు. ప్రజలు వేసే ఓటుతో ఏపీ అభివృద్ధి యాత్రలో కొత్త అధ్యాయం ప్రారంభంకానుందని మోడీ అన్నారు. జగన్ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్ లో సాగుతోందని, అభివృద్ధికి మాత్రం బ్రేక్ పడిందని అన్నారు. మూడు రాజధానులు అంటూ భారీ స్థాయిలో ఖజానాను లూటీ చేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. జగన్ పాలన దుష్ఫలితాలు ఇలాగే ఉంటాయన్నారు.

జగన్ ప్రభుత్వంలోని నేతలు అవినీతి మాత్రమే చేయగలరని, అందుకే ఖజానా పూర్తిగా ఖాళీ అయిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అసలు తెలీదని, ప్రజాసేవ చేయాలన్న కోరిక లేదని అన్నారు. పోలవరానికి కేంద్రం 15 వేల కోట్లు ఇచ్చిందని, కానీ వైసీపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును ముందుకు సాగనీయకుండా బ్రేక్ వేసిందని ఆరోపించారు. వికసిత భారత్ లో వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా భాగమని, గత పదేళ్లలో ఏపీ అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నామని అన్నారు.

ఎన్టీఆర్ ఎన్నో పౌరాణిక పాత్రలలో నటించి ప్రజల హృదయాలను ఆకట్టుకున్నారని కొనియాడారు. ఏపీని గతంలోని చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి పథంలో తీసుకుపోయిందని, అన్నిట్లో రాష్ట్రాన్ని అగ్ర భాగాన నిలిపిందని ప్రశంసించారు. కానీ, వైసీపీ ప్రభుత్వం ఆ అభివృద్ధిని పట్టాలు తప్పించిందని, ప్రజల మేలు కోసం పనిచేయడానికి బదులు రాష్ట్రాన్ని భారీ అప్పులు ఊబిలో కూరుకుపోయేలా చేసిందని ఆరోపించారు. ఏపీలో వైసీపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఓట్లు అడిగేందుకు అర్హత లేదన్నారు. వైసీపీ ఏపీ ప్రజానీకం పూర్తిగా తిరస్కరించిందని, ఐదేళ్లు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వారు దుర్వినియోగపరిచారని ఆరోపించారు.

దేశంలో ఎన్నికలు జరుగుతున్న ప్రతి చోటా ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయం సాధించడం తధ్యమని, ఐదేళ్లపాటు ఇక్కడ ఏపీలో ప్రభుత్వం ఉండబోతుందని జోస్యం చెప్పారు.

Tags: Chandrababucm jagannda alliancepawan kalyanpm modirajahmundry meetingside effectsycp
Previous Post

అమరావతిపై అమిత్ షా గుడ్ న్యూస్

Next Post

జగన్ కొత్త జబ్బు ‘నార్సీ’పై చంద్రబాబు సెటైర్లు!

Related Posts

India

గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!

June 12, 2025
India

బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం

June 12, 2025
Andhra

ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

June 11, 2025
Andhra

`సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?

June 11, 2025
Andhra

పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌

June 11, 2025
Andhra

కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌

June 11, 2025
Load More
Next Post

జగన్ కొత్త జబ్బు ‘నార్సీ’పై చంద్రబాబు సెటైర్లు!

Latest News

  • గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!
  • బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
  • ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • `సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?
  • పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌
  • కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌
  • వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!
  • లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట
  • ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం
  • ముద్రగడకు క్యాన్స‌ర్‌.. ట్రీట్మెంట్ అందించని కుమారుడు.. కూతురు ఆవేద‌న‌!
  • `వెన్నుపోటు దినం` స‌రే.. మ‌రి వారెక్క‌డ జ‌గ‌న్‌..?
  • ఆ జడ్జికి షాకిచ్చేందుకు కేంద్రం రెడీ
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
  • పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra