• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బెంగాల్ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ తుపాకీ కాల్పులు.. సీన్ రిపీట్ అవుతుందా?

గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతోన్న టీఎంసీ, బీజేపీ నేతలు

admin by admin
April 17, 2021
in India, Top Stories
0
0
SHARES
113
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఐదో ద‌శ పోలింగ్ శ‌నివారం ఉద‌యం ఏడు గంట‌ల‌కు ప్ర‌శాంతంగా ప్రారంభ‌మైనా.. త‌ర్వాత త‌ర్వాత మాత్రం వేడెక్కింది. అధికార టీఎంసీ, బీజేపీ మధ్య నువ్వా-నేనా అనే విధంగా పోటీ నెలకొన్న బంగాల్లో ఎన్నికలు జరగనున్న 45 స్థానాల్లో ఉత్తర పరగణాలులో 16 స్థానాలు, తూర్పు వర్ధమాన్‌, నదియాలో 8, జాల్‌పాయ్‌గుడీలో ఏడు, డార్జీలింగ్‌లో ఐదు, కాలీంపాంగ్‌లో ఒక నియోజకవర్గానికి ఓటింగ్‌ జరగనుంది. వివిధ పార్టీల తరఫున పోటీలో ఉన్న 342 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని కోటీ 13లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు.

బ‌రిలో కీల‌క నేత‌లు..

మంత్రి బ్రత్యబసు, బీజేపీ నేత సామిక్‌ భట్టాచార్య, సిలిగుడి మేయర్‌, లెఫ్ట్‌ నేత అశోక్‌ భట్టాచార్య తదితరులు ఈ విడతలో పోటీ చేస్తున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఈ 45 నియోజకవర్గాల్లో టీఎంసీ కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యం సాధించింది. అదే 2016 శాసనసభ ఎన్నికల్లో టీఎంసీ 32 సీట్లు గెలుపొందగా కాంగ్రెస్‌-లెఫ్ట్‌ కూటమి 10స్థానాలు కైవసం చేసుకుంది. ఈ క్ర‌మంలో మ‌మ‌తా బెన‌ర్జీ ఈ ఐదో ద‌శ‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంన్నారు. ఇక‌, ఐదో విడత పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది.

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కం..

కూచ్‌బిహార్‌ కాల్పుల ఘటన నేపథ్యంలో 48 గంటలకు బదులు 72 గంటల ముందుగానే ప్రచారాన్ని నిలిపి వేసింది. నాలుగో విడతలో రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఐదుగురు చనిపోవటంతో ఈసీ అప్రమత్తమైంది. పోలింగ్‌ జరిగే 45 నియోజకవర్గాల పరిధిలో రాష్ట్ర పోలీసులతోపాటు 853 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. బంగాల్లో ఇప్పటివరకు నాలుగు దశల్లో 135 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరో 159 స్థానాలకు ఏప్రిల్ 17- 29 మధ్యలో పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు ప్రకటించనున్నారు.

మ‌ళ్లీ కాల్పులు.. హ‌డ‌లిపోయిన జ‌నం

ఉత్తర 24 పరగణాలు జిల్లా దేగంగా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కురల్గచ్చా పోలింగ్ బూత్ వద్ద కేంద్రం బలగాలు శ‌నివారం గాల్లోకి కాల్పులు జరిపాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఓట‌ర్లు హ‌డ‌లి పోయారు. అస‌లు ఏం జ‌రుగుతోందో తెలియ‌లేద‌ని ఓట‌ర్లు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. పోలింగ్ స్టేషన్ ముందు భారీగా గుమిగూడిన సమూహాన్ని చెదరగొట్టేందుకు ఈ చర్యకు పాల్పడ్డాయి. అంతకుముందు ఇక్కడ లాఠీ ఛార్జ్ కూడా జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ఎన్నికల సంఘం జిల్లా అధికారులను ఆదేశించింది.

Tags: assembly electionsecfiringpollingwest bengal
Previous Post

తెలంగాణలో తాజా పాజిటివ్ లు తెలిస్తే షాకే.. హైదరాబాద్ లో మాత్రం తక్కువే

Next Post

‘తానా’ ఎన్నికల ప్రచారం–సిలికాన్ వ్యాలీ లో సందడి చేసిన డాక్టర్ నరేన్ కొడాలి టీం

Related Posts

Top Stories

సర్కారు వారి ‘పాఠా’నికి ఫుల్ డిమాండ్

July 6, 2022
Trending

రిషికొండ రిసార్ట్..జగన్ కు హైకోర్టూ షాకిచ్చిందే !

July 6, 2022
Top Stories

ఆ పార్టీకి షాక్…అంత పెద్దాయ‌న వ‌స్తే చేరిక‌లు లేవేట్రా?

July 6, 2022
Top Stories

ఫేమస్ వాస్తు నిపుణుడు.. 39 కత్తి పోట్లు పొడిచి చంపేశారు

July 6, 2022
Trending

జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !

July 6, 2022
Trending

టాలీవుడ్ లో విషాదం…ఆయన మృతి తీరని లోటు

July 6, 2022
Load More
Next Post

'తానా' ఎన్నికల ప్రచారం--సిలికాన్ వ్యాలీ లో సందడి చేసిన డాక్టర్ నరేన్ కొడాలి టీం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • సర్కారు వారి ‘పాఠా’నికి ఫుల్ డిమాండ్
  • రిషికొండ రిసార్ట్..జగన్ కు హైకోర్టూ షాకిచ్చిందే !
  • ఆ పార్టీకి షాక్…అంత పెద్దాయ‌న వ‌స్తే చేరిక‌లు లేవేట్రా?
  • ఫేమస్ వాస్తు నిపుణుడు.. 39 కత్తి పోట్లు పొడిచి చంపేశారు
  • జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !
  • టాలీవుడ్ లో విషాదం…ఆయన మృతి తీరని లోటు
  • కాళీమాతపై ఆ ఎంపీ షాకింగ్ కామెంట్లు..వైరల్
  • అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం
  • పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?
  • బ్రేకింగ్:రఘురామపై మరో కేసు
  • 37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ
  • ‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత
  • నెక్స్ట్ రఘురామ ఏపీలో అడుగుపెట్టేది అప్పుడేనట
  • చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
  • పిల్లల్ని కనని వాళ్లకి అవార్డు ఇస్తా

Most Read

ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్

చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

యథా రాజా.. తథా పోలీసు!

కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !

జ‌గ‌న్‌పై సెటైర్లు…ఎవరికైనా చూపించడ్రా…అలా వదిలేయకండి…

అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra