• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సోషల్ మీడియా సంస్థలపై సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

జడ్జిలను దూషించినా చర్యలు తీసుకోవడం లేదంటూ తీవ్ర ఆవేదన

admin by admin
September 2, 2021
in India, Top Stories, Trending
0
0
SHARES
428
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై గతంలో ఏపీ సీఎం జగన్ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఏకంగా సుప్రీం కోర్టు జడ్జిలపై జగన్ ఆరోపణలు చేస్తూ లేఖలు రాయడం జాతీయస్థాయిలో దుమారం రేపింది. ఇక, తమ అధినేత బాటలోనే నడిచిన వైసీపీ నేతలు కూడా తామేం తక్కువ కాదన్న రీతిలో న్యాయవ్యవస్థపై విమర్శలు గుప్పించడం సంచలనం రేపింది. న్యాయ వ్యవస్థలు, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వైసీపీ నేతలు విమర్శలు గుప్పించడంపై చర్చ జరిగింది.

దీంతో, కోర్టులు, జడ్జిలను విమర్శించిన వైసీపీ నేతలపై పలు న్యాయస్థానాలు సీరియస్ అయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో వైసీపీ నేతలు అసహనానికి గురై…కోర్టులు, జడ్జిలపై నేరుగానే విమర్శలు గుప్పించారు. న్యాయస్థానానికి, న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదిస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. కోర్టులను విమర్శిస్తూ, జడ్జిలపై దూషణలకు దిగుతూ సోషల్ మీడియాలో చెలరేగిపోయారు.

ఈ నేపథ్యంలో 49 మందికి ‘కోర్టు ధిక్కరణ’ కింద నోటీసులు జారీ చేసింది. ఆ 49 మందిలో వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కూడా ఉన్నారు. కోర్టులపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. అయితే, వారికి కోర్టు నోటీసులిచ్చి…వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సదరు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ను హైకోర్టు ఆదేశించింది. కానీ, ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై సీజేఐ ఎన్వీ రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు చెప్పినా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. శక్తివంతమైన వ్యక్తులు చెబితే మాత్రమే సోషల్ మీడియా సంస్థలు సత్వర చర్యలు తీసుకుంటున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కరోనా ఫస్ట్ వేవ్ వ్యాప్తికి తబ్లిగ్ జమాత్ సమావేశాలే కారణమంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు మతం రంగు పులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది దేశానికే ప్రమాదకరమని జస్టిస్ ఎన్వీ రమణ హెచ్చరించారు.

సోషల్ మీడియా కేసులకు సంబంధించిన వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లన్నింటినీ సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై ధర్మాసనం స్పందించింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు కేసును ఆరు వారాల తర్వాత లిస్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సీజీఐ ఎన్వీ రమణ సూచించారు. మన అభిప్రాయాలను నిర్భయంగా చెప్పుకునే ప్లాట్ ఫామ్ సోషల్ మీడియా అని, మంచికి వాడితే అదో మంచి ఆయుధమని, కొందరు దానిని దుర్వినియోగపరుస్తూ సమాజంలో చిచ్చు పెడుతున్నారని అభిప్రాయపడ్డారు.

సోషల్ మీడియా, వెబ్ పోర్టళ్ల తీరుపై సీజీఐ ఎన్వీ రమణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జవాబుదారీతనం, సరైన నియంత్రణ లేకపోవడంతో వ్యక్తుల పరువుకు నష్టం కలుగుతోందని అభిప్రాయపడ్డారు. ఇది, దేశానికి ఎంతో ప్రమాదకరమని, ప్రజల మధ్య విద్వేషాలకు, దేశంలో అలజడులకు ఇదే కారణమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags: CJI justice nv ramanashocking commentssocial media platforms
Previous Post

చంద్రబాబుతో గోరంట్ల భేటీ…కీలక హామీ?

Next Post

షాకింగ్: ఏపీలో ఆ ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్ష

Related Posts

ys jagan
Andhra

బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?

March 21, 2023
revanth
Politics

తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట

March 21, 2023
kcr speech
Telangana

కేసీఆర్ ధీమా వెనుక

March 21, 2023
Top Stories

వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు

March 20, 2023
Trending

ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్

March 20, 2023
Trending

అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు

March 20, 2023
Load More
Next Post

షాకింగ్: ఏపీలో ఆ ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్ష

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?
  • తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట
  • కేసీఆర్ ధీమా వెనుక
  • వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు
  • ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్
  • అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు
  • ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌
  • రేవంత్ దెబ్బకు ప్రగతిభవన్ ఉక్కిరిబిక్కిరి
  • ఒత్తిడికి తలొంచక తప్పలేదా?
  • బీఆర్ఎస్ లో ఈ హడావుడి ఎందుకో తెలుసా ?
  • జగన్ పతనానికి ఈ ఫలితాలే నాంది: లోకేష్
  • ఓటమిపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ సభ్యుల ఘర్షణ
  • 3…  చూడ్డానికే మూడే కానీ YCP కి మూడినట్లే
  • చంద్ర‌బాబు వైరల్ కామెంట్స్‌

Most Read

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

శ్రీకాంత్ కొడుకు… ఒకేసారి రెండు

ఆస్కార్ గెలిచిన ‘ది ఎలిఫెంట్ విప్సరర్స్’ సంగతేంటి?

బెల్లంకొండ ఏంటి ఇంత పెద్ద షాకిచ్చాడు !

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

జ‌న‌సేన‌ : ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు ప‌వ‌న్ ఆహ్వానం

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra