• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

షాకింగ్: ఏపీలో ఆ ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్ష

భూమికి నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం...జైలు శిక్ష, జరిమానా విధించిన హైకోర్టు

admin by admin
September 2, 2021
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
224
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జగన్ సర్కార్ లోని పలువురు ఐఏఎస్ లు, అధికారుల తీరుపై హైకోర్టు గతంలో చాలాసార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని హైకోర్టు గతంలోనే పలుమార్లు హెచ్చరించింది. అయితే, కోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా ఇటు ప్రభుత్వం, అటు అధికారులు తీరులో మార్పు రాకపోవడంతో గతంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు వారం రోజుల పాటు జైలు శిక్ష కూడా విధించింది.

హైకోర్టు తీర్పును అమలు చేయలేదని ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్‌ లకు హైకోర్టు గతంలో వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం సంచలనం రేపింది. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆ ఇద్దరు ఐఏఎస్ లు అమలు చేయకపోవడంతో వారికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది. అయినప్పటికీ, ఏపీలో మరికొందరు ఐఏఎస్ ల తీరు మారకపోవడంతో తాజాగా మరోసారి హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సంచలన తీర్పునిచ్చింది.

నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళ భూమికి సంబంధించిన నష్టపరిహారం చెల్లించడంలో కోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టడంతో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం చేయడమే కాకుండా, చెల్లించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలనూ లెక్కచేయకపోవడంతో ఆ ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్ష, జరిమానా విధించడం సంచలనం రేపింది. వారికి విధించిన జైలుశిక్షపై అప్పీలుకు వెళ్లేందుకు వారికి నెల రోజుల పాటు శిక్షను సస్పెండ్‌ చేసింది.

నెల్లూరుకు చెందిన తాళ్లపాక సాయి బ్రహ్మ అనే మహిళ భూమి తీసుకొని నష్టపరిహారం చెల్లించడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఆ తర్వాత ఆమెకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కానీ, కోర్టు ఆదేశించిన తర్వాత కూడా చెల్లింపులో జాప్యం జరగడంతో, ఆ నష్టపరిహారం చెల్లింపులో జాప్యానికి కారణమైన మాజీ ఐఏఎస్‌ అధికారి మన్మోహన్ సింగ్‌కు నెల రోజుల జైలు శిక్షతోపాటు రూ.లక్ష జరిమానాను హైకోర్టు విధించింది. ఆయనతోపాటు అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిరావుకు 2 వారాల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించింది.

ఐఏఎస్‌ అధికారి రావత్‌కు నెల రోజుల జైలు శిక్ష, రూ.1000 జరిమానా, ముత్యాల రాజుకు 2 వారాల జైలు శిక్ష, రూ. 1000 జరిమానా, ఏఎంబీ ఇంతియాజ్‌కు 2 వారాల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. అంతేకాదు, ఆ ఐఏఎస్ అధికారుల జీతాలలో కట్ చేసిన సొమ్ముతో సదరు మహిళకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేయడం ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. మరి, హైకోర్టు తాజా తీర్పుతోనైనా కోర్టు ఆదేశాలను అధికారులు, ఐఏఎస్ లు బేఖాతరు చేయకుండా ఉంటారా లేదా అన్నది వేచి చూడాలి.

Tags: AP High courtcompensation for land issuecontempt of courtfine for 5 IAS officersimprisonment to 5 IAS officersshocking verdict
Previous Post

సోషల్ మీడియా సంస్థలపై సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

Next Post

YSR ఆత్మీయ సమ్మేళనాకి ఎవరెవరొచ్చారు?

Related Posts

ys jagan
Andhra

బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?

March 21, 2023
revanth
Politics

తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట

March 21, 2023
kcr speech
Telangana

కేసీఆర్ ధీమా వెనుక

March 21, 2023
Top Stories

వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు

March 20, 2023
Trending

ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్

March 20, 2023
Trending

అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు

March 20, 2023
Load More
Next Post

YSR ఆత్మీయ సమ్మేళనాకి ఎవరెవరొచ్చారు?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?
  • తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట
  • కేసీఆర్ ధీమా వెనుక
  • వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు
  • ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్
  • అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు
  • ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌
  • రేవంత్ దెబ్బకు ప్రగతిభవన్ ఉక్కిరిబిక్కిరి
  • ఒత్తిడికి తలొంచక తప్పలేదా?
  • బీఆర్ఎస్ లో ఈ హడావుడి ఎందుకో తెలుసా ?
  • జగన్ పతనానికి ఈ ఫలితాలే నాంది: లోకేష్
  • ఓటమిపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ సభ్యుల ఘర్షణ
  • 3…  చూడ్డానికే మూడే కానీ YCP కి మూడినట్లే
  • చంద్ర‌బాబు వైరల్ కామెంట్స్‌

Most Read

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

శ్రీకాంత్ కొడుకు… ఒకేసారి రెండు

ఆస్కార్ గెలిచిన ‘ది ఎలిఫెంట్ విప్సరర్స్’ సంగతేంటి?

బెల్లంకొండ ఏంటి ఇంత పెద్ద షాకిచ్చాడు !

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

జ‌న‌సేన‌ : ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు ప‌వ‌న్ ఆహ్వానం

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra