ఏపీ అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే ప్రధమం. మొత్తం రూ.3,22,359 కోట్లతో బడ్జెట్ ను తీసుకొచ్చారు. రాష్ట్ర బడ్జెట్ రూ. 3 లక్షలు కోట్లు దాటడం తొలిసారి కాగా.. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో రూ. 3 లక్షల కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఇక కేటాయింపుల విషయానికి వస్తే..
2025-26 వార్షిక బడ్జెట్ రూ.3 లక్షల 22 వేల 359 కోట్లు
రెవెన్యూ వ్యయం – రూ. 2,51,162 కోట్లు
రెవెన్యూ లోటు – రూ. 33,185 కోట్లు
ద్రవ్య లోటు – రూ. 79,926 కోట్లు
మూల ధన వ్యయం – రూ.40,635 కోట్లు
పాఠశాల విద్యకు – రూ.31,806 కోట్లు
బీసీ సంక్షేమానికి – రూ.23,260 కోట్లు
వైద్యారోగ్య శాఖకు – రూ.19,260 కోట్లు
పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధికి – రూ.18,848 కోట్లు
జలవనరుల అభివృద్ధికి – రూ.18,020 కోట్లు
మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధికి – రూ.13,862 కోట్లు
విద్యుత్ శాఖకు – రూ.13,600 కోట్లు
వ్యవసాయానికి – రూ.48,340 కోట్ల కోట్లు
సాంఘిక సంక్షేమానికి రూ.10,909 కోట్లు
ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రూ.10,619 కోట్లు
రవాణా శాఖకు – రూ.8,785 కోట్లు
పోలవరం ప్రాజెక్ట్కు – రూ.6,705 కోట్లు
వ్యవసాయ, అనుబంధ రంగాలకు – రూ.13,487 కోట్లు
పౌరసరఫరాల శాఖకు – రూ.3,806 కోట్లు
జల్జీవన్ విషన్కు – రూ.2,800 కోట్లు
స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు – రూ.1,228 కోట్లు
ఎస్టీల సంక్షేమానికి – రూ.8,159 కోట్లు
అల్పసంఖ్యాక వర్గాలకు – రూ.5,434 కోట్లు
బీసీల సంక్షేమానికి – రూ.47,456 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి – రూ.20,281 కోట్లు
యువజన, సాంస్కృతిక శాఖకు – రూ.469 కోట్లు
తెలుగు భాష అభివృద్ధి, ప్రచారంకు – రూ.10 కోట్లు
నవోదయ 2.0 కార్యక్రమానికి – రూ.10 కోట్లు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి – రూ.3,486 కోట్లు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు – రూ.500 కోట్లు
ధరల స్థిరీకరణ నిధికి – రూ.300 కోట్లు
ITI, IITల కోసం రూ.210 – కోట్లు
ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి – రూ.62 కోట్లు
ఇరిగేషన్ ప్రాజెక్టులకు – రూ. 11,314 కోట్లు
మత్స్యకార భరోసాకు – మరూ.450 కోట్లు
దీన్దయాళ్ అంత్యోదయ యోజనకు – రూ.745 కోట్లు
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు – రూ.10కోట్లు
మహిళా శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగులకు – రూ.4,332 కోట్లు
వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి – రూ.19,264 కోట్లు
R&B కి – రూ.8,785 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య శాఖకు – రూ.3,156 కోట్లు
పోర్టులు, ఎయిర్పోర్టులకు – రూ.605 కోట్లు
RTGSకు – రూ.101 కోట్లు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు – రూ.27,518 కోట్లు
అన్నదాత సుఖీభవకు – రూ.6,300 కోట్లు
చేనేత, నాయీ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్కు – రూ.450 కోట్లు
బాల సంజీవని పథకం కోసం – రూ.1,163 కోట్లు
ఐటీ, ఎలక్ట్రానిక్స్ రాయితీలకు – రూ.300 కోట్లు
ఆదరణ పథకం కోసం – రూ.1000 కోట్లు
మనబడి పథకం కోసం – రూ.3,486 కోట్లు
అమరావతి నిర్మాణానికి – రూ.6 వేల కోట్లు
తల్లికి వందనం కోసం – రూ.9,407 కోట్లు
దీపం 2.0 పథకానికి – రూ.2,601 కోట్లు
రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు – రూ.4,220 కోట్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్షిప్పులకు – రూ.3,377 కోట్లు
పురపాలక శాఖకు – రూ.13,862 కోట్లు
స్వచ్ఛ ఆంధ్ర కోసం – రూ.820 కోట్లు
ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్కు – రూ.400 కోట్లు