• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలి -అమెరికాలో ‘ధూళిపాళ్ల నరేంద్ర’ 

admin by admin
August 27, 2022
in Uncategorized
1
0
SHARES
942
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని ధూళిపాళ్ల నరేంద్ర కోరారు. ది.26-08-2022 శుక్రవారం వాషింగ్టన్ డీసీలో అమెరికాలో ఉన్న అమరావతి రాజధాని ప్రాంత ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులతో సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి భాను మాగులూరి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొని అమరావతి ప్రాంత రైతులతో చర్చించారు.

సెప్టెంబర్ 12వ తేదీ నాటికి అమరావతి రాజధాని ఉద్యమం ప్రారంభమై వెయ్యి రోజులు పూర్తవుతోంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని రాజధాని ప్రాంతంలో రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా అమెరికాలో కూడా పాదయాత్ర నిర్వహించడం, ప్రధాన నగరాల్లో అమరావతికి మద్దతుగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఆనాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రాజధాని రాష్ట్రానికి నడిబొడ్డులో ఉండాలి, కనీసం 30వేల ఎకరాలు కావాలి, 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయినందున ప్రాంతీయ చిచ్చుపెట్టడం ఇష్టంలేక అమరావతి రాజధానిని మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నానని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. తర్వాత మాటతప్పి ప్రజలను మోసం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి రాజధానిని మార్చే హక్కుగాని, మూడు రాజధానులు పెట్టే అధికారం లేదని తెలుసు. కానీ మూడేళ్లపాటు ప్రజలను మభ్యపెట్టారు. ఇటీవల రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రైవేటు బిల్లు పార్లమెంట్ లో పెట్టడం ద్వారా మరింత తేటతెల్లమైంది. అయినా ఆశ చావక రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పెట్టేందుకు దురాలోచన చేస్తున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని అభూతకల్పనలను, పచ్చి అబద్ధాలను వల్లెవేశారు. న్యాయస్థానం స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ ఖాతరు చేయకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్నం పెట్టకపోగా.. పేదవాడికి పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య. ఇది జగన్ రెడ్డి పైశాచికత్వానికి పరాకాష్ట. కుప్పంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు గారిని అడ్డుకోవడం అప్రజాస్వామికం.

భాను మాగులూరి మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు సైతం అసహ్యించుకుంటున్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ప్రజలను చైతన్యపరిచే క్రమంలో సోషల్ మీడియా వేదికగా వెంగళరావు ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించాడు. రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛను హరిస్తూ జగన్ రెడ్డి పోలీసుల ద్వారా అమానుషంగా కొట్టడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మన్నవ వెంకటేశ్వరరావు, శ్రీకాంత్ ఆచంట, చనుమోలు అనిల్ కుమార్, ధూళిపాళ్ల వీరనారాయణ, కోట రామ్మోహన్, కిషోర్ కంచర్ల, ముప్పనేని జగన్మోహన్ రావు, అజయ్ గోవాడ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం శ్రీకాంత్ ఆచంట, మన్నవ వెంకటేశ్వరరావు ధూళిపాళ్ల నరేంద్రను ఘనంగా సత్కరించారు.

Tags: AmaravatiAP Capitaldhilipalla narendraUSA
Previous Post

పవన్ పై కక్షతోనే ఫ్లెక్సీ బ్యాన్ అంటోన్న గోరంట్ల

Next Post

ఈ రేటింగ్ ను అస్సలు తట్టుకోలేకపోతున్న లైగర్

Related Posts

Uncategorized

NRI TDP-ఎన్నారై టిడిపి ద్వారా డిగ్రీ చదువుకున్న 17 మందికి మంగళగిరి స్టార్ట్ అప్ కంపెనీలో ఉద్యోగాలు!

March 2, 2023
Uncategorized

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధుల బృందంతో ప్రవాస భారతీయుల సమావేశం!

February 25, 2023
Top Stories

కళాతపస్వి సినిమాలు ఎందుకు ప్రత్యేకం?

February 3, 2023
Top Stories

జగన్ పై ‘జనవాణి’ బట్టబయలు చేసిన లోకేష్

January 28, 2023
Uncategorized

పొంగులేటి రాక ఆలస్యం ఎందుకు జరుగుతుంది.??

January 21, 2023
Uncategorized

గుంటూరు మృతుల కుటుంబాలకు 10,00,000( పది లక్షల రూపాయలు) ఆర్ధిక సాయం అందజేసిన మన్నవ మోహనకృష్ణ!

January 21, 2023
Load More
Next Post

ఈ రేటింగ్ ను అస్సలు తట్టుకోలేకపోతున్న లైగర్

Comments 1

  1. Pingback: అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలి -అమెరికాలో ‘ధూళిపాళ్ల నరేంద్ర’  - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • వైసీపీ ఎమ్మెల్యేల‌పై సస్పెన్ష‌న్‌.. మ‌రి వారు ఎలా రియాక్ట్ అయ్యారంటే!
  • పవన్ సినిమాకు ‘మెగా’ మార్కు డేట్ 
  • మనోజ్‌తో గొడవపై విష్ణు స్పందన
  • ‘సౌండ్ పెంచమని చెప్పు’ అనేందుకు అలా చేసుడేంది కేసీఆర్?
  • రచ్చకెక్కుతున్న ‘మంచు’ గొడవ
  • స్పీకర్ తమ్మినేని గుట్టు విప్పిన టీడీపీ నేత
  • చంద్రబాబు లెక్కసరిచేశారా?
  • నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే
  • ఎమ్మెల్యేలను పూచికపుల్లలా తీసేస్తే ఇలాగే ఉంటుంది జగన్ మావా !
  • టీఎస్ పీఎస్సీ బోర్డే వివాదాస్పదమా ? 
  • టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?
  • స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?
  • వైసీపీలో వారిపై  అనుమానం చూపులు
  • ‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం
  • నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!

Most Read

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra