• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అధికారం ద‌క్కి మూడేళ్లు దాటినా.. బాబుపై అదే అక్క‌సు..

NA bureau by NA bureau
August 25, 2022
in Andhra, Politics, Top Stories, Trending
1
ys jagan

ys jagan

0
SHARES
171
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో ప్ర‌భుత్వం మారిపోయి.. మూడేళ్లు దాటింది. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప‌క్క‌కు వెళ్లి మూడేళ్లు అయింది. అదేస‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. మ‌రి ఈ మూడేళ్ల‌లో ఆయ‌న ఏం చేశార‌నేది ప్ర‌స్తుతం చ‌ర్చ‌కు వ‌చ్చే.. రావాల్సిన విష‌యం. కానీ.. ఇప్ప‌టికీ.. చంద్ర‌బాబు పాల‌న‌పై అదే అక్క‌సు వెళ్ల గ‌క్కుతున్నారు. త‌మ ప్ర‌భుత్వ లోపాల‌ను.. త‌మ వైఫ‌ల్యాల‌ను ఎవ‌రు ప్ర‌శ్నించినా.. వెంట‌నే చంద్ర‌బాబు పాల‌న గురించే చ‌ర్చిస్తున్నారు. `అదిగో అప్పుడే.. ఇలా చేసి ఉంటే“ అంటూ.. వ్యాఖ్యానిస్తున్నారు.

అలా చేశారో.. చేయ‌లేదో.. ప‌క్క‌న పెడితే.. మీరు ఏం చేస్తున్నార‌నేది.,. ప్ర‌ధాన ప్ర‌శ్న‌. కానీ.. దీనికి వైసీపీ నాయ‌కులు మాత్రం.. దాట‌వేస్తున్నారు. తాజాగా రాష్ట్ర విభజన అంశాలు, ఆర్థిక సంబంధిత అంశాలపై ఢిల్లీలో ఆర్థికశాఖ సమావేశం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ఎంపీ విజయసాయిరెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం భేటీలో చర్చించిన అంశాలను బుగ్గన, విజయసాయి రెడ్డి మీడియాకు వెల్లడిం చారు. సమావేశంలో విభజన చట్టంలోని పలు అంశాలపై చర్చించినట్లు బుగ్గన స్పష్టం చేశారు. 2016 లోపు పూర్తి కావాల్సినవి ఇంకా జరగలేదన్నారు.

గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కేంద్రాన్ని సరిగ్గా అడిగి ఉంటే హామీలన్నీ గతంలోనే పూర్తయి ఉండేవన్నారు. ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక వనరులు లేకుండా చూడాలని టీడీపీ  ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రధానితో సీఎం జగన్ చర్చించిన అంశాలపై భేటీలో చర్చ జరిగిందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.

గత ప్రభుత్వం తీసుకున్న రుణాలను రెగ్యులరైజ్‌ చేయాలని కోరామన్నారు. తెలంగాణ నుంచి రావాల్సిన రూ.6500 కోట్ల విద్యుత్‌ బకాయిల గురించి చర్చించామన్నారు. పోలవరం ప్రాజెక్టు, భోగాపురం పోర్టుకు ఎన్‌వోసీ గురించి చర్చించామని తెలిపారు.

విభజన చట్టంలోని పలు అంశాలపై చర్చించామ‌ని చెప్పారు. పౌరసరఫరాలశాఖ రుణాలను విభజన చేయాలని కోరామ‌న్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌కు గనుల కేటాయింపు గురించి అడిగామ‌న్నారు. బీచ్ సాండ్‌ నిబంధనలు సవరించాలని కోరిన‌ట్టు తెలిపారు. కొత్త జిల్లాలకు వైద్య కళాశాలలు మంజూరు చేయాలని కోరామ‌ని, 12 జిల్లాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు సహకరించాలని కోరామ‌ని సాయిరెడ్డి వివ‌రించారు. ప‌నిలో ప‌నిగా.. “ఇవ‌న్నీ చంద్ర‌బాబు హ‌యాంలోనే చేయాల్సిన ప‌నులు. ఇప్పుడు మేం చేస్తున్నాం“ అంటూ.. విమ‌ర్శ‌ల రాళ్లు రువ్వారు.

Tags: bugganaChandrababuJaganvijaya sai reddyYSRCP
Previous Post

వినాయ‌క చ‌వితి పందిళ్ల‌పై ఏపీ స‌ర్కారు వీర బాదుడు

Next Post

రేవంత్ రెడ్డి నిర్ణయమే ఫైనలా?

Related Posts

Trending

మంత్రులను ఫుట్ బాల్ ఆడుకునే మ్యాటర్ చెప్పిన చంద్రబాబు

June 9, 2023
Trending

వివేకా కేసులో జగన్, భారతిలకు రఘురామ సూటి ప్రశ్న

June 9, 2023
Trending

మాగుంట రాఘవ్ బెయిల్ రద్దు…సుప్రీం నిర్ణయం

June 9, 2023
Trending

ఆమెను చూసి సాష్టాంగ నమస్కారం పెట్టేసిన స్టార్ హీరో

June 9, 2023
lokesh rally
Top Stories

న్యాయవాదులకు న్యాయం చేస్తానంటోన్న లోకేష్

June 8, 2023
Top Stories

మాగుంట రాఘవకు ఈడీ షాక్..అనూహ్యం

June 8, 2023
Load More
Next Post

రేవంత్ రెడ్డి నిర్ణయమే ఫైనలా?

Comments 1

  1. Pingback: అధికారం ద‌క్కి మూడేళ్లు దాటినా.. బాబుపై అదే అక్క‌సు.. - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • మంత్రులను ఫుట్ బాల్ ఆడుకునే మ్యాటర్ చెప్పిన చంద్రబాబు
  • వివేకా కేసులో జగన్, భారతిలకు రఘురామ సూటి ప్రశ్న
  • మాగుంట రాఘవ్ బెయిల్ రద్దు…సుప్రీం నిర్ణయం
  • ఆమెను చూసి సాష్టాంగ నమస్కారం పెట్టేసిన స్టార్ హీరో
  • న్యాయవాదులకు న్యాయం చేస్తానంటోన్న లోకేష్
  • మాగుంట రాఘవకు ఈడీ షాక్..అనూహ్యం
  • టీడీపీ ఇన్చార్జులపై నోరుజారిన కేశినేని నాని
  • అవినాష్ రెడ్డికి సీబీఐ భారీ షాక్
  • రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు
  • ఆ ఘనత సీఎం జగన్ ఒక్కడికే దక్కింది..అయ్యన్న సెటైర్లు
  • ఆదిపురుష్ టీంపై దుష్ప్ర‌చారం
  • మ‌డ‌మ తిప్ప‌డం అంటే.. ఇది కాదా జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఫైర్‌
  • #ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!
  • శక పురుషునికి ‘బాటా’ శత జయంతి నీరాజనం!
  • మిషన్ రాయలసీమతో సీమ కష్టాలకు శాశ్వత పరిష్కారం – నారా లోకేష్!

Most Read

#ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు

అవినాష్ రెడ్డికి సీబీఐ భారీ షాక్

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra