‘బాహుబలి’తో రాజమౌళి రేంజ్ ఎంత పెరిగిందో కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ రేంజ్ కూడా అంతలా పెరిగింది.
కేజీఎఫ్ 2 కోసం ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఆ ప్రశాంత్ నీల్ మెగా కాంపౌండ్ లోకి అడుగు పెడుతున్నారు అంటూ ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. అది ఈరోజు కన్ ఫం అయిపోయింది.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆ చిత్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రాజెక్టులు ఎంచుకోవడంలో చాాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.
దానికి అనుగుణంగా రాంచరణ్ ప్రశాంత్ నీల్ ను పట్టేసినట్టు అర్థమైపోతోంది. విచిత్రం ఏంటంటే… ఇప్పటికే ఎన్టీఆర్ కూడా అతనితో సినిమా ఓకే చేశారు.
చరణ్ తన 17వ సినిమాను చరణ్ ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్తో చేయబోతుండటం విశేషం. దీని గురించి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. ఈ దిశగా హింట్స్ అయితే వచ్చాయి. చిరంజీవి, చరణ్లను కలిసిన ఫొటోను ప్రశాంత్ నీల్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఇప్పటికే కేజీఎఫ్ 2 పూర్తిచేసిన ప్రశాంత్… ప్రస్తుతం ‘సలార్’ చేస్తున్నారు. దాని తర్వాత తారక్ సినిమాను డైరెక్ట్ చేస్తాడు. అదయ్యాక రాంచరణ్ సినిమా ఉంటుంది.
రామ్ చరణ్ చేతిలో ఇపుడు మూడు సినిమాలున్నాయి.
ఒకటి శంకర్ సినిమా ఇప్పటికే సెట్స్ మీదికి వెళ్లిపోయింది.
ఆ తర్వాత ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు.
తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా లో నటిస్తారు. బహుశా ఈ సినిమా 2023లో సెట్స్ మీదికి వెళ్లొచ్చు.
Met a legend, and another in the making. Thank you @AlwaysRamCharan for hosting us, had a wonderful evening. Meeting chireenjavi garu @KChiruTweets was a childhood dream come true!@DVVMovies pic.twitter.com/9MXSvcnX29
— Prashanth Neel (@prashanth_neel) October 15, 2021