• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ ఫలితాలతో జగన్ గుండెళ్లో రైళ్లు…రామ్మోహన్ నాయుడు

admin by admin
March 11, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
381
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ మాట్లాడిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో జగన్ మాట్లాడుతున్న మాటలకు ఏ మాత్రం పొంతన లేదన్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తమ ఎంపీ అభ్యర్థులు 25 మందిని గెలిపిస్తే పార్లమెంటుకు వెళ్లి మోడీ మెడలు వంచుతామని, ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు నెరవేరుస్తామని జగన్ మైకులు, స్పీకర్లు పగిలిపోయేలా హామీలు గుప్పించారు.

జగన్ ను నమ్మిన జనం…నిజంగా అలాగే జరుగుతుంది కాబోలు అంటూ వైసీపీకి పట్టం కట్టి 23 మంది ఎంపీలకు కట్టగట్టి మరీ పార్లమెంటుకు పంపించారు. ఇది జరిగి రెండున్నరేళ్లయినా సరే…వైసీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లడం…రావడం తప్ప పెద్దగా చేసిందేమీ లేదు. ఇక, హోదా సంగతి ఊసే లేదు. జనం అడుగుతారేమో అన్న ఒకే ఒక్క కారణంతో…అడపాదడపా…మాకు హోదా కావాలంటూ ఎంపీలు షో చేయడం మినహా…గట్టిగా హోదా కోసం మోడీని నిలదీసిన దాఖలాలు లేవు. అదేమంటే, కేంద్రంలో బీజేపీకి సంఖ్యాబలం ఎక్కువుందని, కాబట్టి 2024 వరకు మోడీని హోదా గురించి గట్టిగా నిలదీసి అడగడం కుదరదని జగన్ ఒక్క ముక్కలో తేల్చేశారు.

ఇక, తాజాగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేంద్రంలో మోడీ సర్కార్ బలం మరింత పెరిగింది. దీంతో, హోదా విషయం అటకెక్కినట్లేనని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్‌ పై టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు విమర్శలు గుప్పించారు. తాజా ఫలితాలతో జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ఇకపై కేంద్రాన్ని చూసి ఆయన మరింత భయపడతారని రామ్మోహన్ నాయుడు చురకలంటించారు.

మోడీకి జగన్ దాసోహం అయిన ఫలితంగా రాష్ట్రానికి మరింత అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫలితాలతో బీజేపీ మరింత బలంగా మారిందని, రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు, నిధుల గురించి ఇకపై కేంద్రాన్ని అడగలేని బలహీన పరిస్థితిలోకి జగన్ వెళ్లిపోతారని అన్నారు. పార్లమెంటులో తమ బలం తక్కువగా ఉన్నా…రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడుతున్నామన్నారు. ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తుండడం వల్లే రాష్ట్రంలో బీజేపీ బలపడడం లేదని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు బలహీనపడుతున్నాయన్న వాదనను కొట్టిపారేశారు. ‘పాంచ్ పటాకా’తో జగన్ గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయని రామ్మోహన్ నాయుడు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Tags: ap cm jaganfive states electionsjagan is fearful to modino special status to appm modishocking commentstdp mp rammohan naidu
Previous Post

వైసీపీ మేయర్ ‘సర్కారు వారి పాట’…’షో’కు 100 టికెట్లు

Next Post

శ‌ర్వాపై అలాంటి రూమ‌రా.. అస్స‌లు న‌మ్మేలా లేదే!

Related Posts

Trending

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

September 28, 2023
nara lokesh yuvagalam gets huge response
Trending

లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే

September 28, 2023
Trending

సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు

September 28, 2023
Top Stories

భువనేశ్వరి బలంగానే!

September 28, 2023
Top Stories

ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు

September 28, 2023
Top Stories

తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ

September 28, 2023
Load More
Next Post

శ‌ర్వాపై అలాంటి రూమ‌రా.. అస్స‌లు న‌మ్మేలా లేదే!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్
  • లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే
  • సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు
  • భువనేశ్వరి బలంగానే!
  • ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు
  • తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ
  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు
  • జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..
  • బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్
  • గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్
  • వారిని గుర్తుపెట్టుకుంటా..భువనేశ్వరి వార్నింగ్
  • 3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట
  • సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra