• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఖమ్మం సభలో సజ్జలకు చంద్రబాబు కౌంటర్

admin by admin
December 22, 2022
in Andhra, Politics, Telangana, Top Stories
0
ncbn in bapatla

ncbn in bapatla

0
SHARES
165
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కృత నిశ్చయంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఖమ్మంలో ఏర్పాటు చేసిన టీడీపీ శంఖారావం సభ గ్రాండ్ సక్సెస్ అయింది. చంద్రబాబు సభ నేపథ్యంలో ఖమ్మం జిల్లా పసుపు మయం అయింది. ఈ సభలో ప్రసంగించిన చంద్రబాబు…తెలంగాణ ప్రజలకు కీలక సందేశమిచ్చారు. ఈ సభకు ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చారని, తాను కోరుకుంటోంది అధికారం కాదని, ప్రజల ఆశీస్సులు, అభిమానం అని అన్నారు.

ఏపీలో గాడి తప్పిన పాలనను గాడిలో పెడతానని, కాసాని జ్ఞానేశ్వర్ వంటి నేతల సాయంతో తెలంగాణలోనూ టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు విడివిడిగా డెవలప్ అయి దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. కొందరు బుద్ధి లేనివాళ్లు రెండు రాష్ట్రాలను కలుపుతామంటున్నారని, జ్ఞానం ఉన్నవాళ్లు ఎవరూ అలా మాట్లాడరని సజ్జలకు పరోక్షంగా చురకలంటించారు. తెలంగాణలో ప్రాజెక్టులు తీసుకువచ్చింది టీడీపీ అని, ప్రజలను ఓటు అడిగే హక్కు టీడీపీకే ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ గానీ, ఎంపీ లేకున్నా సభకు వచ్చిన ప్రజలను చూస్తుంటే ఎంతో ధైర్యం కలుగుతోందని హర్షం వ్యక్తం చేశారు.

ఎన్నికలు, ఓట్ల కోసం తాను గతంలో పని చేయలేదని…భవిష్యత్తులో కూడా పని చేయబోనని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మబంధువుగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. పార్టీ రుణం తీర్చుకుంటామంటూ జెండా పట్టుకొని యువత ముందుకువచ్చారని తెలిపారు.
టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుందని, బంగారు భవిష్యత్తుకు నాంది పలకబోతోందని చెప్పారు. నందమూరి తారకరామారావు ఒక వ్యక్తి కాదు శక్తి అని ,చిరకాలం తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక నాయకుడు అని ప్రశంసించారు.

రూ.2 కిలో బియ్యం, పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు, మండల వ్యవస్థ, సింగిల్ విండో విధానం, పేదలకు పక్కా భవనాలు వంటి ఎన్నో చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. అందుకే ఆ యుగపురుషుడి గుర్తుగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు. తాను ఐటీ రంగం ప్రాధాన్యతను 25 ఏళ్ల క్రితమే గుర్తించానని, యువతలా ఆలోచించి ఐటీ రంగాన్ని ప్రోత్సహించానని తెలిపారు. హైదరాబాద్ ఇప్పుడీ స్థాయిలో ఉండడానికి కారణం తానేనని గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్ ను తెలంగాణకు పరిచయం చేశానని, బిల్ గేట్స్ 10 నిమిషాలు అపాయింట్ మెంట్ ఇస్తే..గంట మాట్లాడేలా చేశానని చెప్పారు. భారతీయుల మేధాశక్తి ఎలాంటిదో ఆయనకు వివరించానని, డిజిటల్ సత్తాలో మనతో పోటీ పడేవాళ్లు లేరని అన్నారు.

Tags: Chandrababucounterkhammam tdppublic meetsajjalattdp
Previous Post

ఆస్కార్ బరిలో నాటు నాటు పాట..చరిత్రాత్మకం

Next Post

కేసీఆర్ పై ఎన్జీటీ పగ? 900 కోట్ల ఫైన్

Related Posts

Trending

రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు

June 8, 2023
Trending

ఆ ఘనత సీఎం జగన్ ఒక్కడికే దక్కింది..అయ్యన్న సెటైర్లు

June 8, 2023
Trending

మ‌డ‌మ తిప్ప‌డం అంటే.. ఇది కాదా జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఫైర్‌

June 8, 2023
Andhra

మిషన్ రాయలసీమతో సీమ కష్టాలకు శాశ్వత పరిష్కారం – నారా లోకేష్!

June 7, 2023
Top Stories

జగన్ ఇలాకాలో లోకేష్ సీమ గర్జన…వరాల జల్లు

June 7, 2023
Trending

జగన్ పాలనలో ఆ ర్యాంకు పాతాళానికి పడిపోయింది:చంద్రబాబు

June 7, 2023
Load More
Next Post

కేసీఆర్ పై ఎన్జీటీ పగ? 900 కోట్ల ఫైన్

Latest News

  • రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు
  • ఆ ఘనత సీఎం జగన్ ఒక్కడికే దక్కింది..అయ్యన్న సెటైర్లు
  • ఆదిపురుష్ టీంపై దుష్ప్ర‌చారం
  • మ‌డ‌మ తిప్ప‌డం అంటే.. ఇది కాదా జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఫైర్‌
  • #ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!
  • శక పురుషునికి ‘బాటా’ శత జయంతి నీరాజనం!
  • మిషన్ రాయలసీమతో సీమ కష్టాలకు శాశ్వత పరిష్కారం – నారా లోకేష్!
  • జగన్ ఇలాకాలో లోకేష్ సీమ గర్జన…వరాల జల్లు
  • జగన్ పాలనలో ఆ ర్యాంకు పాతాళానికి పడిపోయింది:చంద్రబాబు
  • ముందస్తు ఎన్నికలపై జగన్ తాజా కామెంట్స్…అదే వ్యూహమా?
  • వివేకా కేసులో మరో ట్విస్ట్..ఆ టెస్ట్ కు కోర్టు ఓకే!
  • జగన్ కు దేవినేని ఉమ సెల్ఫీ ఛాలెంజ్
  • మహిళలకు వైసీపీ ఎమ్మెల్యే శాపనార్థాలు
  • సాయం చేసి… శవాలు చూసి… వారికి ఏమైందంటే.
  • తిరుపతిలో హీరోయిన్ తో ఓం రౌత్ పాడు పని…వివాదం

Most Read

#ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra