• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

Breaking: చంద్రబాబు సీఎం కాగానే తొలి సంతకం ఆ ఫైలుపైనే

admin by admin
November 26, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
Chandrababu Naidu
0
SHARES
734
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీడీపీ అధికారంలోకి రావ‌డం.. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కావడం.. జ‌రిగిపోగానే.. ఆయ‌న తొలి సంత‌కం దేనిపై పెడ‌తారు?  దీనిపై తెలుగుదేశం పార్టీ సంచలన ప్రకటన చేసింది.

ఇప్పటివరకు గతంలో అనేక ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ఏ ఇళ్లకు పట్టాలు లేవు. ఆ మాటకు వస్తే ఊళ్లలో ఇళ్లకు పట్టాలు ఎవరికీ ఉండవు. జగన్ సర్కారు దివాలా తీయడంతో దీనిని కూడా ఆదాయంగా మలచుకుందాం అని వాటిపై కన్నేశాడు.

ఇప్పుడు ఆయా ఇళ్ల‌కు తీసుకున్న‌రుణాల‌పై ఒన్ టైం సెటిల్మెంట్ ప‌థ‌కం అంటూ.. వైసీపీ ప్ర‌భుత్వం డ‌బ్బులు వ‌సూలు చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అసలు ఆ ఇళ్లపై రుణాలున్నట్టే ఎవరికీ తెలియదు. ఎందుకంటే ప్రభుత్వమే ఆ రుణాలు చెల్లిస్తుంటుంది. కానీ నేడు జగన్ పరిపాలన దివాలా తీయడంతో ఆ రుణం కట్టలేక వన్ టైం సెటిల్మెంట్ కింద ఆ మొత్తం భారాన్ని పేదలపై వేయడానికి జగన్ సర్కారు ప్రయత్నిస్తోంది.

పైగా మీ ఇంటికి జగన్ సర్కారు శాశ్వత హక్కు కల్పిస్తుంది అంటూ జగన్ పథకం అనే ట్యాగ్ తగిలించడం మహా మోసం. ఈ పథకం కింద పేదల నుంచి రెండు నెల‌ల్లోనే 4000 కోట్లు రాబ‌ట్టాల‌ని జగన్ సర్కారు. నిర్ణ‌యించుకుంది.

జగన్ అనుకున్నది ఒకటి, అయినది ఇంకోటి. ఈ డబ్బులు కట్టండి ఇల్లు మీరుపై రాసి పట్టా ఇస్తాం అని ప్రభుత్వం వలంటీర్ల ద్వారా అడుగుతుంటే…  తామెందుకు క‌ట్టాల‌ని ప్ర‌జ‌ల నుంచి తిరుగుబాటు వస్తోంది.

ఎంత దారుణం అంటే ప్రభుత్వం కట్టాల్సిన సొమ్మును పేదలు కట్టాలట… ఇది నూతన పథకం అట. ఇల్లుకు పట్టా వస్తే దానిపై మళ్లీ బ్యాంకులో లోనుకు వాడుకోవచ్చట. ఇది కొత్త పథకమట. ఎంత మోసం గురు ఇది.

జనం మాత్రం జగన్ కి రిటార్ట్ ఇస్తున్నారు. మేం క‌ట్ట‌నూ వ‌ద్దు.. జ‌గ‌న్ బొమ్మ పెట్ట‌నూ వ‌ద్ద‌ని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణాలు మీరే కట్టుకోండి. మేం కట్టం అని తేల్చి చెబుతున్నారు. మాకు పట్టాలొద్దు అని మొహం మీదే చెప్పేస్తున్నారు.

ప్రజల్లో ఈ దోపిడీపై తిరుగుబాటు రావడంతో జగన్ సర్కారు షాక్ తిన్నది. దీనిపై తెలుగుదేశం సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు అధికారంలోకి రాగానే పేదలకు బ‌హుళ ప్ర‌యోజ‌నం కలిగించే ఇంటి హక్కు పట్టాను అందరికీ ఉచితంగా ఇచ్చేలా మొదటి సంతకం చేస్తారని తెలుగుదేశం ప్రకటించింది.

తాజాగా చంద్ర‌బాబు త‌న‌యుడు, మాజీ మంత్రి, టీడీపీ నేత‌.. లోకేష్ రియాక్ట్ అయ్యారు. పేదలు సర్కారుకు రూపాయి కట్టొద్దు. ఆయా సొమ్ములు ఎవ‌రూ ప్ర‌భుత్వానికి చెల్లించ‌వ‌ద్ద‌ని సూచించారు. మన ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా మీ పట్టాలు మీకిచ్చేస్తాం అని లోకేష్ స్పష్టం చేశారు.

ఈ క్ర‌మంలో వైసీపీ స‌ర్కారుపై ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. పంచాయ‌తీ నిధుల‌ను కూడా ప్ర‌భుత్వం మింగేస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన వ‌న్ టైం సెటిల్మెంట్ స్కీం ఒక దగా అని… ఎవ‌రూ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు.

కొసమెరుపు ఏంటంటే… ఆ ఇళ్లకు ప్రభుత్వం సరిపడనంత డబ్బు ఇవ్వకపోయినా ప్రజలే తమ సొంత డబ్బులు వేసుుకుని వాటిని కట్టుకున్నారు. ఇపుడు అవి ప్రభుత్వానివి మీరు డబ్బు కట్టాలి అంటే ప్రజలు ఘోరంగా తిరగబడుతున్నారు.

Tags: poor houseTDPTelugu desam party
Previous Post

చిరంజీవి బతిమాలాడు… పరిశీలిస్తాం – పేర్నినాని

Next Post

రాయలసీమ వరద వెనుక షాకింగ్ నిజాలు వెల్లడించిన చంద్రబాబు

Related Posts

legend k viswanath
Movies

అలా ఆపేయడమే కె.విశ్వనాథ్ ప్రత్యేకత

February 3, 2023
Telangana

సచివాలయంలో అగ్నిప్రమాదం? షర్మిల, పాల్ సెటైర్లు

February 3, 2023
sajjala ramakrishna reddy
Trending

వివేకా కేసు..సజ్జల భలే కవర్ చేశాడే!

February 3, 2023
Trending

పవన్ 3 పెళ్లిళ్లపై బాలయ్య వార్నింగ్

February 3, 2023
Raghu Rama Krishna Raju
Top Stories

నెల్లూరు రెబల్స్ ఎపిసోడ్ పై రఘురామ కామెంట్స్

February 3, 2023
kotam reddy sridhar reddy
Trending

ఎన్ కౌంటర్ చేస్తేనే నా నోరు మూతపడుతుంది:కోటంరెడ్డి

February 3, 2023
Load More
Next Post

రాయలసీమ వరద వెనుక షాకింగ్ నిజాలు వెల్లడించిన చంద్రబాబు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అలా ఆపేయడమే కె.విశ్వనాథ్ ప్రత్యేకత
  • కల్యాణ్ రామ్ ‘అమిగోస్’…అదిరింది!
  • సచివాలయంలో అగ్నిప్రమాదం? షర్మిల, పాల్ సెటైర్లు
  • వివేకా కేసు..సజ్జల భలే కవర్ చేశాడే!
  • పవన్ 3 పెళ్లిళ్లపై బాలయ్య వార్నింగ్
  • నెల్లూరు రెబల్స్ ఎపిసోడ్ పై రఘురామ కామెంట్స్
  • ఎన్ కౌంటర్ చేస్తేనే నా నోరు మూతపడుతుంది:కోటంరెడ్డి
  • సోము మళ్లీ ఏసేశాడుగా.. ఈసారి జనసేనాని టార్గెట్
  • కళాతపస్వి సినిమాలు ఎందుకు ప్రత్యేకం?
  • శంకరాభరణం విడుదల రోజునే తుదిశ్వాస విడవటమా?
  • కె.విశ్వనాథ్ : కళా తపస్సు ముగిసింది.. స్వర్గసీమకు కె.విశ్వనాథ్
  • మా ఇద్దరి గురించి మాట్లాడితే..‘డొక్క పగలదీసి డోలు కడతాం’
  • కోటంరెడ్డిపై వేటు…ఆదాలకు అందలం
  • పెద్దిరెడ్డి ఇలాకాలో లోకేష్ యాత్ర…ఉద్రిక్తత
  • టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు మృతి

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra