• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ దిగిపోయేనాటికి ఏపీపై అన్ని లక్షల కోట్ల అప్పు?

అప్పుల లెక్క చెప్పడం లేదు..ప్రజాస్వామ్యాన్ని జగన్ కాలరాస్తున్నారు: సీపీఐ రామకృష్ణ

admin by admin
May 17, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
252
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రజా సంక్షేమ పథకాలతో వైసీపీకి జనం పట్టం కట్టారని..జగన్ ను సీఎంను చేశారని వైసీపీ నేతలు గప్పాలు కొడుతోన్న సంగతి తెలిసిందే. కరోనా సంక్షోభం, లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులున్నా కూడా జనం కోసం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేశారని, చేస్తున్నారని, చేస్తూనే ఉంటారని గొప్పలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు, ఏపీ మీద ఉన్న అప్పులు పదేళ్లలో అయినా తీర్చుకోవచ్చని…జనం ప్రాణాలు కాపాడేందుకు అప్పులు చేసిన గొప్ప సీఎం జగన్ అని తమ అధినేతకు కితాబిస్తున్నారు.

అసలు, అప్పులు చేస్తే తప్పేంటని, ప్రజల కష్టాలను తీర్చడమే ప్రభుత్వ బాధ్యత అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు వైసీపీ నేతలు. అయితే, జగన్ పరిమితికి మించి అప్పులు చేస్తున్నారని, గొప్పలకు పోయి ఏపీని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని టీడీపీ సహా విపక్షాలన్నీ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే విషయాన్ని విపక్షాలే కాదు…కంప్ట్రోలర్ ఆడిటర్ అండ్ జనరల్ (కాగ్) కూడా చెబుతోంది. జగన్ ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో దాదాపు అర్థ రూపాయి అప్పేనని తేల్చి చెప్పింది. అయినప్పటికీ, ఏనుగు మీద నీళ్లుపడ్డట్టున్న జగన్ సర్కార్…తమ అప్పుల తప్పులను సమర్థించుకుంటూ….అప్పుల కుప్పను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా జగన్ సర్కార్ మరో 2 వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది. రిజర్వు బ్యాంకు వద్ద సెక్యూరిటీ బాండ్లను వైసీపీ ప్రభుత్వం వేలం వేయడం చర్చనీయాంశమైంది. రూ.1000 కోట్లను 8 సంవత్సరాల కాలానికి 7.63 శాతం వడ్డీతో వేలం వేయగా…మరో రూ.1000 కోట్లను 5 సంవత్సరాల కాలానికి 7.46 శాతం వడ్డీతో వేలం వేసింది. గత వారం రోజుల్లో దాదాపు రూ.5 వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఏపీ ప్రభుత్వం .

ఎఫ్‌ఆర్‌బిఎం కింద రూ.36 వేల కోట్లకు కేంద్రం అనుమతినివ్వగా ఆల్రెడీ రూ.5 వేల కోట్ల రుణాన్ని సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా జగన్ సర్కార్ సమీకరించింది. ఇక, మరో 3 నెలల్లో రూ.36 వేల కోట్లు పరిమితి పూర్తయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్లీ అప్పు చేయడం విశేషం. ఈ క్రమంలోనే సీఎం జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అప్పులపై ఈ వామపక్ష పార్టీ సీనియర్ నేత షాకింగ్ కామెంట్లు చేయడం చర్చనీయాంశమైంది.

జగన్ పదవి నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు అప్పు ఉంటుందని రామకృష్ణ విమర్శలు గుప్పించారు. చేసిన అప్పులకు జగన్ లెక్కలు చెప్పడం లేదని, అప్పులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లేదని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టును జగన్ మూలన పడేశారని, రాష్ట్రంలో ఏ ప్రాజెక్టును పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరుగుతుంటే జగన్ నోరు మెదపడం లేదని,  ప్రధానికి కనీసం జగన్ ఒక అర్జీ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

మద్యపాన నిషేధమన్న జగన్…పాత బ్రాండ్లను నిషేధించి, తమ పార్టీ నేతల బ్రాండ్లను ప్రజల్లోకి వదిలారని ఆయన ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చిన డబ్బు తాడేపల్లికి వెళుతుందని ఆయన ఆరోపించారు. సీఎం అయిన 2 వారాల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్ ఇంతవరకు ఎందుకు చేయలేదని రామకృష్ణ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ కలరాస్తున్నాడని, విజయవాడకు వస్తే అరెస్టులు చేస్తావా? అని ప్రశ్నించారు.

Tags: ap cm jaganap in debtscpi ramakrishnajagan's tenureRs.10 lakh crores debtshocking fact
Previous Post

విజయ్ దేవరకొండ.. ఉన్న నెగెటివిటీ చాలదని

Next Post

పెద్దల సభకు వెళ్లేంత పెద్ద బీసీలు ఏపీలో లేరా జగన్?

Related Posts

nara brahmani meets it employees
Andhra

పోలీసులు ఫోన్ చాటింగ్ లు చెక్ చేయడం షాక్ కు గురిచేసింది – నారా బ్రాహ్మిణి

September 24, 2023
nara bramhani with janasena 2
Andhra

నారా బ్రాహ్మణి … పొలిటికల్ ఎంట్రీ స్టార్టయినట్టేనా?

September 24, 2023
car rally to support chandrababu
Andhra

కార్ల ర్యాలీతో జగన్ లో వణుకు !

September 24, 2023
nara lokesh yuvagalam
Politics

యువగళం మళ్లీ ప్రారంభానికి అంతా సిద్ధం…

September 24, 2023
yv subbareddy
Andhra

తాడేపల్లి ప్యాలెస్ లో… వైవీ వర్సెస్ విజయసాయి మధ్య అంతర్యుద్ధం

September 24, 2023
hero navadeep
Movies

కేసులు కేరాఫ్ నవదీప్.. ఇన్ని పాత కేసులు ఉన్నాయా !!

September 24, 2023
Load More
Next Post

పెద్దల సభకు వెళ్లేంత పెద్ద బీసీలు ఏపీలో లేరా జగన్?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • పోలీసులు ఫోన్ చాటింగ్ లు చెక్ చేయడం షాక్ కు గురిచేసింది – నారా బ్రాహ్మిణి
  • నారా బ్రాహ్మణి … పొలిటికల్ ఎంట్రీ స్టార్టయినట్టేనా?
  • కార్ల ర్యాలీతో జగన్ లో వణుకు !
  • యువగళం మళ్లీ ప్రారంభానికి అంతా సిద్ధం…
  • తాడేపల్లి ప్యాలెస్ లో… వైవీ వర్సెస్ విజయసాయి మధ్య అంతర్యుద్ధం
  • కేసులు కేరాఫ్ నవదీప్.. ఇన్ని పాత కేసులు ఉన్నాయా !!
  • CBN Arrest-Atlanta, GA Protest
  • తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!
  • నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!
  • కన్నప్ప లో ప్రభాసే కాదు.. నయన్ కూడా
  • మైనంపల్లి డిమాండ్ వర్కవుటవుతుందా ?
  • బెయిల్ డే ..జగన్ గాలి తీసిన లోకేష్
  • చంద్రబాబు సైకత శిల్పం…28 మందిపై కేసు
  • జైల్లో సీఐడీ..సుప్రీంకోర్టుకు చంద్రబాబు
  • ఎన్నారై టిడిపి కువైట్ మరియు జనసేన కువైట్ సమ్యుక్త ఆధ్వర్యములో “వియ్ స్టేండ్ విత్ సిబిఎన్”!

Most Read

టీడీపీ వజ్రాయుధం ‘నారా బ్రాహ్మణి’ వచ్చేసింది!

పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్లు ఏమ‌న్నారంటే!

బే ఏరియాలో చంద్రబాబు కోసం కదం తొక్కిన ఎన్నారైలు!

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

స్కిల్ స్కాం.. రాబోయే రోజుల్లో జగన్ కు తిప్పలు తేనుందా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra