• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రాఖీ పండుగ నాడు జగన్ పరువు తీసిన సునీత

admin by admin
August 12, 2022
in Andhra, Politics, Top Stories, Trending
1
0
SHARES
219
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచారణ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోన్న సంగతి తెలిసిందే. గుండెపోటు అంటూ కట్టుకథలు అల్లిన వైసీపీ నేతలు చివరకు అది గొడ్డలి పోటు అని తేలడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇక, ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా వినిపించడంతో ఆయను కాపాడేందుకు జగన్ సర్వశక్తులు ఒడ్డుతున్నారని టాక్ వస్తోంది. అందుకే, ఈ కేసు విచారణను సాగదీస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

ఈ క్రమంలోనే జగన్ పై వివేకా కూతురు సునీతా రెడ్డి కూడా గతంలో సంచలన ఆరోపణలు చేశారు. గతంలో సీబీఐ అధికారులకు సునీత వాంగ్మూలంలో చెప్పిన మరిన్ని విషయాలు షాకింగ్ గా మారాయి. తన తండ్రిని చంపిన హంతకులను శిక్షించాలని అన్న జగన్‌ ను సజ్జల, సవాంగ్‌ ల సమక్షంలో బతిమాలానని సునీత వెల్లడించడం కలకలం రేపింది. ఈసీ గంగిరెడ్డి (వైఎస్ భారతి తండ్రి) ఆస్పత్రిలో పనిచేసే కాంపౌండర్‌ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేరును అనుమానితుల జాబితాలో చేర్చడంపై కూడా జగన్‌ కోప్పడ్డారని సునీత వాంగ్మూలమిచ్చారు.

వివేకా కేసులో సీబీఐ విచారణ కోరుతూ తాను కోర్టును ఆశ్రయిస్తే జగన్‌ రాజకీయ భవిష్యత్‌ నాశనమయ్యే ప్రమాదం ఉందని సజ్జల వంటి నేతలు తనకు చెప్పారని సునీత గుర్తు చేశారు. తనకు న్యాయం లభించదన్న ఉద్దేశంతోనే సీబీఐ విచారణకు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తన అన్న జగన్ సీఎం అయినా విచారణ ఎందుకు ముందుకెళ్లడం లేదో జగన్ నే అడిగితే బాగుంటుందని సునీతా మీడియాకు చెప్పిన విషయం కూడా వైరల్ అయింది. ఓ మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు. ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయి అంతటి వ్యక్తికే ఇలా జరిగితే… సామాన్యుల పరిస్థితి ఏంటి? అని సునీత ప్రశ్నించారు.

సునీత ఈ వ్యాఖ్యలు చేసి చాలా నెలలైంది. అయినా సరే వివేకా మర్డర్ కేసు విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేసు విషయంలో సునీత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి కేసు విషయంలో న్యాయం చేయాలంటూ సునీత దేశపు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు గ‌డ‌ప తొక్కారు. ఈ కేసులో సీబీఐ అధికారులు ఏమాత్రం పురోగ‌తి సాధించ‌లేక‌పోతున్నార‌ని ఆరోపించారు.

ఈ ప్రకారం వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారే ద‌ర్యాప్తు అధికారుల‌పై కేసులు పెడుతున్న ఆమె త‌న పిటిష‌న్‌లో ప్ర‌స్తావించారు. దీంతో, రాఖీ పండుగ నాడే న్యాయం కోసం ఓ చెల్లెలి పోరాటం’ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ‘అన్న పాలనలో నిజం బయటకు రాదా?’ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. తన అన్న జగన్ పాలనలో తనకు న్యాయం జరగకపోవడంతోనే వైఎస్ సునీత సుప్రీం గడప తొక్కారంటూ విమర్శలు వస్తున్నాయి.  రాఖీ పండుగ నాడు జగన్ పరువు తీసిన సునీత అని కామెంట్లు వస్తున్నాయి.

రాఖీ పండుగ నాడే, న్యాయం కోసం ఓ చెల్లెలి పోరాటం

అన్న పాలనలో నిజం బయటకు రాదా ?

రాఖీ పండుగ నాడే న్యాయం కోసం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కిన చెల్లెలు సునీత. నిందితులే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్నారని, తన అన్న పాలన పైనే వైఎస్ సునీత ఫిర్యాదు.

ఇంతకీ #WhoKilledBabai pic.twitter.com/VQKFXHIC4x

— Telugu Desam Party (@JaiTDP) August 12, 2022

Tags: suneetha reddy approached supreme courtviveka's murder casewho killed bababiys jaganys suneetha reddy
Previous Post

వైసీపీకి షాక్…కేశినేని నానికి హైకోర్టు ఊరట

Next Post

రఘురామకు సుప్రీం కోర్టు షాక్

Related Posts

jagan salute
Top Stories

జ‌గ‌న్‌లో అనూహ్య మార్పు.. కార‌ణాలు ఇవేనా?!!

March 30, 2023
రామోజీ
Top Stories

రామోజీరావు పై మరో పరోక్ష దాడి మొదలుపెట్టిన జగన్

March 30, 2023
Trending

యువగళం@700 కిలోమీటర్లు..జగన్ కు లోకేష్ ఛాలెంజ్

March 30, 2023
Top Stories

జగన్ పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

March 30, 2023
Andhra

జనం ‘గడప’లో మరో వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

March 30, 2023
Trending

జ‌గ‌న్ పుట్టింది అందుకే…చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్

March 30, 2023
Load More
Next Post
రఘు రామ కృష్ణం రాజు సుప్రీకోర్టు

రఘురామకు సుప్రీం కోర్టు షాక్

Comments 1

  1. Pingback: రాఖీ పండుగ నాడు జగన్ పరువు తీసిన సునీత - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • జ‌గ‌న్‌లో అనూహ్య మార్పు.. కార‌ణాలు ఇవేనా?!!
  • రామోజీరావు పై మరో పరోక్ష దాడి మొదలుపెట్టిన జగన్
  • యువగళం@700 కిలోమీటర్లు..జగన్ కు లోకేష్ ఛాలెంజ్
  • జగన్ పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
  • జనం ‘గడప’లో మరో వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
  • జ‌గ‌న్ పుట్టింది అందుకే…చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్
  • న‌వ‌ర‌త్నాల‌పై న‌మ్మ‌కం ఉంటే… జ‌గ‌న్‌కు స‌వాల్‌
  • టీడీపీ నాశ‌నం కోరిన వైఎస్ మట్టికొట్టుకుపోయారు
  • బాలీవుడ్ పాలిటిక్స్ వల్లే హాలీవుడ్ కు వెళ్లిన స్టార్ హీరోయిన్
  • ఆ బెడ్రూం సీన్ చూసి ఇన్ స్పైర్ కావాలంటోన్న టాలీవుడ్ నటి
  • BATA – బే ఏరియాలో అంగ‌రంగ వైభ‌వంగా ‘బాటా’ ఉగాది సంబ‌రాలు!
  • బాగా జోరుమీదున్న సైకిల్
  • సెగ మొద‌లైంది.. వైసీపీ నేత‌లకు భారీ షాక్‌..!
  • వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్
  • వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్ ఈ స్పీడేంటి సామీ !

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra