• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వైసీపీ ‘త్రీ ఇడియట్స్’ ఓటమే టీడీపీ టార్గెట్

admin by admin
September 13, 2022
in Andhra, Politics, Top Stories
1
0
SHARES
264
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేష్ లపై మాజీ మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. నానిపై కేసు పెట్టాలని, చర్యలు తీసుకోవాలని గత మూడు రోజులుగా కృష్ణా జిల్లా టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేయడం, వారిని పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు విజయవాడలో జరిగిన టీడీపీ ఉమ్మ‌డి కృష్ణా జిల్లా స‌ర్వ‌స‌భ్య స‌మావేంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలో ఓ కీల‌క తీర్మానాన్ని ఆమోదించిన‌ట్లు టీడీపీ కీల‌క నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు వెల్లడించారు. రాబోయే ఎన్నిక‌ల్లో వైసీపీ నేత‌లు కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ, దేవినేని అవినాశ్ ల ఓటమే లక్ష్యంగా క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల‌ని తీర్మానించిన‌ట్లు తెలిపారు. ఈ ముగ్గురిని చ‌ట్ట‌స‌భ‌ల్లోకి ప్ర‌వేశించ‌కుండా అడ్డుకుంటామ‌ని ధీమా వ్యక్తం చేశారు. ఆ త్రీ ఇడియట్స్ ఓటమే టీడీపీ నేతల టార్గెట్ అని చెప్పారు. టీడీపీ కార్యాల‌యంపై దాడికి పాల్ప‌డి, దేవినేని అవినాశ్ రాజ‌కీయంగా నాశ‌నం అయ్యార‌ని ఆయ‌న అన్నారు.

అయితే, ఇంతటి కీలకమైన సమావేశానికి టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. కానీ, కేశినేని నాని ఢిల్లీలో సమావేశాలతో బిజీగా ఉన్నారని, అందుకే, నేడు ఇక్కడికి రాలేకపోయారని టీడీపీ నేతలు సభాముఖంగా వెల్లడించారు. కానీ, కేశినేని నాని కొద్ది నెలలుగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఈ సమావేశానికి కూడా గైర్హాజరయ్యారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

పార్టీకి, నానికి మధ్య కొంత గ్యాప్ వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీ ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇచ్చేందుకు కూడా నాని నిరాకరించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇటీవల, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాల నేతల సమావేశం జరగగా…దానికి కూడా కేశినేని డుమ్మా కొట్టారు. దీనిపై చంద్రబాబు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. తాజాగా విశిష్ట ప్రాముఖ్యత ఉన్న ఈ సమావేశానికి కూడా నాని హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Tags: devineni avinashmla vallabhaneni vamsitdp targetted kodali nanithree idiots of ycp
Previous Post

ఆ విషయంలో హద్దు దాటిన జగన్

Next Post

అమరావతిపై కేంద్రం గుడ్ న్యూస్

Related Posts

KCR Jagan Telangana Andhra Pradesh
Top Stories

రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!

June 3, 2023
Trending

రాళ్లు, కోడిగుడ్ల‌తో టీడీపీని ఎలా ఓడిస్తావ్ జ‌గ‌నూ..!

June 3, 2023
Trending

ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో షాకింగ్ నిజమిది

June 3, 2023
Top Stories

‘దేవుడి స్క్రిప్టు’ మాట బాబు కంటే జగన్ నే వెంటాడుతోందా?

June 2, 2023
Top Stories

విడిపోయి 9 ఏళ్లయినా ఏపీ రాజధానేదో తెలీదు: చంద్రబాబు

June 2, 2023
Top Stories

పవన్ వారాహి యాత్ర ఫిక్స్..డేట్ ఇదే!

June 2, 2023
Load More
Next Post

అమరావతిపై కేంద్రం గుడ్ న్యూస్

Comments 1

  1. Pingback: వైసీపీ ‘త్రీ ఇడియట్స్’ ఓటమే టీడీపీ టార్గెట్ - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!
  • రాళ్లు, కోడిగుడ్ల‌తో టీడీపీని ఎలా ఓడిస్తావ్ జ‌గ‌నూ..!
  • ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో షాకింగ్ నిజమిది
  • NTR-శక పురుషునికి ‘డెట్రాయిట్’ శత జయంతి నీరాజనం!
  • ‘దేవుడి స్క్రిప్టు’ మాట బాబు కంటే జగన్ నే వెంటాడుతోందా?
  • బైడెన్ కు వణుకు పుట్టించి.. చివర్లో రిలీఫ్ ఇచ్చిన సెనేట్
  • విడిపోయి 9 ఏళ్లయినా ఏపీ రాజధానేదో తెలీదు: చంద్రబాబు
  • పవన్ వారాహి యాత్ర ఫిక్స్..డేట్ ఇదే!
  • బాలినేని, జగన్ ల భేటీకి వైవీ డుమ్మా!
  • ఆ జీవో కొట్టివేత..జగన్ కు సుప్రీం షాక్
  • లోకేష్ పై దాడి…బోండా ఉమ డెడ్లీ వార్నింగ్
  • ఆ దర్శకులు మాట తప్పారంటున్న అల్లు అరవింద్
  • ప్ర‌క‌ట‌న‌లేనా..చేసేదేమైనా ఉందా జ‌గ‌న్‌ ? గుంటూరు ప్ర‌జ‌ల ప్ర‌శ్న‌
  • ఆ సర్వేలో అట్టడుగున ఏపీ..చంద్రబాబు ఫైర్
  • తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రా పాలకులు తొక్కేశారు:కేసీఆర్

Most Read

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

రాజధాని వైజాగ్ అయితే.. పేదలకు ఇళ్లు అక్కడ ఇవ్వాలి కదా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra