సమంత తెలుగులో మోస్ట్ పాపులర్ హీరోయిన్
ఇపుడు ఆమె విడాకుల వివాదం బాగా వైరల్ అవుతోంది.
అయితే, ఆమె ఇవేమీ పట్టించుకోకుండా ముంబైలో తన కెరీర్ సెట్ చేసుకుంటోంది
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై జనాలకు ఆసక్తి.
అందుకే మీడియాలు అదే అంశంపై ఆసక్తి చూపుతాయి.
తన భర్త నాగచైతన్య నుంచి ఆమె విడిపోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతుండటం… వీటిని ఎవరూ ఖండించకపోవడంతో జనాలకు దీనిపై ఆసక్తి పెరిగింది.
ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వచ్చిన ఆమెకు అన్నీ విడాకుల ప్రశ్నలే ఎదురయ్యాయి.
‘మీ గురించి కొన్ని రూమర్లు వస్తున్నాయి’ అంటూ ఓ జర్నలిస్టులు క్లారిటీ కోసం అడిగారు.
అంతే సమంత ఫైర్ అయిపోయింది. చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది.
స్వామి వారి దర్శనం చేసుకుని వస్తున్న ఈ సమయంలో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా? మీకు బుద్ధి ఉందా? అంటూ జర్నలిస్టులపై ఘాటుగా స్పందించింది.
#samantha attitude 🔥🤙
#SamanthaAkkineni pic.twitter.com/LLkeY0lcNZ
— Innocent Soul 🎭 (@Suresh_D7) September 18, 2021