• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘సాక్షి’  జగన్ ను ఇరుకున పడేసిందా?

NA bureau by NA bureau
November 14, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
సాక్షి పేపర్ ను బతికించిన దిశ చట్టం : రమ్యకు 10 లక్షలు, సాక్షికి 30 కోట్లు…
0
SHARES
1k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నమ్ముకున్నోళ్లు చేసే నష్టం అంతా ఇంతా అన్నట్లు ఉండదు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా? తన సొంత సంస్థ చేసిన పని ఇప్పుడాయన్ను ఇబ్బందిలో పడేలా చేసిందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

మీడియాకు సంబంధించి సాధారణ ప్రజలకు ఒక అపోహ ఉంటుంది. అదేమంటే.. ఈనాడులో వచ్చే హెడ్డింగ్ మొదలు వార్తల వరకు అన్ని ఆ పత్రిక యజమాని రామోజీరావుకు తెలిసే ఉంటుందని. ఆయనే ప్రాధాన్యతల్ని డిసైడ్ చేస్తాడని. కానీ.. వాస్తవంగా అలా జరగదన్న విషయం మీడియాలో పని చేసే వారికి తెలుసు. చాలా కీలకమైన సందర్భాల్లో తప్పించి పత్రికా సంస్థల యజమానులు దాదాపుగా తలదూర్చరు.

రోజువారీగా జరిగే పనిలో తలదూర్చటం వారికున్న పనుల ఒత్తిడిలో సాధ్యం కాదు. చాలా అరుదైన సందర్భాల్లో సైతం ఇలా చేస్తే బాగుంటుందన్న మాటనే తప్పించి.. ఇలానే చేయాలన్న మాట దాదాపుగా ఉండదు. ఈ విషయం పత్రికల్లో పని చేసే వారిలో కూడా చాలామందికి తెలీదు. అన్నింటికి మించిన పెద్దపత్రికలు.. ప్రధాన పత్రికల్లో తీసుకునే విధానపరమైన నిర్ణయాలు.. వాటిని కిందిస్థాయికి చేర్చే వైఖరి ఒక్కోచోట ఒక్కోలా ఉంటుంది.

ఈనాడు విషయాన్నే తీసుకుంటే.. చాలా చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే రామోజీరావు వార్తల ప్రాధాన్యత గురించి జోక్యం చేసుకుంటారని చెప్పాలి. దివంగత మహానేత వైఎస్ అనూహ్య మరణం వేళ.. ఆయన మరణ వార్తను ఎలా ప్రజెంట్ చేయాలన్న సందేహం నాడు ఈనాడులో పని చేసిన రిపోర్టర్లకు.. బ్యూరో చీఫ్ లకు మాత్రమే కాదు.. డెస్కు ఇన్ ఛార్జిలకు కూడా ఎదురైంది.

ఆ రోజున రామోజీరావు ఫిలింసిటీ నుంచి సిటీకి రావటం.. ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెబుతారు. వైఎస్ భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం.. పత్రికకు సంబంధించిన అతి ముఖ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి దాన్ని అధికారిక సమావేశం అనే కన్నా కూడా ఇన్ ఫార్మల్ మీటింగ్ గా చెప్పొచ్చు.

ఆ సందర్భంగా వైఎస్ మరణవార్తకు ఎలాంటి ప్రయారిటీ ఇవ్వాలన్న విషయాన్ని ఎలా ప్రస్తావించాలో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి వేళ.. అక్కడ ఉన్న ఒక ముఖ్యుడు ఒకరు.. ప్రయారిటీ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించటం.. అందుకు స్పందించిన రామోజీరావు.. ‘ఆయనకు నాకు వ్యక్తిగతంగా చాలా ఉండొచ్చు. ఎవరూ పూడ్చలేని విషాదం. ఆయనకు సంబంధించి ఏమని ప్రజలు అనుకుంటారో.. దాన్నే రాయండి. ఎలాంటి పరిమితులు.. పరిధులు మనసులో పెట్టుకోకండి. జనాల మనసుల్ని గెలుచుకున్న ఆయనకు ఎలాంటి వార్తలు ఇవ్వాలో మీరే డిసైడ్ చేసుకోండి’ అని వ్యాఖ్యానించినట్లు చెబుతారు.

అప్పటివరకు మనసులో కోటి సందేహాలతో ఉన్న పత్రికా ముఖ్యులు.. ఆ సమావేశం ముగిసిన కొన్ని గంటల్లోనే ఏమేం చేయాలో చెప్పటం.. దానికి అనుగుణంగా తీర్చిదిద్దిన పత్రిక పక్కరోజు ఉదయానికి పాఠకుల చేతుల్లో ఉండటమే కాదు.. ఆ రోజు పత్రిక మొదటి పేజీలో ప్రచురించిన నిలువెత్తు వైఎస్ ఫోటోను చూసి.. సాక్షి పత్రికకు చెందిన ప్రముఖులు సైతం.. తాము అలాంటి ఫోటోను వేయలేకపోయినందుకు చింతించినట్లుగా చెబుతారు.

జర్నలిజంలో సాక్షికి ఇతర పత్రికలకు ఉన్న తేడా ఇదే. ఇదంతా ఇపుడు ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే… సీబీఐ అధికారికంగా కోర్టు ద్వారా విడుదల చేసిన విషయాన్ని కూడా సాక్షి పత్రిక దాచిపెట్టే ప్రయత్నం చేసింది. కోర్టు వార్తను కూడా ట్విస్ట్ చేసే ప్రయత్నం చేసింది.

జగన్ బాబాయ్ దారుణ హత్యకు సంబంధించిన కీలక విషయం ఒకటి బయటకు రావటం.. దాన్ని మిగిలిన పత్రికలు ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురిస్తే.. సాక్షి అందుకు భిన్నంగా చాలా చిన్నగా లోపల పేజీల్లో.. ప్రచురించిన వైనం కొత్త సందేహాలతో పాటు.. అనవసరమైన చర్చకు తావిచ్చినట్లుగా చెప్పాలి. పైగా వార్తను ట్విస్ట్ చేస్తూ కోర్టులు, సీబీఐపై అనుమానం వ్యక్తంచేశారు.

హత్యకు కారణమైన నిందితుల్లో ఒకరైన వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలాన్ని ప్రజెంట్ చేసిన తీరు వేలెత్తి చూపేలా ఉంటమే కాదు.. సొంత కుటుంబ సభ్యుడి హత్యకు సంబంధించిన కీలకమైన అంశాల్ని ప్రజెంట్ చేయటం ఇలానా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. ఒకప్పుడు చంద్రబాబే వివేకాను హత్య చేయించాడు అన్న ఆరోపణ నిరాధారంగా చేసిన సాక్షి పత్రిక ఇపుడు నిజాలు బయటకు రావడంతో ఆ వార్తను దాచే ప్రయత్నం చేసింది.

లోపల పేజీల్లో వేసిన వార్త కూడా…. హత్యకు ప్లాన్ చేసిన వారి విషయం కంటే కూడా.. ల్యాండ్ సెటిల్ మెంటే కారణమంటూ పెట్టిన హెడ్డింగ్ మరింత దారుణం.

వివేకా హత్యను చెప్పాల్సిన టోన్ లో చెప్పకుండా.. మరోలా చెప్పటం ఏమిటన్నది మరో ప్రశ్న. సాక్షి వార్తను దాచిపెట్టడం, గతంలో ఈ కేసును సీబీఐకి ఇవ్వద్దు అని జగన్ హైకోర్టులో కేసును ఉపసంహరించుకోవడం, తాజాగా ఆధారాలు బయటపడినా ఆ వార్త దాచడం వంటివి చూస్తే అసలు నిందితులు ఎవరో సీబీఐ తేల్చక ముందే ప్రపంచానికి తెలుగుజనానికి స్పష్టంగా అర్థమైందనుకోవాలి.

Google News, Namaste Andhra

Tags: andhrapradeshJagankadapasakshiviveka murder caseYS Bharatiys sunitha reddyysr brother
Previous Post

ఎన్నారై ‘వల్లేపల్లి శశికాంత్’–వైకుంఠ ప్రస్థానం అభివృద్ధికి రూ. 30 లక్షల వితరణ

Next Post

సాయిరెడ్డిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారుగా

Related Posts

ఏపీలో ఆ స్కామ్ నిజమేనంటోన్న వైసీపీ ఎంపీ…షాకింగ్
Andhra

ఏపీలో ఆ స్కామ్ నిజమేనంటోన్న వైసీపీ ఎంపీ…షాకింగ్

May 19, 2022
శ్రీకాకుళంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌… ఇదేం రెస్పాన్స్ రా బాబూ
Andhra

జగన్ కు సొంత ఇలాకాలో షాకిచ్చిన చంద్రబాబు

May 19, 2022
#SVP కలెక్షన్స్…ఆ ఛానెల్ పై మండిపడ్డ కృష్ణ
Movies

#SVP కలెక్షన్స్…ఆ ఛానెల్ పై మండిపడ్డ కృష్ణ

May 19, 2022
వల్లభనేని వంశీకి జగన్ చెక్ పెట్టబోతున్నారా?
Andhra

వల్లభనేని వంశీకి జగన్ చెక్ పెట్టబోతున్నారా?

May 19, 2022
ఇదే మాట యుద్ధానికి ముందు చెప్పి ఉంటే.. ఇంత రచ్చ ఉండేది కాదు కదా?
Around The World

పరువు దక్కించుకున్న రష్యా

May 19, 2022
‘స‌ర్కారు’ విమ‌ర్శల‌కు ప‌ర‌శురామ్ జ‌వాబు
Movies

‘స‌ర్కారు’ విమ‌ర్శల‌కు ప‌ర‌శురామ్ జ‌వాబు

May 19, 2022
Load More
Next Post
ఈ రెడ్డి గారి అబద్ధాలకు ఓ రేంజ్ ఉంటుంది

సాయిరెడ్డిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారుగా

Please login to join discussion

Latest News

  • ఏపీలో ఆ స్కామ్ నిజమేనంటోన్న వైసీపీ ఎంపీ…షాకింగ్
  • జగన్ కు సొంత ఇలాకాలో షాకిచ్చిన చంద్రబాబు
  • #SVP కలెక్షన్స్…ఆ ఛానెల్ పై మండిపడ్డ కృష్ణ
  • వల్లభనేని వంశీకి జగన్ చెక్ పెట్టబోతున్నారా?
  • పరువు దక్కించుకున్న రష్యా
  • ‘స‌ర్కారు’ విమ‌ర్శల‌కు ప‌ర‌శురామ్ జ‌వాబు
  • కంగన సినిమా ‘అడల్ట్స్‘ ఓన్లీ అంట…
  • స్టార్ కమెడియన్ అలీతోనే కామెడీనా జగన్?
  • NRI TDP USA-Boston Mahanadu-ష‌డ్రశోపేతం.. చ‌వులూరించే వంట‌కాలు.. విందు భోజ‌నాలు
  • కేసీఆర్ తో స్టార్ హీరో భేటీ…మ్యాటరేంటి?
  • ఇది కదా కావాల్సింది : చంద్రబాబు కౌంటర్ అదిరింది
  • ‘F3’ టికెట్ రేట్లపై రచ్చ…దిల్ రాజు షాకింగ్ నిర్ణయం
  • చిదంబరంపై సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్…పాత పగతోనే టార్గెట్ చేశారా?
  • ఆ మంత్రిపై తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్లు…కోర్టులో పంచాయతీ?
  • బాలయ్యతో చీకటి గదిలో చితక్కొట్టుడేనంటోన్న ఆస్ట్రేలియా మోడల్
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds