• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘సాక్షి’  జగన్ ను ఇరుకున పడేసిందా?

admin by admin
November 14, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
1k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నమ్ముకున్నోళ్లు చేసే నష్టం అంతా ఇంతా అన్నట్లు ఉండదు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా? తన సొంత సంస్థ చేసిన పని ఇప్పుడాయన్ను ఇబ్బందిలో పడేలా చేసిందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

మీడియాకు సంబంధించి సాధారణ ప్రజలకు ఒక అపోహ ఉంటుంది. అదేమంటే.. ఈనాడులో వచ్చే హెడ్డింగ్ మొదలు వార్తల వరకు అన్ని ఆ పత్రిక యజమాని రామోజీరావుకు తెలిసే ఉంటుందని. ఆయనే ప్రాధాన్యతల్ని డిసైడ్ చేస్తాడని. కానీ.. వాస్తవంగా అలా జరగదన్న విషయం మీడియాలో పని చేసే వారికి తెలుసు. చాలా కీలకమైన సందర్భాల్లో తప్పించి పత్రికా సంస్థల యజమానులు దాదాపుగా తలదూర్చరు.

రోజువారీగా జరిగే పనిలో తలదూర్చటం వారికున్న పనుల ఒత్తిడిలో సాధ్యం కాదు. చాలా అరుదైన సందర్భాల్లో సైతం ఇలా చేస్తే బాగుంటుందన్న మాటనే తప్పించి.. ఇలానే చేయాలన్న మాట దాదాపుగా ఉండదు. ఈ విషయం పత్రికల్లో పని చేసే వారిలో కూడా చాలామందికి తెలీదు. అన్నింటికి మించిన పెద్దపత్రికలు.. ప్రధాన పత్రికల్లో తీసుకునే విధానపరమైన నిర్ణయాలు.. వాటిని కిందిస్థాయికి చేర్చే వైఖరి ఒక్కోచోట ఒక్కోలా ఉంటుంది.

ఈనాడు విషయాన్నే తీసుకుంటే.. చాలా చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే రామోజీరావు వార్తల ప్రాధాన్యత గురించి జోక్యం చేసుకుంటారని చెప్పాలి. దివంగత మహానేత వైఎస్ అనూహ్య మరణం వేళ.. ఆయన మరణ వార్తను ఎలా ప్రజెంట్ చేయాలన్న సందేహం నాడు ఈనాడులో పని చేసిన రిపోర్టర్లకు.. బ్యూరో చీఫ్ లకు మాత్రమే కాదు.. డెస్కు ఇన్ ఛార్జిలకు కూడా ఎదురైంది.

ఆ రోజున రామోజీరావు ఫిలింసిటీ నుంచి సిటీకి రావటం.. ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెబుతారు. వైఎస్ భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం.. పత్రికకు సంబంధించిన అతి ముఖ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి దాన్ని అధికారిక సమావేశం అనే కన్నా కూడా ఇన్ ఫార్మల్ మీటింగ్ గా చెప్పొచ్చు.

ఆ సందర్భంగా వైఎస్ మరణవార్తకు ఎలాంటి ప్రయారిటీ ఇవ్వాలన్న విషయాన్ని ఎలా ప్రస్తావించాలో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి వేళ.. అక్కడ ఉన్న ఒక ముఖ్యుడు ఒకరు.. ప్రయారిటీ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించటం.. అందుకు స్పందించిన రామోజీరావు.. ‘ఆయనకు నాకు వ్యక్తిగతంగా చాలా ఉండొచ్చు. ఎవరూ పూడ్చలేని విషాదం. ఆయనకు సంబంధించి ఏమని ప్రజలు అనుకుంటారో.. దాన్నే రాయండి. ఎలాంటి పరిమితులు.. పరిధులు మనసులో పెట్టుకోకండి. జనాల మనసుల్ని గెలుచుకున్న ఆయనకు ఎలాంటి వార్తలు ఇవ్వాలో మీరే డిసైడ్ చేసుకోండి’ అని వ్యాఖ్యానించినట్లు చెబుతారు.

అప్పటివరకు మనసులో కోటి సందేహాలతో ఉన్న పత్రికా ముఖ్యులు.. ఆ సమావేశం ముగిసిన కొన్ని గంటల్లోనే ఏమేం చేయాలో చెప్పటం.. దానికి అనుగుణంగా తీర్చిదిద్దిన పత్రిక పక్కరోజు ఉదయానికి పాఠకుల చేతుల్లో ఉండటమే కాదు.. ఆ రోజు పత్రిక మొదటి పేజీలో ప్రచురించిన నిలువెత్తు వైఎస్ ఫోటోను చూసి.. సాక్షి పత్రికకు చెందిన ప్రముఖులు సైతం.. తాము అలాంటి ఫోటోను వేయలేకపోయినందుకు చింతించినట్లుగా చెబుతారు.

జర్నలిజంలో సాక్షికి ఇతర పత్రికలకు ఉన్న తేడా ఇదే. ఇదంతా ఇపుడు ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే… సీబీఐ అధికారికంగా కోర్టు ద్వారా విడుదల చేసిన విషయాన్ని కూడా సాక్షి పత్రిక దాచిపెట్టే ప్రయత్నం చేసింది. కోర్టు వార్తను కూడా ట్విస్ట్ చేసే ప్రయత్నం చేసింది.

జగన్ బాబాయ్ దారుణ హత్యకు సంబంధించిన కీలక విషయం ఒకటి బయటకు రావటం.. దాన్ని మిగిలిన పత్రికలు ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురిస్తే.. సాక్షి అందుకు భిన్నంగా చాలా చిన్నగా లోపల పేజీల్లో.. ప్రచురించిన వైనం కొత్త సందేహాలతో పాటు.. అనవసరమైన చర్చకు తావిచ్చినట్లుగా చెప్పాలి. పైగా వార్తను ట్విస్ట్ చేస్తూ కోర్టులు, సీబీఐపై అనుమానం వ్యక్తంచేశారు.

హత్యకు కారణమైన నిందితుల్లో ఒకరైన వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలాన్ని ప్రజెంట్ చేసిన తీరు వేలెత్తి చూపేలా ఉంటమే కాదు.. సొంత కుటుంబ సభ్యుడి హత్యకు సంబంధించిన కీలకమైన అంశాల్ని ప్రజెంట్ చేయటం ఇలానా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. ఒకప్పుడు చంద్రబాబే వివేకాను హత్య చేయించాడు అన్న ఆరోపణ నిరాధారంగా చేసిన సాక్షి పత్రిక ఇపుడు నిజాలు బయటకు రావడంతో ఆ వార్తను దాచే ప్రయత్నం చేసింది.

లోపల పేజీల్లో వేసిన వార్త కూడా…. హత్యకు ప్లాన్ చేసిన వారి విషయం కంటే కూడా.. ల్యాండ్ సెటిల్ మెంటే కారణమంటూ పెట్టిన హెడ్డింగ్ మరింత దారుణం.

వివేకా హత్యను చెప్పాల్సిన టోన్ లో చెప్పకుండా.. మరోలా చెప్పటం ఏమిటన్నది మరో ప్రశ్న. సాక్షి వార్తను దాచిపెట్టడం, గతంలో ఈ కేసును సీబీఐకి ఇవ్వద్దు అని జగన్ హైకోర్టులో కేసును ఉపసంహరించుకోవడం, తాజాగా ఆధారాలు బయటపడినా ఆ వార్త దాచడం వంటివి చూస్తే అసలు నిందితులు ఎవరో సీబీఐ తేల్చక ముందే ప్రపంచానికి తెలుగుజనానికి స్పష్టంగా అర్థమైందనుకోవాలి.

Google News, Namaste Andhra

Tags: andhrapradeshJagankadapasakshiviveka murder caseYS Bharatiys sunitha reddyysr brother
Previous Post

ఎన్నారై ‘వల్లేపల్లి శశికాంత్’–వైకుంఠ ప్రస్థానం అభివృద్ధికి రూ. 30 లక్షల వితరణ

Next Post

సాయిరెడ్డిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారుగా

Related Posts

tdp and ycp logos
Politics

వైసీపీ ఎమ్మెల్యేల‌పై సస్పెన్ష‌న్‌.. మ‌రి వారు ఎలా రియాక్ట్ అయ్యారంటే!

March 24, 2023
pawan with bjp
Movies

పవన్ సినిమాకు ‘మెగా’ మార్కు డేట్ 

March 24, 2023
manchu family
Movies

మనోజ్‌తో గొడవపై విష్ణు స్పందన

March 24, 2023
kcr in munugode
Telangana

‘సౌండ్ పెంచమని చెప్పు’ అనేందుకు అలా చేసుడేంది కేసీఆర్?

March 24, 2023
Top Stories

స్పీకర్ తమ్మినేని గుట్టు విప్పిన టీడీపీ నేత

March 24, 2023
Trending

చంద్రబాబు లెక్కసరిచేశారా?

March 24, 2023
Load More
Next Post

సాయిరెడ్డిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారుగా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • వైసీపీ ఎమ్మెల్యేల‌పై సస్పెన్ష‌న్‌.. మ‌రి వారు ఎలా రియాక్ట్ అయ్యారంటే!
  • పవన్ సినిమాకు ‘మెగా’ మార్కు డేట్ 
  • మనోజ్‌తో గొడవపై విష్ణు స్పందన
  • ‘సౌండ్ పెంచమని చెప్పు’ అనేందుకు అలా చేసుడేంది కేసీఆర్?
  • రచ్చకెక్కుతున్న ‘మంచు’ గొడవ
  • స్పీకర్ తమ్మినేని గుట్టు విప్పిన టీడీపీ నేత
  • చంద్రబాబు లెక్కసరిచేశారా?
  • నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే
  • ఎమ్మెల్యేలను పూచికపుల్లలా తీసేస్తే ఇలాగే ఉంటుంది జగన్ మావా !
  • టీఎస్ పీఎస్సీ బోర్డే వివాదాస్పదమా ? 
  • టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?
  • స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?
  • వైసీపీలో వారిపై  అనుమానం చూపులు
  • ‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం
  • నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!

Most Read

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra