• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వైసీపీ కి ఎన్ని సీట్లో చెప్పిన రఘురామ

admin by admin
May 18, 2024
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
286
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని, 2019 ఎన్నికల ఫలితాలలో వచ్చిన 151 సీట్లకు మించి ఈ సారి ఎన్నికల్లో సీట్లు వస్తాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వైసీపీ ఓటమి ఖాయమని, కూటమి 130కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని కూటమి నేతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన రఘురామ కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబుతో భేటీ సందర్భంగా పోలింగ్ సరళి, ఫలితాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలపై వైసీపీ మాజీ నేత, ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రాగానే జగన్ కు షాక్ తప్పదని, జగన్ ఆశలు ఆవిరవుతాయని అన్నారు. వైసీపీకి కనీసం 25 అసెంబ్లీ స్థానాలు కూడా రావని రఘురామ ఎద్దేవా చేశారు.

వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే పల్నాడు, తాడిపత్రి, తిరుపతి తదితర ప్రాంతాల్లో హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. సజ్జలతో పాటు వైసీపీ నేతల కళ్లలో భయం కనపడుతోందని, కళ్లు అబద్ధం చెప్పవని విమర్శించారు. కూటమికి 130 సీట్లు వస్తాయని గతంలోనే చెప్పానని, పోలింగ్ తర్వాత ఆ సంఖ్య 150 దాటినా ఆశ్చర్యపోనని అన్నారు. 2019లొ 110 వస్తాయని జగన్ అనుకుంటే 151 వచ్చాయని, జగన్ కూడా ఊహించలేక పోయారని చెప్పారు.

అదే విధంగా ఈ సారి ఎన్నికల్లో ఓటమిని కూడా జగన్ ఊహించలేదని చురకలంటించారు. ఉద్యోగుల ఓటింగ్ 85 శాతం పడిందని, అన్ని వర్గాలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని రఘురామ అన్నారు. పులివెందులే టైట్ గా ఉందని, మిగతా చోట్ల గురించి చెప్పనవసరం లేదని ధీమా వ్యక్తం చేశారు.

కూటమి అధికారంలోకి రావాలని, చంద్రబాబు మరోసారి సీఎం కావాలని తిరుమల వెంకన్నకు మొక్కుకున్నానని రఘురామ చెప్పారు.ప్రశాంత్ కిశోర్ ఊహించనన్న సీట్లు వైసీపీకి వస్తాయని ఐ ప్యాక్ సభ్యులతో జగన్ చేసిన కామెంట్ల నేపథ్యంలోనే రఘురాజు కౌంటర్ ఇచ్చారు.

Tags: 25 seats to ycpap needs chandrababupredictiontdp leader raghurama
Previous Post

మ‌హానాడు చుట్టూ త‌మ్ముళ్ల రాజ‌కీయం.. విష‌యం ఏంటంటే!

Next Post

ఏపీ పోలీసుల చరిత్రలో మాయని మచ్చ…తొలిసారి సిట్

Related Posts

Andhra

జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్

June 18, 2025
Andhra

చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు

June 18, 2025
Andhra

జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు

June 17, 2025
Andhra

ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!

June 17, 2025
Andhra

జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!

June 17, 2025
Andhra

లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత

June 17, 2025
Load More
Next Post

ఏపీ పోలీసుల చరిత్రలో మాయని మచ్చ...తొలిసారి సిట్

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra