సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, టాలీవుడ్ హీరో నాగచైతన్యలు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సాధారణంగా మీడియాలో, సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని నాగచైతన్య విడాకుల తర్వాత ఓపెన్ అవుతున్నాడు. ఇక, విడాకులకు ముందు సోషల్ మీడియాలో కొంత యాక్టివ్ గా ఉండే సమంత విడాకుల తర్వాత మరింత యాక్టివ్ గా మారింది. ఒక రకంగా చెప్పాలంటే విడాకుల తర్వాత వీరిద్దరూ తమ తమ వ్యక్తిగత జీవితాలు, గతం గురించి చాలా స్వేచ్ఛగా ఓపెన్ అయిపోతున్నారు.
ఈ క్రమంలోనే ఈ మధ్య విడుదలైన ‘లాల్ సింగ్ చద్ధా’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న చైతూ తన కాలేజీ రోజులలో జరిగిన విషయాల గురించి ఓపెన్ అయ్యాడు. తాను కాలేజీ చదివేటప్పుడు ఒక అమ్మాయితో ప్రేమాయణం నడిపానని ఓ ఇంటర్వ్యూలో చైతూ చెప్పాడు. అంతేకాదు, ఓ సారి కారు బ్యాక్ సీట్లో తన గర్ల్ ఫ్రెండ్ ను ముద్దు పెట్టుకుంటుండగా పోలీసులు వచ్చారని, వారికి తామిద్దరం దొరికిపోయామని చై చెప్పాడు.
ఈ విషయం చాలా సంవత్సరాల క్రితం జరిగిందని, అయినా, దాని గురించి ఇప్పుడు మాట్లాడడానికి తానేమీ సిగ్గుపడడం లేదని చైతూ అన్నాడు. అంతేకాదు, యువకుడిగా ఉన్న సమయంలో తాను ఆ పని చేయడం తనకు తప్పు అనిపించలేదని చై ఓపెన్ అయ్యాడు. తనకు బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ అంటే చాలా ఇష్టం అని, అవకాశం వస్తే తనతో నటిస్తానని చై చెప్పుకొచ్చాడు. ఇక, సమంత, సాయి పల్లవి, నయనతార, తమన్నాలలో ఎవరు మంచి నటి అని అడగ్గా అందరూ బాగానే నటిస్తారంటూ చై సమాధానం దాటవేశాడు.
అయితే, స్క్రీన్ పై ఏ హీరోయిన్ తో జోడి కట్టేందుకు ఇష్టపడతారు అని అడిగిన ప్రశ్నకు సాయి పల్లవితో తన పెయిర్ బాగుంటుందని సమాధానం చెప్పాడు. సాధారణంగా తాను పార్టీలకు వెళ్లాలన్నా, పబ్లిక్ ప్లేస్ లకు వెళ్లాలన్న చాలా సిగ్గుపడుతుంటానని, నలుగురిలో కి వెళ్లడానికి కొంత బిడియ పడుతుంటారని చై చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా సాధారణంగా మీడియా ముందు మాట్లాడడానికి సిగ్గు పడే చైతూ ఇలా ఓపెన్ గా అన్ని విషయాలు వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. ఇక కాలేజీ రోజుల్లో తన గర్ల్ ఫ్రెండ్ చైతూ చేసిన మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.