• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ ఇలాకాలో మైనింగ్ మాఫియా

admin by admin
September 30, 2022
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
91
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కుక్కపిల్ల, కాదేదీ కవితకనర్హం అని మహాకవి శ్రీశ్రీ చెప్పారు. అయితే, మైనింగ్, మట్టి, ఇసుక ఏదైనా సరే దోపిడీకి కాదు అనర్హం అని వైసీపీ నేతలు అంటున్నారు. సీఎం జగన్ పాలనలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దోపిడీకి పాల్పడుతున్నారని, కోట్ల రూపాయలు దండుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, వైసీపీ నేతల మైనింగ్ మాఫియాను, ఇసుక మాఫియాను బట్టబయలు చేసేందుకు వెళ్లిన దేవినేని ఉమా వంటి వారిని పోలీసులు అరెస్టు చేసి ఇబ్బంది పెట్టడంపై కూడా వారు మండిపడుతున్నారు.

ఎవరెన్ని విమర్శలు చేసినా సరే అధికారం ఉంది అన్న ధీమాతో వైసీపీ నేతలు మైనింగ్, ఇసుక, మట్టి మాఫియా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ నేతలపై టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ సొంత జిల్లా కడపను వైసీపీ నేతలు మాఫియా కేంద్రంగా మార్చారని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. జిల్లావ్యాప్తంగా మైనింగ్, మట్టి, ఇసుక దోపిడీకి గురవుతోందని, ఆ దోపిడీ ద్వారా అధికార పార్టీ నేతలు కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు.

కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు భరత్ రెడ్డి కొండలను కరిగిస్తూ మైనింగ్ మాఫియాకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కడప శివారులో అక్రమ మైనింగ్ జరుగుతోందని, ఆ మైనింగ్ మాఫియాపై టీడీపీ ఫిర్యాదు చేసింది అని గుర్తు చేశారు. ఎంత మేరకు మట్టిని తవ్వారు అనే విషయంపై మైనింగ్ అధికారులు సర్వే చేయలేదని ఆయన ఆరోపించారు. ఏదో నామమాత్రంగా సర్వే చేసి రెండు కోట్ల రూపాయల పెనాల్టీ వేసి వదిలేశారని ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది.

అయితే పక్కాగా సర్వే చేస్తే కనీసం పది కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేదని, ఆ ఆదాయానికి వైసీపీ నేతలు గండి కొట్టినట్టు అయిందని శ్రీనివాస రెడ్డి అన్నారు. వైసీపీ నేతలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుంటే మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.

Tags: illegal miningJaganmining in kadapamining mafiasrilivasulu reddytdp leader
Previous Post

ఎంపీగా పోటీ…నాగార్జున ఏమన్నారంటే…

Next Post

పూరీని మళ్లీ కెలికిన బండ్ల గణేష్

Related Posts

nara brahmani meets it employees
Andhra

పోలీసులు ఫోన్ చాటింగ్ లు చెక్ చేయడం షాక్ కు గురిచేసింది – నారా బ్రాహ్మిణి

September 24, 2023
nara bramhani with janasena 2
Andhra

నారా బ్రాహ్మణి … పొలిటికల్ ఎంట్రీ స్టార్టయినట్టేనా?

September 24, 2023
car rally to support chandrababu
Andhra

కార్ల ర్యాలీతో జగన్ లో వణుకు !

September 24, 2023
nara lokesh yuvagalam
Politics

యువగళం మళ్లీ ప్రారంభానికి అంతా సిద్ధం…

September 24, 2023
yv subbareddy
Andhra

తాడేపల్లి ప్యాలెస్ లో… వైవీ వర్సెస్ విజయసాయి మధ్య అంతర్యుద్ధం

September 24, 2023
hero navadeep
Movies

కేసులు కేరాఫ్ నవదీప్.. ఇన్ని పాత కేసులు ఉన్నాయా !!

September 24, 2023
Load More
Next Post

పూరీని మళ్లీ కెలికిన బండ్ల గణేష్

Latest News

  • పోలీసులు ఫోన్ చాటింగ్ లు చెక్ చేయడం షాక్ కు గురిచేసింది – నారా బ్రాహ్మిణి
  • నారా బ్రాహ్మణి … పొలిటికల్ ఎంట్రీ స్టార్టయినట్టేనా?
  • కార్ల ర్యాలీతో జగన్ లో వణుకు !
  • యువగళం మళ్లీ ప్రారంభానికి అంతా సిద్ధం…
  • తాడేపల్లి ప్యాలెస్ లో… వైవీ వర్సెస్ విజయసాయి మధ్య అంతర్యుద్ధం
  • కేసులు కేరాఫ్ నవదీప్.. ఇన్ని పాత కేసులు ఉన్నాయా !!
  • CBN Arrest-Atlanta, GA Protest
  • తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!
  • నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!
  • కన్నప్ప లో ప్రభాసే కాదు.. నయన్ కూడా
  • మైనంపల్లి డిమాండ్ వర్కవుటవుతుందా ?
  • బెయిల్ డే ..జగన్ గాలి తీసిన లోకేష్
  • చంద్రబాబు సైకత శిల్పం…28 మందిపై కేసు
  • జైల్లో సీఐడీ..సుప్రీంకోర్టుకు చంద్రబాబు
  • ఎన్నారై టిడిపి కువైట్ మరియు జనసేన కువైట్ సమ్యుక్త ఆధ్వర్యములో “వియ్ స్టేండ్ విత్ సిబిఎన్”!

Most Read

టీడీపీ వజ్రాయుధం ‘నారా బ్రాహ్మణి’ వచ్చేసింది!

పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్లు ఏమ‌న్నారంటే!

బే ఏరియాలో చంద్రబాబు కోసం కదం తొక్కిన ఎన్నారైలు!

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

స్కిల్ స్కాం.. రాబోయే రోజుల్లో జగన్ కు తిప్పలు తేనుందా?

ఢిల్లీలోనూ జగన్ పరువు తీసిన జంట కవులు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra