• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

డీఎస్సీకి డుమ్మా కొట్టిన జగన్

admin by admin
June 14, 2022
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
8
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

‘వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేం రాగానే మెగా డీఎస్సీ వేస్తాం’…అంటూ నాటి ప్రతిపక్ష నేత, నేటి ఏపీ సీఎం జగన్ వైసీపీ ఫ్యాన్ గుర్తు సాక్షిగా గాలివాటం హామీలిచ్చారు. కట్ చేస్తే, జగన్ సీఎం అయిన తర్వాత డీఎస్సీ మాట దేవుడెరుగు…తాజాగా టీచర్ పోస్టుల రేషనలైజేషన్‌ కు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో, వేల సంఖ్యలో ఉన్న టీచర్ల ఖాళీ పోస్టులు మాయం అయ్యాయి. దాదాపు 18వేల టీచర్ పోస్టులకు జగన్ మంగళం పాడడంతో డీఎస్సీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఉసూరు మంటున్నారు.

కొత్తగా నియామకాల అవసరం లేకుండా రేషనలైజేషన్ విధానాన్ని విద్యాశాఖ రూపొందించడంతో ఇకపై 9, 10 తరగతుల్లో మాత్రమే. తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను అమలు చేయనున్నారు. 1-8 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమం మాత్రమే ఉంటుంది. ఆ తరగతులకు తెలుగు మాధ్యమం కూడా ఉంటే ఉపాధ్యా యుల సంఖ్య పెంచాల్సి వస్తుందనే కారణంతో ఆంగ్ల మాధ్యమం అంటూ కొత్త విధానం తీసుకొచ్చారు.

చంద్రబాబు హయాంలో రెండు డీఎస్సీలు వేసి వేల పోస్టులిచ్చారు. కానీ, జగన్ మాత్రం రిక్త హస్తాలు చూపించారు. ఇక, చంద్రబాబు హయాంలో ప్రాథమిక బడుల్లో ఒక టీచరుకు 20 మంది విద్యార్థులు అనే నిబంధన ఉండేది. దానిని జగన్ 1:30గా మార్చారు. దీంతో, ఎస్జీటీ పోస్టులు భారీగా మిగిలాయి. వీరిలో అర్హతున్న వారికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులిచ్చి, సబ్జెక్టు ఉపాధ్యాయుల ఖాళీలను సర్దుబాటు చేస్తారు.

ఇప్పటికే ఆదర్శ పాఠశాలల్లో పని చేస్తున్న 3,260 మంది ఉపాధ్యా యులను సర్వీసు నిబంధనల్లోకి తేవడానికి 4,764 ఎస్జీటీ పోస్టు లను రద్దు చేశారు  ఉన్నత పాఠశాలల్లో 1,716 సబ్జెక్టు ఉపాధ్యా యుల కొరత ఉంది. ఇవి కాకుండా గతంలో బదిలీల సమయంలో 15 వేల పోస్టులను బ్లాక్ చేశారు. ఉద్యోగ విరమణులు, మరణాలతో మరో 1000కి పైగా పోస్టులు ఖాళీ అయ్యాయి. మొత్తం సుమారు 18 వేల వరకు ఖాళీలున్న కొత్త డీఎస్సీ వేయకుండా సర్దుబాటు చేస్తున్నారు.

దీంతో, ఈ రేషనలైజేషన్ ప్రక్రియను ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమతో కనీసం చర్చించకుండా నిర్ణయం తీసుకున్నారని, ఇది ప్రభుత్వ పాఠశాలలకు గొడ్డలిపెట్టుగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే, సీపీఎస్ రద్దు విషయంలో జగన్ సర్కార్ పై గుర్రుగా ఉన్న ఉపాధ్యాయులకు తాజా నిర్ణయం పుండుమీద కారం చల్లినట్లయింది.

Tags: cm jaganno dsc in aprationalization of teacher postsshocking decisionteacher postsunemployees not happy
Previous Post

Inspiring: అత్తెసరు మార్కుల స్టూడెంట్ ఐఏఎస్ అయ్యాడు

Next Post

సమంత యాంటీ బీజేపీనా?

Related Posts

Trending

ఈ సారి చింతమనేని, కూనలను టార్గెట్ చేశారుగా

August 20, 2022
Top Stories

రామోజీతో అమిత్ షా భేటీ..నేరుగా ఫిలింసిటీకి

August 20, 2022
Movies

కమిట్మెంట్ పై తేజస్వి మదివాడ హాట్ కామెంట్స్

August 19, 2022
Trending

జడ్జిలపై వెంకట్రామిరెడ్డి షాకింగ్ కామెంట్స్

August 19, 2022
gorantla madhav
Top Stories

రాజీనామాపై చంద్రబాబుకు గోరంట్ల సవాల్

August 19, 2022
Trending

గోరంట్లకు సరే జగన్ కూ సిగ్గులేదా?: చంద్రబాబు

August 19, 2022
Load More
Next Post
Samantha

సమంత యాంటీ బీజేపీనా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఈ సారి చింతమనేని, కూనలను టార్గెట్ చేశారుగా
  • రామోజీతో అమిత్ షా భేటీ..నేరుగా ఫిలింసిటీకి
  • కమిట్మెంట్ పై తేజస్వి మదివాడ హాట్ కామెంట్స్
  • జడ్జిలపై వెంకట్రామిరెడ్డి షాకింగ్ కామెంట్స్
  • రాజీనామాపై చంద్రబాబుకు గోరంట్ల సవాల్
  • గోరంట్లకు సరే జగన్ కూ సిగ్గులేదా?: చంద్రబాబు
  • ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరీ
  • పలాసలో హైటెన్షన్..టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్
  • టీడీపీ పోరాటంతో అనంతబాబుకు షాక్
  • తమ ఎమ్మెల్యేపై మాజీ మంత్రి అనిల్ ఫైర్
  • కురుబలకు జగన్ ఇచ్చిన స్థానం ఇది…ట్రోలింగ్
  • కొడాలి నాని బూతులపై బండ్ల గణేష్ ఫైర్
  • బాలయ్యను టార్గెట్ చేసిన రోజా
  • జిమ్ పై సీఐడీ చీఫ్ సునీల్ షాకింగ్ కామెంట్స్
  • పవన్ కు కొడాలి నాని సవాల్

Most Read

పాలు విరిగినట్టు, విరిగిన నా దేశభక్తి!

టీడీపీ నుంచి కళా వెంక‌ట్రావు సస్పెండ్?

కవర్ చేస్కోలేక రష్మిక తిప్పలు..ట్రోలింగ్

వైఎస్ భారతి తిరుమలకు ఎందుకు వెళ్లరంటే…

అనసూయ అంత మాటనేసిందేంటి?

జగనన్న నుంచి తెలుగుకు స్వాతంత్ర్యం ఎప్పుడు?..ట్రోలింగ్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra