• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఏపీలో ఆగని ఇసుక తుఫాను

రోజురోజుకు బంగారం అయిపోతున్న ఇసుక. కేంద్ర మైనింగ్ సంస్థకు ఇస్తానని చెప్పి వైసీపీ నేతలకు తెలిసిన ఢిల్లీ కంపెనీకి ఇసు కాంట్రాక్టు ఇచ్చిన జగన్ సర్కారు

admin by admin
March 22, 2021
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
411
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఇది మరో క్విడ్ ప్రో కో కి తెర లేపడం కదా?
ఆ కంపెనీ నష్టాల్లో ఉంది అనడానికి ఈ బాలన్స్ షీట్ నే ఆధారంhttps://t.co/6e6hSmBvURఈ లింక్ చూస్తే మీకే అర్థం అవుతుంది జగన్ గారి వ్యాపార దృక్పథం.
మొత్తానికి ప్రజలకి మాత్రం ఇసుమంతైన ఇసుక దొరికేనా ముఖ్యమంత్రి @ysjagan గారు..?#గోరంట్ల#ApforSale

— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) March 21, 2021

అధికారపార్టీ నేతలకు ఈ విషయమే అర్ధం కావటంలేదు. ఇసుక రీచులు, అమ్మకం లాంటి అనేక అంశాలను సరైన మార్గంలో పెట్టడంలో ప్రభుత్వం ఫెయిలైనట్లే అనుకోవాలి. గృహనిర్మాణాలకు లేదా ఇతరత్రా అవసరాలకు ఇసుక దొరకక జనాలు నానా అవస్తలు పడుతున్నారు.

ఇదే సమయంలో లారీ ఇసుక లేదా ట్రాక్టర్ ఇసుక కొనుగోలు చేయాలంటే మధ్య తరగతి జనాలకు చుక్కలు కనబడుతున్నాయి. లారీ ఇసుక ధర అనధికారికంగా సుమారు 15-25 రూపాయల మధ్య ఉందని జనాలు చెప్పుకుంటున్నారు.

నిజానికి ప్రకృతి సిద్ధంగా దొరికే  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి నేతలకు ఒక ఆదాయ మార్గంగా వాడుకోవడం మొదలుపెట్టారు.

చంద్రబాబు వచ్చాక ఇలా నేతలు దోచుకోవడానికి వీలు లేదని దానిని డ్వాక్రా సంఘాలను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి వాడాలని ప్రయోగాత్మకంగా ఇసుక అమ్మకాలను మొదలుపెట్టారు. అది అంత సఫలం కాకపోవడంతో వెంటనే ఇసుక ఉచితం అని ప్రకటించారు. దీంతో ఇసుక ప్రజలకు చాలా తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది.

అయితే… ఇసుక రీచ్ నుంచి మన ఇంటిదాకా రావడానికి అయ్యే ఖర్చును ఎవడో లారీ వాడు తీసుకుంటే అది టీడీపీ దోచుకుంటోంది వైసీపీ తెలుగుదేశంపై ఆరోపణలు చేసింది… పదేపదే వైసీపీ చెప్పిన అబద్ధాన్ని ప్రజలు నమ్మారు.  చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడంలో జగన్ అప్పట్లో సక్సెస్ అయ్యారు.

కట్ చేస్తే జగన్ అధికారంలోకి వచ్చాక కానీ అసలు దోపిడీ మొదలైందే జగన్ హయాంలో అని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. ఎందుకంటే ఇసుక అంత కాస్ట్లీ అయ్యింది.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇసుక ఆదాయం మీద పడ్డారు. ప్రభుత్వానికి, వైసీపీ నేతలకు ఆదాయ మార్గంగా మలిచారు. దీంతో ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచడంలో జగన్ సర్కారు దారుణంగా విఫలమైంది.

కొత్త పాలసీ ముసుగులో ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి ఇసుక pic.twitter.com/pX3xdnnmx0

— JanaSena Party (@JanaSenaParty) March 21, 2021

టీడీపీ హయాంలోని జగన్ చేసిన అబద్ధపు ఆరోపణలే ఇపుడు జగన్ కి బూమ్ రాంగ్ అయ్యాయి. అధికారపార్టీ ప్రజా ప్రతినిధులకు ఇసుక రీచులన్నవి కల్పతరువులాగ తయారైందనే ఆరోపణలు మరింతగా పెరిగిపోయింది. దాంతో ఇసుక వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైంది.

ఇలాంటి తలనొప్పులను వదిలించుకునేందుకు ప్రభుత్వం మొత్తం రీచులను కాంట్రాక్టు పద్దతిన ఢిల్లీలోకి జయప్రకాశ్ వెంచర్స్ కు అప్పగించింది. దీంతో ప్రజలకు ఇసుక బంగారమైపోయింది. దీంతో ప్రభుత్వంపై జనాలకు చాలా కోపం ఉంది.

Image

జనాలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని జగన్ గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడైనా ఇసుక సరఫరాను స్ట్రీమ్ లైన్ చేస్తే జనాలు సంతోషిస్తారు.  3 సార్లు ప్రయత్నించినా ఇసుక మరింత కాస్ట్లీ అవుతుందే గాని ప్రజలకు అందుబాటులోకి రావడం లేదు.

"లిక్కర్-ఇసుక" మాఫియా డాన్ గా వ్యవహరిస్తున్న జగన్! సాక్ష్యాధారాలతో బయటపెట్టిన టీడీపీ నేత పట్టాభి pic.twitter.com/tZUr9gKllv

— తెలుగుదేశంసైనికులు (@TDPMission2024) March 21, 2021

Image

Tags: andhrapradeshycpys jaganYSRCP
Previous Post

లోకేష్‌తో ఓ గంట చ‌ర్చ‌కు రాగ‌ల‌రా?‌

Next Post

ఇద్దరే ఎందుకు… 20 మందిని కనండి

Related Posts

Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Andhra

కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత

May 18, 2025
Andhra

అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Load More
Next Post

ఇద్దరే ఎందుకు... 20 మందిని కనండి

Please login to join discussion

Latest News

  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra