విశాఖ సౌత్ జనసేన ఎమ్మెల్యే ‘వంశీకృష్ణ’ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే కాలిఫోర్నియాలోని డబ్లిన్ లో పర్యటించిన వంశీకృష్ణను బే ఏరియా జనసేన ఎన్నారైలు ఘనంగా సత్కరించారు.
‘పత్తిపాటి సోదరుల’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
ఈ మొత్తం కార్యక్రమాన్ని మూర్తి అంగడాల పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమానికి ‘జన సైనికుల’తోపాటు ‘జనసేన వీరమహిళలు’ కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ..గత 9 నెలల కాలంలో ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు.
విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో జరిగిన డెవలప్మెంట్..ప్రత్యేకించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడంతో పాటు, భోగాపురం ఎయిర్ పోర్టు, పలు ఐటీ కంపెనీలు వివాఖలో పెట్టుబడులు పెట్టడం వంటివి జరిగాయని ఆయన తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల నాయకత్వాన్ని చూసి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు దిగ్గజ కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పారు.
చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ వల్ల ఏపీకి కంపెనీలు క్యూ కడుతున్నాయని, జగన్ పాలనలో గాడి తప్పిన రాష్ట్రాన్ని చంద్రబాబు గాడిన పెడుతున్నారని చెప్పారు.
ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నారని ప్రశంసించారు.
యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను లోకేశ్ అమలు చేస్తున్నారని అన్నారు.
విద్యా శాఖలో సమూల మార్పులకు లోకేశ్ శ్రీకారం చుట్టారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ చిమట, శివ మొలబంటి, అనిల్ అరిగె, శ్రీకాంత్ కాంచన, మురళి, సుబ్బు, చరణ్, కిరణ్, రావు చెన్న, దుర్గ, శ్రీకాంత్, వెంకట్, సందీప్, తులసి, శ్రీనివాస్, సూర్య మరియు సునీల్ తదితరులు పాల్గొన్నారు.