• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మోదీ టూర్ లో భద్రతా వైఫల్యం…ఆ షాకింగ్ ఘటన

NA bureau by NA bureau
July 4, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
modi

modi

0
SHARES
27
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు 125వ జ‌యంతిని పురస్క‌రించుకుని భీమ‌వ‌రంలో ఆయ‌న విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ విగ్రహాన్ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నేడు అట్టహాసంగా ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య సాధనలో అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం అందరికీ తెలియాలని, అందుకే ఆజాదీకి అమృత్ మహోత్సవ్ వేడుకలను జరుపుకుంటున్నామని మోదీ తెలిపారు. దేశం కోసం ఎందరో మహానుభావులు త్యాగాలు చేశారని, వారి త్యాగాలను ఈ వేడుకల ద్వారా స్మరించుకోవాలని అన్నారు.

తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన మోదీ ఆంధ్రప్రదేశ్ పై ప్రశంసలు కురిపించారు. ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్య భూమి, ఒక వీర భూమి అని, ఇలాంటి పుణ్య భూమికి రావడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు. వీర భూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి సీతారామరాజు అని పొగడ్తలతో ముంచెత్తారు. పింగళి వెంకయ్య, కందుకూరి వీరేశలింగం, ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు వంటి త్యాగధనులు పుట్టిన గడ్డ ఆంధ్రప్రదేశ్ అని కొనియాడారు.

అల్లూరి రంప పోరాటానికి వందేళ్లు పూర్తయ్యాయని, ఆ మహనీయుడు నడయాడిన నేలపై మనం నడవడం సంతోషకరమని అన్నారు. వందేమాతరం నినాదం, ‘మనదే రాజ్యం’ నినాదం ఒకే లాంటివని చెప్పారు. మోగల్లులోని ధ్యానమందిరం, చింతపల్లి పీఎస్ ను అభివృద్ధి చేస్తామని మోదీ తెలిపారు. లంబసింగిలో అల్లూరి మెమోరియల్, గిరిజన మ్యూజియంను నిర్మిస్తామని అన్నారు.  ఏడాది పాటు అల్లూరి జయంతి, రంప పోరాటం ఉత్సవాలను నిర్వహిస్తామని మోదీ తెలిపారు అల్లూరి సీతారామరాజు కుటుంబసభ్యులతో వేదికను పంచుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా అల్లూరి కుటుంబ సభ్యులను మోదీ సన్మానించారు.

కాగా, అంతకుముందు మోదీకి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి భీమవరానికి మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్  నల్ల బెలూన్లను ఢీకొట్టే ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడింది. హెలికాప్టర్ వస్తున్న సమయానికి కొందరు వ్యక్తులు గాల్లోకి నల్ల బెలూన్లను ఎగురవేయగా…అవి హెలికాప్టర్ కు సమీపంగా వెళ్లాయి. దీంతో, ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) కోరింది. ఇది భద్రతా వైఫల్యమేనని ఎస్పీజీ, బెలూన్ల తరహాలో డ్రోన్లను ఎగురవేసి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

అయితే, ప్రధాని పర్యటనలో ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని, హెలికాప్టర్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో బెలూన్లను ఎగురవేశారని  కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా అన్నారు. బెలూన్లలో హైడ్రోజన్ లేదని… నోటితో గాలి ఊది బెలూన్లను ఎగరేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు బెలూన్లను ఎగురవేసి నిరసన తెలిపారని వెల్లడించారు. సుంకర పద్మశ్రీ, సావిత్రి, రాజీవ్ రతన్ వంటి వారు ఈ ఘటనకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందని చెప్పారు.

Tags: black balloonsmodi's tournsg seriousprotest by congresssecurity failureshocking incident
Previous Post

ఏం చేద్దామంటావ్ ఇప్పుడు…కేసీఆర్ చెప్పిన పాపుల‌ర్ డైలాగ్ గుర్తుకువ‌స్తుందే!

Next Post

జగన్ అరాచకంపై మోదీకి రఘురామ లేఖ

Related Posts

nara bhuvaneswari with lokesh
Andhra

భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!

October 1, 2023
nara bramhani with janasena
Andhra

నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!

October 1, 2023
jagan thinks about kamma
Andhra

జగన్ ఊహించని రెండు పరిణామాలు

October 1, 2023
KCR
Telangana

కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!

October 1, 2023
Around The World

రెండు దశాబ్దాలు..!మృత్యుంజయుడై నిలిచిన చంద్రబాబు!!

October 1, 2023
Top Stories

ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?

September 30, 2023
Load More
Next Post
raghurama raju

జగన్ అరాచకంపై మోదీకి రఘురామ లేఖ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!
  • నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!
  • జగన్ ఊహించని రెండు పరిణామాలు
  • కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!
  • రెండు దశాబ్దాలు..!మృత్యుంజయుడై నిలిచిన చంద్రబాబు!!
  • మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్
  • ‘హుకూం’ పాట అసలు లేనే లేదట
  • ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?
  • ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ
  • Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?
  • చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్
  • అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
  • 41ఏ నోటీసులు అందుకున్న లోకేష్..4న విచారణ
  • జగన్ భుజంపై ‘బీజేపీ అనకొండ’ కోరల్లో చంద్రబాబు
  • చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల సస్పెండ్

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra