• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఏపీ దౌర్భాగ్యం…1000 కోట్లు లేక 20 వేల కోట్లు వదులకుంటున్న జగన్

admin by admin
August 26, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
761
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సీఎం జగన్ చేస్తున్న అప్పులు…దానికోసం పడుతున్న తిప్పలు…ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి కొంతకాలంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా ప్రధాని మోడీ…ఏపీ అప్పులపై ఫోకస్ చేశారు. ఇలా అయితే, ఏపీ ఆర్థిక వ్యవస్థ మరో రెండు నెలల్లో కుప్పుకూలుతుందంటూ కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అభిప్రాయపడ్డారు. ఇంత జరుగుతున్నా…జగనన్న మాత్రం సంక్షేమ పథకాల విషయంలో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ చెబుతూ తగ్గేదే లే అంటూ ముందుకు పోవడంపై విమర్శలు వస్తున్నాయి.

ఇక, జగన్ ది అసమర్థ పాలన అంటూ ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేస్తుంటే…ఇది రాజకీయాల్లో కామన్ లే అనుకున్నవారంతా ఈ విషయం తెలిస్తే ఒళ్లుమండడం ఖాయం. నవరత్నాల పేరుతో వేల కోట్లు ఖర్చుపెడుతున్న జగన్…కేవలం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేక 20 వేల కోట్ల ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని తెలిస్తే ప్రతిపక్ష నేతలకే కాదు…పౌరుషం ఉన్న ప్రతి ఆంధ్రుడి కడుపు రగిలిపోవడం ఖాయం. భావితరాల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న జగన్ పై ఆంధ్రులంతా తిరగబడడం ఖాయం అన్న రీతిలో వెలుగులోకి వచ్చిందీ ఉదంతం.

దాదాపు 22వేల కోట్ల రూపాయల అంచనాతో 2016లో అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే (ఎన్‌హెచ్‌544ఎఫ్‌)ను ప్రతిపాదించగా కేంద్రం 2018లో ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు భూసేకరణకు 2వేల కోట్లు ఖర్చవుతుందని నాడు అంచనా వేశారు. అయితే, నాటి టీడీపీ ప్రభుత్వం తాము వెయ్యి కోట్లు భరించగలమని చెప్పడంతో కేంద్రం సరేనంది. ఆ తర్వాత డీపీఆర్‌లను కేంద్రం ఆమోదించింది. ఈ రహదారికి ఎన్‌హెచ్‌ 544ఎఫ్‌ అనే నంబరు కూడా కేటాయించారు. భూసేకరణ పనులు ప్రారంభించేందుకు ఇప్పటికే 3డి నోటిఫికేషన్‌ జారీచేశారు. ఆ తర్వాత ప్రాజెక్టును వేగంగా చేపట్టేందుకు భారత్‌మాల జాబితాలో చేర్చారు.

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మర్రూరు నుంచి అమరావతి పరిధిలోని పెదపరిమి వరకు 385 కి.మీ. పొడవున.. ఎలాంటి మలుపులు లేకుండా ఉండేలా ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను డిజైన్‌ చేశారు. కర్నూలు, కడప జిల్లాల నుంచి వచ్చే రహదారులను అనుసంధానం చేసేలా డిజైన్లు రూపొందించారు. కేవలం 6గంటల వ్యవధిలోనే అనంతపురం నుంచి అమరావతికి చేరుకునేలా.. గంటకు కనీసం 100 కి.మీ. వేగంతో ప్రయాణించేలా ఈ ప్రాజెక్టుకు నాటి సీఎం చంద్రబాబు రూపకల్పన చేశారు. అంతా సజావుగా జరుగుతున్న సమయంలో 2019లో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది.

అమరావతిపై కక్ష గట్టిన జగన్…ఈ ప్రాజెక్టుపై పెద్దగా ఆసక్తి చూపలేదు. 3 రాజధానులంటూ అమరావతిని నిర్లక్ష్యం చేశారు. అధికార వికేంద్రీకరణను తెరపైకి తెచ్చాక దీనిని పక్కనపెట్టేశారు. ఇక, అప్పుల ఊబిలో మునిగిపోయిన జగన్ సర్కార్ 20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు కోసం కనీసం వెయ్యి కోట్లు కూడా ఇచ్చే పరిస్థితిలో లేకపోవడంతో ఆ ప్రాజెక్టు అటకెక్కబోతోందని తెలుస్తోంది. దానికి బదులు బెంగళూరు-గుంటూరు ఎక్స్‌ప్రె్‌సవేను తెరపైకి తీసుకురాబోతున్నారు. కడప, పులివెందుల, మైదుకూరు, ఇతర ప్రాంతాలను కలుపుతూ కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ వరకు కొత్త రహదారిని తీసుకెళ్లి దాన్ని బెంగళూరు హైవేకి కలపాలన్నది ప్రతిపాదన.

అయితే, మిగతా జిల్లాలవారు ఫీల్ కాకుండా నెల్లూరు-అనంతపురం, ప్రకాశం-అనంతపురం, గుంటూరు-అనంతపురం ప్రాజెక్టులు కూడా చేపట్టాలని ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. వీటన్నిటికీ కేంద్రం సమ్మతిస్తుందా.. లేక అవి కూడా ప్రతిపాదనలకే పరిమితమవుతాయా అన్నది త్వరలో తేలనుంది. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే సాకారమయితే అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు అద్భుతమైన రహదారి కనెక్టివిటీ వస్తుంది. రహదారి వెంటే ఇండస్ట్రియల్‌, గ్రోత్‌ కారిడార్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. యువతకు లెక్కలేనన్ని ఉపాధి అవకాశాలొస్తాయి. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికే మణిమకుటం అవుతుంది. కేవలం టీడీపీ హయాంలో చంద్రబాబు తెచ్చిన ప్రాజెక్టు కాబట్టి అన్ని అనుమతులు వచ్చిన ఈ ప్రాజెక్టును జగన్ వద్దంటున్నారని విమర్శలు వస్తున్నాయి.

Tags: 1000 crores20000 croresananthapuram-amaravathi express high wayap cm jaganap in debtsap losing 20 thousand crores project
Previous Post

బండ బూతులు.. తొడ‌గొట్టి స‌వాళ్లు.. తెలుగు రాష్ట్రాల మంత్రుల‌కు ఏమైంది?  

Next Post

శ్రీకాళహస్తిలో నెరవేరిన వైసీపీ ‘రంగుల’ కల

Related Posts

pawan bjp
Politics

పవన్ పై బీజేపీ కుట్ర !

March 21, 2023
purandheswari
Andhra

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

March 21, 2023
pawan kalyan with nithin
Movies

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

March 21, 2023
pawan kalyan
Movies

పవన్ ఈ స్పీడేంటి సామీ !

March 21, 2023
ys jagan
Andhra

బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?

March 21, 2023
revanth
Politics

తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట

March 21, 2023
Load More
Next Post

శ్రీకాళహస్తిలో నెరవేరిన వైసీపీ 'రంగుల' కల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • పవన్ పై బీజేపీ కుట్ర !
  • ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!
  • పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు
  • పవన్ ఈ స్పీడేంటి సామీ !
  • బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?
  • తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట
  • కేసీఆర్ ధీమా వెనుక
  • వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు
  • ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్
  • అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు
  • ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌
  • రేవంత్ దెబ్బకు ప్రగతిభవన్ ఉక్కిరిబిక్కిరి
  • ఒత్తిడికి తలొంచక తప్పలేదా?
  • బీఆర్ఎస్ లో ఈ హడావుడి ఎందుకో తెలుసా ?
  • జగన్ పతనానికి ఈ ఫలితాలే నాంది: లోకేష్

Most Read

శ్రీకాంత్ కొడుకు… ఒకేసారి రెండు

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

పవన్ ఈ స్పీడేంటి సామీ !

బెల్లంకొండ ఏంటి ఇంత పెద్ద షాకిచ్చాడు !

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

వైసీపీకి షాకిచ్చిన ఓటర్లు… మార్పు మొదలైంది

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra