• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ కక్షా రాజకీయాలకు పరాకాష్ట ఈ ఘటన

జగన్ పశ్చాత్తాపపడక తప్పదని అచ్చెన్నాయుడు వార్నింగ్...ఘటనపై మండిపడ్డ టీడీపీ నేతలు

NA bureau by NA bureau
June 8, 2021
in Andhra, Politics, Top Stories
0
అది తప్పుడు వీడియో…అచ్చెన్నాయుడు క్లారిటీ
0
SHARES
374
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

2019 ఎన్నికల ప్రచారంలో నాటి ప్రతిపక్ష నేత జగన్…ప్రతి స్పీచ్ లోనూ ఓ రేంజ్ లో సినిమా డైలాగుల తరహాలో హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాను సీఎం అయ్యాక…కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడనని….అర్హులైన వారందరికీ పథకాలు, ప్రభుత్వ ఫలాలు అందిస్తానని అరచేతిలో వైకుంఠం చూపించారని జగన్ సీఎం అయిన కొద్ది రోజులకే విమర్శలు వచ్చాయి. సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టిన రెండు నెలల్లోనే టీడీపీ నేతలు, కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రతీకార దాడులు పెరిగిపోయాయని, ఏపీలో పులివెందుల పంచాయతీలు మొదలయ్యాయని టీడీపీ నేతలు విమర్శించారు.

టీడీపీకి ఓటు వేసిన పాపానికి కొందరు టీడీపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లకుండా గోడలు అడ్డుకట్టిన ఘనత వైసీపీ నేతలదేనని విమర్శలు వచ్చాయి. ఇక, ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చారన్న కారణంతో టీడీపీ కార్యకర్తలు ఇళ్ల ప్రహరీ గోడలు కూల్చివేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. అయినప్పటికీ, ఏపీలో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. అయినా కూడా ఏపీ పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా కర్నూలు జిల్లా, పెద్దకడుబూరు మండలం, బసలదొడ్డిలో టీడీపీ సానుభూతిపరులకు తాగునీరు నిలిపివేసిన ఘటన సంచలనం రేపింది. టీడీపీకి ఓట్లు వేశారన్న ఉద్దేశంతో కటిక కాలనీకి నీళ్ల సరఫరాను అధికార పార్టీ నాయకులు నిలిపివేశారు. దీంతో తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇది హేయమైన చర్య అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కులం, మతం చూడమని చెప్పిన జగన్  ఇతర పార్టీల వాళ్లకు కనీసం త్రాగునీరు కూడా ఇవ్వకుండా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అచ్చెన్న దుయ్యబట్టారు. టీడీపీకి ఓట్లు వేశారని నీళ్లు, ఫించన్, రేషన్ ఆపి వేయడం జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వానికి నిదర్శనమని నిప్పులు చెరిగారు.

కరోనా కట్టడి, పాలన గాలికొదిలి టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ జగన్ రాక్షసానందం పొందుతున్నారని అచ్చెన్న విమర్శించారు. రెండేళ్ల పాలనలో  దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, కక్ష్య సాధింపు చర్యలు తప్ప ప్రభుత్వం  సాధించిన ప్రగతి ఏంటని అచ్చెన్న నిలదీశారు. అమరావతి రాజధానిగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రాన్ని జగన్…అక్రమ కేసులు, అరాచకాలతో అక్రమ అరెస్టుల ఆంద్రప్రదేశ్‌గా మార్చారని ఆరోపించారు. రాజారెడ్డి రాజ్యాంగానికి మరో మూడేళ్లే వ్యాలీడిటి అని, టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సీఎం జగన్, వైసీపీ నేతలు ప్రతి రోజూ పశ్చాత్తాపపడక తప్పదని  వార్నింగ్ ఇచ్చారు.

Tags: ap cm jaganap tdp chief achennaidukurnooltdp sympathizerswater supply cut
Previous Post

Photos: వయసు 45, సొగసు 25

Next Post

జగన్ కు వారు నోటీసు ఇచ్చారండోయ్

Related Posts

ఫడ్నవీస్ కు మరీ ఇంత కక్కుర్తా ?
Around The World

ఫడ్నవీస్ కు మరీ ఇంత కక్కుర్తా ?

July 1, 2022
ఘనంగా ఆటా సభలు ప్రారంభం… అతిథుల్లో ప్రముఖులు
Around The World

ఘనంగా ఆటా సభలు ప్రారంభం… అతిథుల్లో ప్రముఖులు

July 1, 2022
తెలుగుదేశం నేత అయ్యన్నపై కేసు
Andhra

హైకోర్టులో జగన్ కు మరో షాకిచ్చిన అయ్యన్న…

July 1, 2022
అన్నంత పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు..వైరల్
Andhra

అన్నంత పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు..వైరల్

July 1, 2022
RRR: ఈసారి సీబీఐని కూడా వదల్లేదు, జగన్ కి మరో పెద్ద షాక్
Andhra

అడ్డగోలు అరెస్టులు ఆపండి..రఘురామకు హైకోర్టు ఊరట

July 1, 2022
ఆ మల్లెపూలేయ్…మంత్రులపై అయ్యన్న సెటైర్లు వైరల్
Andhra

కోర్టుల్లేకుంటే కొట్టి చంపేవారు…అయ్యన్న షాకింగ్ కామెంట్స్

July 1, 2022
Load More
Next Post
jagan

జగన్ కు వారు నోటీసు ఇచ్చారండోయ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఫడ్నవీస్ కు మరీ ఇంత కక్కుర్తా ?
  • ఘనంగా ఆటా సభలు ప్రారంభం… అతిథుల్లో ప్రముఖులు
  • హైకోర్టులో జగన్ కు మరో షాకిచ్చిన అయ్యన్న…
  • అన్నంత పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు..వైరల్
  • అడ్డగోలు అరెస్టులు ఆపండి..రఘురామకు హైకోర్టు ఊరట
  • కోర్టుల్లేకుంటే కొట్టి చంపేవారు…అయ్యన్న షాకింగ్ కామెంట్స్
  • ఆన్ లైన్ టికెట్ల వ్యవహారంలో జగన్ కు హైకోర్టు షాక్
  • 2004లో జగన్ సీఎం అయ్యుంటే? చంద్రబాబు షాకింగ్ థియరీ
  • ఇది కదా సక్సెస్… ఆటో డ్రైవర్ సీఎం అయ్యాడే
  • మీనా భర్తకు ఆ అవయవం దొరక్కే..
  • మొదటి సారి టీఆర్ఎస్ కి మద్దతుగా మాట్లాడిన రేవంత్
  • రిచెస్ట్ పర్సన్ తో సహజీవనం చేస్తున్న తెలుగోళ్ల ఫేవరెట్ ఆంటీ
  • “అనంత ” దుర్ఘట‌న‌ – ప‌వ‌న్ స్పంద‌న ఇది..
  • ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఇరికించిన ఏబీ
  • ఏపీ అధికారుల కట్టు కథ
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds