• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అమిత్ షాకు తెలంగాణపై మోజు తగ్గలేదుగా…

NA bureau by NA bureau
July 15, 2022
in Politics, Telangana, Top Stories
1
0
SHARES
182
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండ లం ఎర్దండిలో జరిగిన ఘటనపై ఆరా తీశారు. అర్వింద్పై దాడిని ఆయన ఖండించారు. ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని అర్వింద్ అమిత్ షా‌కు వివరించారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అధికార టీఆర్ ఎస్‌ పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని అర్వింద్ అమిత్ షాకు తెలిపారు.

తన పార్లమెంట్ పరిధిలో ఎక్కడ తిరిగినా తనపై దాడులు జరపాలని టీఆర్ ఎస్‌ నాయకత్వం ఎమ్మెల్యేలకు సూచించిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇవాళ జరిగిన దాడి వెనక ఎమ్మెల్యే విద్యాసాగర్ ఉన్నారని అమిత్షాకు తెలిపారు. మొత్తానికి అర్వింద్ చెప్పింది ఓపిక‌గా విన్న షా.. ఏం చేయాల‌నే విష‌యంపై మాత్రం దిశానిర్దేశం చేయ‌లేదు. త్వ‌ర‌లోనే తాను మ‌రోసారి హైద‌రాబాద్‌కు వ‌స్తాన‌ని చెప్పిన‌ట్టు అర్వింద్ స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి.

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో గోదావరి ముంపును పరిశీలించడానికి వెళ్లిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఆ గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామానికి సంబంధించిన భూ వివాదం పరిష్కరించకుండా ఎందుకు వచ్చారంటూ ఆయనను నిలదీశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు గ్రామస్థులను పక్కకు తప్పించగా.. ఎంపీ అర్వింద్‌ గోదావరి ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లారు.

ఆ సమయంలో తమపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపించారు. దీంతో తిరుగు పయనమైన అర్వింద్ ను మరోసారి వారు అడ్డుకున్నారు. గ్రామస్థులను పోలీసులు తప్పించి అర్వింద్‌ కాన్వాయ్‌ను ముందుకు పంపించారు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు.. కాన్వాయ్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో రెండు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.  ఈ సమయంలో కొంతమంది ‘అర్వింద్‌ గో బ్యాక్’ అని నినాదాలు చేస్తూ  ఆయన ఉన్న కారు అద్దాలను పగులగొట్టి అర్వింద్‌పై దాడికి దిగారు.

ఈ దాడిపై అర్వింద్ మాట్లాడుతూ.. ‘‘ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగింది, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయి. బీజేపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ దాడులు చేస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎక్కడ తిరిగిన దాడులు జరపాలని టీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్యేలకు ఆదేశాలిచ్చింది.  దాడి వెనక టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగరరావు ఉన్నారు’’ అని ఎంపీ అర్వింద్ అమిత్ షా‌కు ఫోన్లో తెలిపారు. దీంతో ఆయ‌న హైద‌రాబాద్‌కు వ‌చ్చాక ప‌రిశీలిస్తాన‌ని హామీ ఇచ్చిన‌ట్టు తెలిసింది.

Tags: amit shahbjp eying on telanganabjp leader shahbjp mp arvindTelangana politics
Previous Post

దశ దిశలా తెలుగు వెలుగు మన భాద్యత: గుమ్మడి గోపాలకృష్ణ!!

Next Post

బీజేపీతో పవన్ కటీఫ్..ముహూర్తం ఫిక్స్?

Related Posts

Around The World

అసలైన విమోచన దినం నవంబర్ ౩౦!

November 28, 2023
Trending

చంద్రబాబుకు సుప్రీం కోర్టు భారీ ఊరట

November 28, 2023
Top Stories

రైతుబంధు లొల్లి.. అల్లుడి నోటిదూలతోనే.. రేవంత్ ఫైర్

November 28, 2023
tdp flag
Andhra

టీడీపీకి మద్దతిచ్చారని కుటుంబం వెలి

November 28, 2023
KCR
Trending

బీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైందా?

November 28, 2023
Trending

టీటీడీని కాపాడాలని మోడీకి రమణ దీక్షితులు మొర

November 28, 2023
Load More
Next Post

బీజేపీతో పవన్ కటీఫ్..ముహూర్తం ఫిక్స్?

Comments 1

  1. Pingback: అమిత్ షాకు తెలంగాణపై మోజు తగ్గలేదుగా… - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అసలైన విమోచన దినం నవంబర్ ౩౦!
  • చంద్రబాబుకు సుప్రీం కోర్టు భారీ ఊరట
  • రైతుబంధు లొల్లి.. అల్లుడి నోటిదూలతోనే.. రేవంత్ ఫైర్
  • టీడీపీకి మద్దతిచ్చారని కుటుంబం వెలి
  • బీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైందా?
  • మల్లారెడ్డి కామెంట్లకు రణ్ బీర్ కపూర్ ఫ్యాన్స్ హర్ట్
  • టీటీడీని కాపాడాలని మోడీకి రమణ దీక్షితులు మొర
  • చంద్రబాబు ఢిల్లీ టూర్ అసలు లెక్క ఇదా?
  • వైసీపీ నేతల తాట తీసే జైలర్ చంద్రబాబే: లోకేష్
  • ఇక పవన్ పెళ్లిళ్లపై జగన్ మాట్లాడలేరు!
  • బీఆర్ఎస్ షాక్.. ఛాన్స్ మిస్సయినట్లేనా?
  • యానిమల్ ఈవెంట్.. అందరి చూపూ అటే
  • నాపై 250 కేసులు.. నామీద 26 కేసులు.. నాపై 6 కేసులు..!!
  • రైతు బంధు రద్దు.. హరీష్ రావు తగ్గట్లేదు
  • కేటీఆర్ ను వాయించేస్తున్న నెటిజన్లు

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

వేళ్లన్నీ రవితేజ వైపే..

జగన్ పై జింబాబ్వే నుంచి వీడియో ర్యాగింగ్ …. వైసీపీకి మండిపోయింది

జ‌గ‌న్‌ బెయిల్ ఇప్పుడే ర‌ద్దు చేయాలా? : సుప్రీం

జగన్ ను వణికించే మాట చెప్పిన ‘మిషన్ చాణక్య’ బాస్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra