• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఢిల్లీలో అమరావతి రైతుల ధర్నాకు జాతీయ స్థాయి మద్దతు

admin by admin
December 17, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
167
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సీఎం జగన్ పదవి చేపట్టిన వెంటనే నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై అక్కసు వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. మూడు రాజధానులంటూ జగన్ కొత్త పల్లవి అందుకోవడంతో తమ కలల రాజధానికి వేల ఎకరాలు ఇచ్చిన రైతుల కడుపు మండింది. ఆ కడుపుమంటతోనే కదం తొక్కిన రైతన్నలు…పోరు బాట పట్టారు. పలుగు పార పట్టిన చేతులతోనే ఉద్యమ బ్యానర్లు, జెండాలు పట్టారు. ఈ క్రమంలోనే అమరావతి రైతులు ఉద్యమ స్ఫూర్తికి జగన్ సైతం తలవంచక తప్పలేదు.

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ హైకోర్టు కూడా తీర్పు చెప్పింది. అయితే, హైకోర్టు తీర్పుతోపాటు అమరావతి రైతుల ఆకాంక్షలను పట్టించుకోని జగన్…ఆ తీర్పును అమలు చేయకుండా కుంటి సాకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమ ఉద్యమాన్ని అమరావతి రైతులు జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. ఏపీకి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు.

అమరావతి ఉద్యమాన్ని ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రైతులు ఢిల్లీలో ఈ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో 1600 మంది రైతులు పాల్గొన్నారు. అమరావతి పరిసర గ్రామాల నుంచి రైతులు ప్రత్యేక రైలులో ఢిల్లీకి వెళ్లారు. అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ ధర్నా జరగనుంది. ఈ ధర్నాకు రావాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్‌ ఎంపీ హనుమంతయ్య, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ తోపాటు పలు రాజకీయాల పార్టీల నేతలను రైతులు ఆహ్వానించారు.

దీంతో, రాజధాని రైతుల నిరసనకు టీడీపీ, జనసేన, టీడీపీ, సీపీఐ నేతలు, పలు రైతు సంఘాల నాయకులు మద్దతు పలికారు. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, జనసేన నేత హరిప్రసాద్, ఏఐసీసీ కార్యదర్శి జేడీ శీలం, ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు జంతర్ మంతర్ కు వెళ్లి రైతులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ పార్టీల నేతలను అమరావతి రైతులు కలిసి తమ గోడు వెళ్లబోసుకోనున్నారు. సోమవారంనాడు రామ్ లీలా మైదానంలో జరిగే భారతీయ కిసాన్ సంఘ్ ర్యాలీలో అమరావతి రైతులు పాల్గొనబోతున్నారు. అమరావతి రైతు ఉద్యమాన్ని భారతీయ కిసాన్ సంఘ్ ప్రత్యేక అజెండాగా చేర్చింది.

Tags: amaravati farmersjantar mantarone capital amaravatiprotest in delhi
Previous Post

మౌనికతో పెళ్లిపై మంచు మనోజ్ హింట్

Next Post

రేవంత్ పై కాంగ్రెస్ సీనియర్ల తిరుగుబాటు

Related Posts

Top Stories

వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్

March 29, 2023
Trending

వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!

March 29, 2023
Trending

టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్

March 29, 2023
Trending

చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు

March 29, 2023
Trending

టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?

March 29, 2023
Trending

ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?

March 29, 2023
Load More
Next Post

రేవంత్ పై కాంగ్రెస్ సీనియర్ల తిరుగుబాటు

Latest News

  • వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్
  • వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!
  • టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్
  • చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు
  • టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?
  • ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?
  • అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!
  • యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!
  • టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!
  • అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్
  • అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?
  • తమ్మినేనికి ఎసరు పెట్టిన కూన రవికుమార్
  • వైసీపీ రెండుగా చీలిందంటోన్న లోకేష్
  • లక్ష్మీ పార్వతి కి సజ్జలకు లింకేంటో చెప్పిన రఘురామ!
  • జగన్ కు పులివెందుల టెన్షన్

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్ ఈ స్పీడేంటి సామీ !

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra