• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ తో అదానీలతో సీక్రెట్ కహానీ?

తాడేపల్లిలో జగన్ తో అదానీ సోదరుల రహస్య భేటీ?

admin by admin
September 13, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
544
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

గంగవరం పోర్టులో తనకున్న 10.4 శాతం వాటాను అదానీ గ్రూప్ నకు ఏపీ ప్రభుత్వ విక్రయించడంపై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. రూ.9 వేల కోట్ల విలువైన ప్రభుత్వ వాటాను కేవలం రూ.645 కోట్లకే అదానీ  పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ లిమిటెడ్‌ త్వరలోనే సొంతం చేసుకోనుందన్న వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకమంటూ చెబుతోన్న జగన్….ప్రైవేటీకరణకు సహకరించేందుకే తమ వాటాను అదానీ గ్రూప్ నకు కట్టబెట్టారన్న ప్రచారం జరుగుతోంది.

దీంతో, గంగవరం పోర్టు వాటాల కొనుగోలు వ్యవహారంలో జగన్ సర్కార్ పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే గంగవరం, కృష్ణపట్నం పోర్టుల విషయంలో లోపాలపై లోకాయుక్తతో దర్యాప్తు జరిపించాలని, ప్రొప్రైటీ ఆడిట్‌ నిర్వహించేలా కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)ను ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిల్ ను విచారణకు అంగీకరించిన ధర్మాసనం విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

గంగవరం పోర్ట్‌ లిమిటెడ్‌ లో ఆ సంస్థ ప్రమోటర్‌ అయిన డీవీఎస్‌ రాజు నుంచి 58.1 శాతం వాటాను కొంతకాలం క్రితం అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. అంతకుముందే, ఆ కంపెనీలో 31.5 శాతం వాటాను వార్‌బర్గ్‌ పింకస్‌కు చెందిన విండీ లేక్‌సైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అనే సంస్థ నుంచి అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. తాజాగా ఏపీ ప్రభుత్వానికి చెందిన 10.4 శాతం వాటా కూడా దక్కడంతో ..గంగవరం పోర్ట్‌లో 100 శాతం వాటా అదానీ చేతికి వచ్చినట్లు కానుంది. దీంతో, గంగవరం పోర్టును అదానీ శాసించనున్నారు. ఈ క్రమంలోనే వారి భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ సీఎం జగన్ తో గౌతం అదానీ సోదరులు భేటీ అయ్యారన్న ప్రచారం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జగన్ ను అదానీ సోదరులు కలిశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టును దక్కించుకున్న అదానీ సోదరులు…తాజాగా గంగవరం పోర్టును కూడా దక్కించుకోబోతున్నారు. ఈ క్రమంలోనే జగన్ తో వారి భేటీ తీవ్ర చర్చనీయాంశమైంది.

Tags: Adani brothersadani brothers met jaganap cm jagangangavaram portgangavaram port dealsecret meeting
Previous Post

అసైన్డ్ భూముల వ్యవహారంలో జగన్ కు హైకోర్టు షాక్

Next Post

జగన్ పై అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు

Related Posts

nara bhuvaneswari with lokesh
Andhra

భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!

October 1, 2023
nara bramhani with janasena
Andhra

నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!

October 1, 2023
jagan thinks about kamma
Andhra

జగన్ ఊహించని రెండు పరిణామాలు

October 1, 2023
KCR
Telangana

కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!

October 1, 2023
Around The World

రెండు దశాబ్దాలు..!మృత్యుంజయుడై నిలిచిన చంద్రబాబు!!

October 1, 2023
Top Stories

ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?

September 30, 2023
Load More
Next Post

జగన్ పై అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!
  • నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!
  • జగన్ ఊహించని రెండు పరిణామాలు
  • కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!
  • రెండు దశాబ్దాలు..!మృత్యుంజయుడై నిలిచిన చంద్రబాబు!!
  • మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్
  • ‘హుకూం’ పాట అసలు లేనే లేదట
  • ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?
  • ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ
  • Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?
  • చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్
  • అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
  • 41ఏ నోటీసులు అందుకున్న లోకేష్..4న విచారణ
  • జగన్ భుజంపై ‘బీజేపీ అనకొండ’ కోరల్లో చంద్రబాబు
  • చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల సస్పెండ్

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra