ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం. ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విషయంలో వైసీపీ కార్యకర్తల నుంచి వినిపిస్తున్న మాట ఇది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అయిన యరపతినేనికి వైసీపీ నాయకులు , కార్యకర్తల నుంచి ప్రశంసలు ఏంటన్న విస్మయం కలగడం సహజం. అయితే ఇది ముమ్మాటికీ నిజం. రాజకీయాలను కేవలం ఎన్నికల వరకే పరిమితం చేసిన యరపతి నేని.. ఎన్నికలు ముగిసిన.. 10 మాసాల కాలంలో టీడీపీ కార్యకర్తలతోపాటు.. వైసీపీ కార్యకర్తలను కూడా.. సమానంగానే చూస్తున్నారు.
ఇది రాజకీయంగా కాదు.. తమ సమస్యలు చెప్పుకొని.. తమను ఆదుకోవాలని..కొరిన ఎవరినైనా ఆయన ఆదుకుంటున్నారు. ఇది ఆయనలోని మానవత్వాన్ని.. నిరాడంబరతను.. పార్టీలకు అతీతంగా ప్రజలకు చేరువ అవుతున్న విధానాన్ని స్పష్టం చేస్తోంది. గత వైసీపీ హయాంలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి.. వైసీపీ నాయకులపై కేసులు పెట్టించారు. తాను ఎంచుకున్న వారికి మాత్రమే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందించేవారు.
జగనన్న ఇళ్ల కాలనీల విషయంలో కూడా.. తనకు జై కొట్టిన వారిని మాత్రమే ఎంపిక చేశారన్న విమర్శలు.. ఆరోపణలు ఉన్నాయి. దీంతో మిగిలిన వారు.. నిజమైన లబ్ధిదారులే అయినా.. వైసీపీలో నే ఉన్నా.. వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా.. నిరంతరం.. వివాదాలతోనే ఆయన కొనసాగారు. అప్పట్లో వైసీపీలోనే ఉన్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గానికి ఏ ఒక్క పని కూడా అవ్వనివ్వలేదు. కానీ.. యరపతినేని ఎన్నికైన తర్వాత.. స్థితప్రజ్ఞతను చూపిస్తున్నారు. తన సీనియారిటీని.. సిన్సియారిటీ రంగరించి.. ప్రజలకు చేరువ అవుతున్నారు.
ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్తలుగా ఉండి… పేదరికంలో మగ్గుతున్నవారు.,. ఆయనను ఆశ్రయిస్తే.. పక్కకు తప్పించడం లేదు. కక్ష పూరిత రాజకీయాలకు కూడా దిగడం లేదు. వారిని కూడా ఆదుకుంటున్నారు. దీంతో ఒకప్పుడు.. వైసీపీ జెండా ఎగిరిన గురజాల పల్లెల్లో ఇప్పుడు యరపతినేని పేరు వినిపిస్తోంది. టీడీపీ జెండాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. యరపతి నేని ఫొటోలను పెట్టుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయని అంటే..ఆశ్చర్యం వేస్తుంది.