• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ కు డబుల్ షాక్ ఇచ్చిన షర్మిల

admin by admin
October 21, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
216
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తన అన్న జగన్ సీఎంగా ఉన్న రాష్ట్రంలో తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని వైఎస్ సునీతా చాలాకాలంగా ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కేసును ఏదైనా పొరుగు రాష్ట్రంలోని హైకోర్టుకు బదిలీ చేయాలన్న సునీత అభ్యర్థనకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో, జగన్ కు షాక్ తగిలినట్లయింది. ఇక, ఆ షాక్ నుంచి జగన్ తేరుకోక ముందే…సొంత సోదరి వైఎస్ షర్మిల…జగన్ కు మరో షాక్ ఇచ్చారు.

వివేకా హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదేనంటూ వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేసిన కామెంట్లు ఇరు తెలుగు రాష్ట్రాలలో కాక రేపుతున్నాయి. కేసు బదిలీ మంచి పరిణామమని, తమ కుటుంబంలో చిన్నాన్న వివేకా హత్య ఓ ఘోరమైన ఘటనగా మిగిలిపోయిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. సునీతా రెడ్డికి న్యాయం జరగాల్సిందేనని, వివేకాను ఘోరంగా హతమార్చినవారెవరో బయటకు రావాల్సిందేనని అన్నారు.

వివేకా మర్డర్ కేసు దర్యాప్తును ఎవరూ అడ్డుకోకూడదని, ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్ల సంగతి సీబీఐ దర్యాప్తులో తేలుతుందని అన్నారు. తప్పు ఎవరు చేసినా కఠిన శిక్ష పడాలని, విచారణ జరగాలని అన్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. హస్తినలో కాగ్ అధికారులను కలిసిన షర్మిల కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతిపై సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

దివంగత సీఎం వైఎస్ ఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.38 వేల కోట్లు కేటాయించి పూర్తి చేయాలనుకున్నారని, 16 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని సంకల్పించారని అన్నారు. కేసీఆర్ హయాంలో ప్రాజెక్ట్ వ్యయం లక్షా 20 వేల కోట్లకు పెంచారని, ఆయకట్టు 2 లక్షల ఎకరాలు మాత్రమే పెరిగిందని ఆరోపించారు.

Tags: Jagansupreme courtviveka's caseys sharmilays sunitha
Previous Post

జేపీ నడ్డాకు సమాధి..కేసీఆర్ కు కిషన్ రెడ్డి వార్నింగ్

Next Post

పాదయాత్రపై వైసీపీ కుట్రకు హైకోర్టు చెక్

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Load More
Next Post

పాదయాత్రపై వైసీపీ కుట్రకు హైకోర్టు చెక్

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra