సమాజంలో జరుగుతున్న కొన్ని కొన్ని పనులు చెప్పుకోవాడానికి.. వినడానికి కూడా బాధ కలిగిస్తున్నాయి. సాంకేతికత పెరిగి.. జీవన విధానాల్లో మార్పులు వచ్చినా.. మనుషుల మైండ్ సెట్లో మార్పులు రాకపోగా.. మరింత దారుణంగా తయారవుతున్నారు. తాజాగా కన్న కూతురుకు ఖాయమైన వివాహ వేడుక.. విషయం లో ఆకుమార్తె తల్లి చేసిన నిర్వాకం.. అందరినీ సిగ్గు పడేలా చేస్తోంది. ఊహించేందుకు కూడా ఇబ్బందిగా ఉన్న ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కాబోయే అల్లుడిని లేపుకెళ్లిన అత్త…ఇంతకుమించిన సిగ్గుమాలిన పని లేదేమో! అని నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.
ఏంటి విషయం..?
ఉత్తర ప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో స్వప్న, సుధాంశ్ కుటుంబంతో జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్ల లు. పెద్ద కుమార్తెకు ఇటీవల ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఇతని పేరు రాహుల్. వయసు 25 సంవత్సరాలు. ఈ నెల 28న వివాహం జరగాల్సి ఉంది. ఇచ్చిపుచ్చుకునేవన్నీ అయిపోయాయి. పైగా.. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లలో పెళ్లికుమార్తె తండ్రి సుధాంశ్ బిజీగాఉన్నాడు. కానీ, ఇంతలోనే ఘోరం చోటు చేసుకుంది.
పెళ్లి కుమార్తె తల్లి.. 39 ఏళ్ల వయసున్న స్వప్న.. అనూహ్యంగా.. కాబోయే అల్లుడితో లేచిపోయింది. దాదాపు వారంరోజులుగా వారిద్దరూ కనిపించకపోవడం.. ఇరు కుటుంబాల్లోనూ కల్లోలానికి దారి తీసింది. వీరు లేచిపోయారన్నది వాస్తవమేనని పోలీసులు కూడా నిర్ధారించుకున్నారు. ఎలా పట్టుకోవాలా? అని ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ వ్యవహారం స్థానిక మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారానికి వచ్చింది. దేశం విడిచిపోవాలని అనుకున్న స్వప్న, రాహుల్ తిరిగి వచ్చారు.
కట్ చేస్తే.. ఇరు కుటుంబాల వారు స్టేషన్లో పంచాయతీ పెట్టారు. ఈ సందర్భంగా స్వప్న.. తనకు రాహు లే నచ్చాడని(కాబోయే అల్లుడు) అతనితోనే జీవితం పంచుకుంటానని తెగేసి చెప్పింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. స్వప్న కుమార్తె.. ఇష్టమైతే.. రాహుల్తో జీవించవచ్చని కూడా.. చెప్పడం గమనార్హం. ఇది మరింత దారుణం. దీనిపై పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఆమెకునచ్చజెప్పారు. అయినా.. ససేమిరా అంది. తన భర్తతో సంసార సుఖం లేదని.. తననే వేధింపులకు గురి చేస్తున్నాడని.. అందుకే రాహుల్ను వదిలి పెట్టేది లేదనితెగేసి చెప్పడంతో మీరు మీరు తేల్చుకోండని.. పోలీసులు వారిని ఇంటికి పంపేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది.