నున్నా తిరుమలరావు ( NTR ). ఈయన ఒక కడలి తరంగం జ్ఞానపిపాసి అవకాశాల కోసం ఎదురు చూడటం ఆయనకు ఇష్టం ఉండదు అవకాశాలను సృష్టించుకుని… సృష్టించుకున్న అవకాశాలలోకి దూసుకుపోవటం తన నైజం. ఈ రోజు తెలుగు విద్యారంగంలోనే కాదు దేశ విదేశాల్లో మార్మోగుతున్న మార్మోగుతున్న విద్యావేత్త నున్న తిరుమలరావు. విద్యారంగంలో కేవలం 10 ఏళ్లలో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయిన తిరుమల రావు రాజమహేంద్రవరం సమీపంలోని కాతేరులో 2010లో కేవలం 400 మంది విద్యార్థులతో తిరుమల విద్య సంస్థలు స్థాపించారు. పదేళ్లు తిరిగేసరికి ఈ సంస్థలలో ఏకంగా 35,000 మంది విద్యార్థులు ఉన్నారు అంటే తిరుమల ప్రభంజనం 10 ఏళ్లలో ఎంత అప్రతిహత స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ రోజు కాతేరు సమీపంలో ఈ తిరుమల విద్యాసంస్థల పేరుతో ఒక టౌన్షిప్ ఏర్పడింది. ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లలకు తిరుమల హాస్టల్స్ లో సీటు రాక సమీపంలోని అపార్ట్మెంట్లలో పిల్లల విద్య కోసం వచ్చి ఉంటున్నారు అంటే ఈ విద్యాసంస్థల మీద తల్లిదండ్రులలో ఎంత నమ్మకమో తెలుస్తోంది. కొన్ని విద్యాసంస్థలలో పనిచేసిన అనుభవంతో 47 సంవత్సరాల వయసులో తిరుమలరావు తిరుమల విద్య సంస్థను ప్రారంభించారు. నాడు ఆయన తిరుమల ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ ప్రారంభిస్తుంటే స్నేహితులు ఈ వయసులో ఎందుకు ఇంత రిస్కు చేస్తున్నావు ? అని వారించారు. స్నేహితులు వారిస్తున్నా తన మీద తనకు ఉన్న నమ్మకంతో పాటు తన అర్ధాంగి నున్నా సరోజినీ ఇచ్చిన ప్రోత్సాహంతో తిరుమలరావు ముందుకు వెళ్లినందుకు నిర్ణయించుకున్నారు.
35 వేల మంది విద్యార్థులు.. ఇంజనీరింగ్, మెడిషన్లో ర్యాంకుల పంట :
2011లో ప్రారంభించిన ఈ విద్యా సంస్థ ఇంతింతై వటుడంతై అన్నట్టు 35 వేల మంది విద్యార్థులతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది తల్లిదండ్రుల మన్ననలు పొందుతోంది. ఈ సంస్థలలో చదివి ఇంజనీరింగ్, మెడిసిన్ రంగాలలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో సీట్లు సాధించి ర్యాంకుల పంట పండిస్తోంది. ఈ విద్యా సంస్థల చైర్మన్ తెలుగు రాష్ట్రాలలో ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలుగా గొప్పలకు పోతున్న చాలా సంస్థలు తమ సంస్థలలో పిల్లలను చేర్పించేందుకు టీచర్లకు టార్గెట్లు పెట్టటం… అలాగే పీఆర్వోలను పెట్టుకోవడం చేస్తున్నాయి.. కానీ తిరుమలలో ఇలాంటివి పూర్తిగా నిషిద్ధం.
సీట్ల కోసం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల సిఫార్సులు :
తాము అందిస్తున్న విద్యా క్రమశిక్షణ చూసి విద్యార్థులు వారి తల్లిదండ్రులు.. సంస్థ మీద నమ్మకంతో మా దగ్గర విద్యార్థులను చేర్పిస్తూ ఉంటారని.. వారి నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యను అందిస్తున్నామని సగర్వంగా చెబుతుంటారు తిరుమలరావు. ఈ విద్యాసంస్థలో 9, 10 తరగతితో పాటు ఇంటర్లో ప్రవేశాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సైతం సిఫార్సులు చేస్తూ ఉంటారు. తిరుమల అంటే ఎందుకంత పిచ్చి ? ఎందుకంత క్రేజ్ ? రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంకా పెద్ద పెద్ద విద్యాసంస్థలు లేవా అని ప్రశ్నించుకుంటే ఇందుకు ప్రధాన కారణం ఉన్న తిరుమలరావు అకుంఠిత దీక్ష, క్రమశిక్షణ మీద రెండు తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులు తల్లిదండ్రులకు ఉన్న నమ్మకం కారణం.
విద్యార్థులకు తిరుమలరావు ఒక పాజిటివ్ వైబ్రేషన్. దారితప్పిన.. వెనుకబడుతున్న విద్యార్థులకు వ్యక్తిగత కౌన్సిలింగ్ ఇచ్చి వారిని సక్రమమార్గంలో పెట్టడంలో ఆయన ఒక దిక్సూచి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం, నిరంతరం విద్యార్థుల మధ్య నివసిస్తూ చాలా సామాన్య జీవితం గడుపుతారు. ఈయనకు టీచింగ్ అంటే ఫ్యాషన్.. చిన్నప్పటి లక్ష్యం ఇంజనీర్ కావాలనుకున్నా ఆ రోజుల్లో మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆ కలను నెరవేర్చుకోలేక పోయారు. ఆరోజు ఆర్థిక స్తోమత లేక ఎమ్మెస్సీ వైపు అడుగులు వేసినా.. ఈరోజు ఒక విద్యా సంస్థ అధినేతగా వేలమంది ఇంజనీర్లను తయారు చేసేందుకు తిరుమల ద్వారా రాచబాట వేసుకున్నారు. ఈ దేశానికి ఎంతో మంది నాణ్యమైన ఇంజనీర్లను, డాక్టర్లను అందించడమే లక్ష్యంగా మార్చుకున్నారు.
తెలుగోడు ప్రపంచమంతా ఉండాలన్నదే NTR ఆకాంక్ష :
ఒక అమెరికా, ఆస్ట్రేలియానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కెనడా, జర్మనీ, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ, సింగపూర్ ఇలా ఎంతో ఎన్నో దేశాలలో తిరుమలలో చదువుకున్న వారు ఉన్నారు. ప్రపంచమంతా తెలుగుజాతి ఉండాలి… ఉన్నత శిఖరాల్లో ఉండాలి అని చెబుతూ ఉంటారు తిరుమలరావు. విద్యాసంస్థలలో విద్యార్థులకు తిరుమల రావు క్రమశిక్షణలో ఒక సింహ స్వప్నం. నిత్యం ఆయనకు ఉండే బిజీ షెడ్యూల్లో విద్యార్థులు తల్లిదండ్రులకు వ్యక్తిగత కౌన్సిలింగ్ కోసం అందుబాటులో లేకపోయినా.. తల్లిదండ్రులు రాత్రి 11 గంటలు అయినా ఎదురు చూస్తూనే ఉంటారు. తిరుమలరావు కూడా విద్యార్థుల మానసిక పరిణితి కోసం వారికి ఓపికగా సలహాలు ఇచ్చి విద్యార్థులనే కాదు తల్లిదండ్రులకు మంచి మార్గనిర్దేశకత్వం ఇవ్వడంలో అందివేసిన చేయిగా కనిపిస్తారు.