• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

దళితబంధు ఆగిపోవడానికి కారణం ఎవరు?

admin by admin
October 19, 2021
in Politics, Telangana, Top Stories
0
0
SHARES
204
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

హుజురాబాద్‌లో దళిత ‘బంధు’మంటలు చెలరేగుతున్నాయి. దళితబంధు తాత్కాలిక బ్రేక్‌కు కారకులెవరు? ప్రతిపక్షాల కుట్రేనా? ఫోరం ఫర్ గుడ్‌ గవర్నెన్స్ ఫిర్యాదుతో నిలిచిపోయిందా.?  ఇందులో ప్రతిపక్షాలకు లాభం ఏమైనా ఉందా.. అధికార పక్షానికి అస్త్రం దొరికిందా? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దళిత బంధు ఆగిపోవడంతో హుజురాబాద్ కుతకుతలాడుతోంది. దళిత బంధు ఆగిపోవడానికి కారణం నీవంటే నీవు అని బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.

దళిత బంధు దగ్గరే ఆగదనీ.. ఇంకా ఎన్నో అట్టడుగు వర్గాల కోసం మరెన్నో కార్యక్రమాలను రూపొందిస్తాం సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించారు. ఆయన మధ్యాహ్నం ప్రకటించారు. రాత్రి ఎన్నికల కమిషన్ దళితబంధుకు బ్రేక్ వేసింది. ఎన్నికల సమయంలో హుజూరాబాద్‌లో ఆగినా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఈ పథకం నడుస్తోందని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. ఎన్నికల తర్వాత తిరిగి దళితబంధు పథాకాన్ని అమలు చేస్తామని భరోసా ఇస్తున్నారు.

టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు ఆగిపోవడానికి బీజేపే కారణమని టీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. దళితులను మోసం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల దళితబంధుపై బీజేపీ నేత ఈటల రాజేందర్ కేసు వేస్తామని ప్రకటించారని గుర్తుచేస్తున్నారు.

దళితబంధు ఆగిపోవడానికి కారణం బీజేపేనని టీఆర్‌ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. బీజేపీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని టీఆర్‌ఎస్ నేతలు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం హుజురాబాద్ మండలంలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆయనకు దళితబంధు సెగ తగలకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయితే బీజేపీ లేఖ వల్లే దళితబంధు నిలిచిపోయిందని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 7న కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖను విడుదల చేశారు. దళితబంధు లబ్ధిదారుల ఖాతాలో కావాలనే నగదు జమ చేయటంలేదని విమర్శించారు. దళితబంధు విషయంలో అధికార పార్టీకి లబ్ధి చేకూరే విధంగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని, అన్ని రకాల ఫార్మాలిటీస్ పూర్తి చేసినా నిధులను ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ హోల్డ్ చేశారని ప్రేమేందర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

అయితే బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంటే కాంగ్రెస్ మాత్రం మౌనంగా ఉంటోంది. ఇప్పటివరకు ఆపార్టీ దళితబంధు ఆగిపోవడం ఎలాంటి ప్రకటన చేయలేదు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలుకు రూ.2 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఐదు విడతల్లో రూ.2 వేల కోట్లు విడుదల చేశారు.

2021 ఆగస్టు 9న రూ.500 కోట్లు, ఆగస్టు 23న రూ.500 కోట్లు, ఆ తర్వాత వరుసగా మూడు రోజులపాటు రూ.  200 కోట్లు, రూ.300 కోట్లు, రూ.500 కోట్లు విడుదల చేశారు. తాజాగా సోమవారం మరో రూ.250 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే దళిత బంధు పథకం పాతదేనని సీఈసీకి కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ నివేదిక ఇచ్చారు.

గత మార్చిలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లోనే ఈ పథకానికి ప్రభుత్వం రూ.1000 కోట్ల నిధులు కేటాయించిందని, ఆగస్టు 4న వాసాలమర్రి గ్రామంలో ప్రారంభమైందని నివేదికలో పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలని మాత్రమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. అయినా.. ఇప్పుడు పథకాన్ని నిలిపివేయాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags: dalitabandhu schemehuzurabad bypolltelangana cm kcrTelangana politicswho stopped dalitabandhu
Previous Post

రఘురామరాజు సంచలన నిర్ణయం

Next Post

జగన్ గాలి తీసిన ఐవైఆర్…షాకింగ్ కామెంట్లు

Related Posts

Top Stories

ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?

September 30, 2023
Politics

ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ

September 30, 2023
Trending

అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష

September 30, 2023
Trending

41ఏ నోటీసులు అందుకున్న లోకేష్..4న విచారణ

September 30, 2023
Top Stories

జగన్ భుజంపై ‘బీజేపీ అనకొండ’ కోరల్లో చంద్రబాబు

September 30, 2023
Top Stories

చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల సస్పెండ్

September 30, 2023
Load More
Next Post

జగన్ గాలి తీసిన ఐవైఆర్...షాకింగ్ కామెంట్లు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్
  • ‘హుకూం’ పాట అసలు లేనే లేదట
  • ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?
  • ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ
  • Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?
  • చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్
  • అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
  • 41ఏ నోటీసులు అందుకున్న లోకేష్..4న విచారణ
  • జగన్ భుజంపై ‘బీజేపీ అనకొండ’ కోరల్లో చంద్రబాబు
  • చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల సస్పెండ్
  • డ్యామేజీ కంట్రోల్ మొదలెట్టిన కేటీఆర్
  • షర్మిలకు కాంగ్రెస్ షాకిచ్చిందా ?
  • జమిలిపై మోడీ కి మోజు ఎందుకంటే…
  • జగన్ లోని మృగం గురించి లోకేష్ సంచలన వ్యాఖ్యలు
  • చంద్రబాబుకు హీరో సుమన్ బాసట

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra