వైసీపీ నుంచి బయటకు వచ్చిన విజయ సాయిరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన రాజకీయాల్లోకి వస్తారా రారా అనేది పక్కన పెడితే ఆయన తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అనుకుంటే ఏ పార్టీలోకి వస్తారు? ఏ జెండా కప్పుకుంటారు అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. వైసిపి విషయానికి వస్తే ఆయన టిడిపితో టచ్ లో ఉన్నారని చంద్రబాబు ను పదేపదే అంతర్గతంగా పొగుడుతున్నారని భావిస్తున్నారు.
వాస్తవానికి సాయిరెడ్డి కుటుంబ నేపథ్యాన్ని చూసుకుంటే చంద్రబాబు తనకు వరుసకు అన్నయ్య అవుతాడని సాయి రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో టిడిపిని ఆయన బహిరంగంగా ఎక్కడా విమర్శించడం లేదు. ఇది ప్రధానంగా వైసిపికి ఇబ్బందికర పరిణామంగా మారింది. మరోవైపు జగన్ను కాదని బయటికి రావటం కూడా వైసీపీకి నచ్చటం లేదు. ఇక సాయి రెడ్డి హవాను చూసుకుంటే జాతీయస్థాయిలో సాయి రెడ్డికి మంచి పలుకుబడి ఉంది. బిజెపి నాయకుల వద్ద ఆయనకు పరపతి కూడా ఉంది.
ఈ నేపథ్యంలో తిరిగి ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటే బిజెపి కచ్చితంగా ఆయనకు కండువా కప్ప టం ఖాయం అనే చర్చ నడుస్తోంది. అయితే, ఆయన ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ది చూడాలి. ప్రస్తుతం ఖాళీ అయిన సొంత స్థానానికి తిరిగి ఆయన ప్రమోట్ అయ్యే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం సాయిరెడ్డి ఢిల్లీ బీజేపీ నేతల దగ్గర కీలక చర్చల్లో ఉన్నారని తెలుస్తోంది.
మరోవైపు టిడిపి ఇప్పటివరకు ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎవరిని ప్రకటించకపోవడం, దీనిని బిజె పికి ఇస్తామని చెప్పడం ఆసక్తిగా మారింది. ఇదే జరిగితే సాయి రెడ్డి రాజ్యసభకు వెళ్లడం ఖాయంగా కనిపి స్తోంది. ఇది వైసీపీకి మరింత మైనస్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాయిరెడ్డి కనుక బీజేపీలోకి వెళ్తే.. మున్ముందు.. మరింత మందిని ఆయన లాగేసే అవకాశం ఉంటుందన్న వాదనను తొసిపుచ్చలేం. సో.. రాజకీయాల్లో శాస్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు కాబట్టి.. ఎప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.