ఇరుదేశాల సంబంధాలను బలోపేతం
చేయడంలో భారతీయ సంతతి వ్యక్తుల పాత్ర కీలకం
భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఘన సత్కారం
అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను భారత సంతతి పౌరుల వేదిక.. ఇండియన్ డయాస్పోరా ఘనంగా సత్కరించింది.
కాలిఫోర్నియాలోని హార్ట్ఫుల్నెస్ సెంటర్లో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో అమెరికాలోని భారత దౌత్య అధికారి వినయ్ మోహన్ బట్, కాన్సుల్ జనరల్ శ్రీకర్రెడ్డి కొప్పుల లు నిర్మలా సీతారామన్ ను ఘనంగా సత్కరించారు.
భారత్ను ప్రత్యేక స్థానంలో నిలిపారు: నిర్మలా సీతారామన్!
భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. బే ఏరియా పారిశ్రామికవేత్తలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ముఖ్యంగా సృజనాత్మక రంగంలో వారు చేస్తున్న కృషి, ఇండియన్ డయాస్పోరాను నడుపుతున్నతీరును కొనియాడారు.
ఫలితంగా అమెరికాలో భారత్ను ప్రత్యేక స్థానంలో నిలిపారని ప్రశంసించారు.
ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ విజన్ను ఆమె ప్రస్తావించారు.
భారతీయులు ఎక్కడ ఉన్నా.. స్వేచ్ఛగా జీవించేందుకు.. సులభంగా పనిచేసేందుకు తగిన వాతావరణ ఉండేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇదే.. భారత్ను సుస్థిరంగా ఉంచుతోందన్నారు.
భారత్లో స్వచ్ఛమైన ప్రభుత్వం కొనసాగుతోందని నిర్మలా సీతారామన్ చెప్పారు.
అదేవిధంగా కొత్త కొత్త రంగాలకు కూడా అవకాశం లభిస్తోందన్నారు.
ఉదాహరణకు .. అడ్వాన్స్ కెమిస్ట్రీ, పునరుత్పాదక బ్యాటరీ ల రంగాలను ఆమె ప్రస్తావించారు.
వివిధ కార్యక్రమాల ద్వారా.. భారతీయ యుతకు అనేక అవకాశాలు కల్పించేందుకు కూడా తమ ప్రభుత్వం విశేషంగా కృషి సల్పుతున్నట్టు చెప్పారు.
అమెరికా-భారత్మధ్య ఉన్న సంబంధంప్రత్యేక మైనదని ఈ సందర్భంగా తెలిపారు.
కేవలం ఇది వ్యాపార, వాణిజ్య వ్యవహారాలకే పరిమితం కాలేదని.. రక్షణ, సైనిక విషయాల్లోనూ ఇరు దేశాల మధ్య సంబంధం కొనసాగుతోందన్నారు.
ఒకప్పుడు 200 బిలియన్ డాలర్లుగా ఉన్న ఇరు దేశాల మధ్య వాణిజ్యం ప్రస్తుతం.. 500 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు.
ప్రధానంగా తమ ప్రభుత్వం.. మహిళలు, పేదలు, యువత, రైతులను ఉద్దేశించి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్టు మంత్రి వివరించారు.
ఈ సందర్భంగా వినయ్ మోహన్ బట్ మాట్లాడుతూ.. అమెరికా-భారత్ సంబంధాలు ద్రుఢతరంగా ఉన్నాయని తెలిపారు. ఇరు దేశాల సంస్కృతి, విలువలను పరస్పరం పంచుకుంటున్నట్టు తెలిపారు.
అదేవిధంగా ఆర్థికపరమైన సంబంధాలు కూడా.. ఇరు దేశాల మధ్య బలోపేతంగా సాగుతున్నాయని వినయ్ మోహన్ బట్ తెలిపారు.
అమెరికా-భారత్ సంబంధాలను బలోపేతం చేయడంలో ఇండియన్ డయాస్పోరా కృషిని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.
అమెరికాలోని భారతీయ పౌరులకు తమ దౌత్య కార్యాలయం 24 గంటలూ తెరిచే ఉంటుందని చెప్పారు.
అదేవిధంగా భారత పౌరుల కోసం బోస్టన్, లాస్ ఏంజెలెస్లలో కార్యాలయాలు త్యరలో అందుబాటులో ఉంటాయని, ఏ అవసరం వచ్చినా తాము వెంటనే స్పందిస్తామని వివరించారు.
కాన్సుల్ జనరల్ శ్రీకర్రెడ్డి కొప్పుల కీలకోపన్యాసం చేసి, వందన సమర్పణ చేశారు.