వైసీపీ కీలక నాయకుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డిని పోసులు గృహ నిర్బంధం చేశారు. ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా.. హౌస్ అరెస్టు చేస్తున్న ట్టు ప్రకటించారు. డీఎస్పీ స్థాయి అధికారులు ఆయన ఇంటికి వెళ్లి అడ్డుకున్నారు. దీంతో భూమన వర్గీ యులు.. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటు.. పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు.
ఏం జరిగింది?
గత వారం రోజులుగా.. తిరుపతిలోని ఎస్వీ గోశాల వ్యవహారంపై భూమన ఆరోపణలు చేస్తున్నారు. గత మూ డు మాసాల్లో ఇక్కడ 100 కుపైగా గోవులు మృతి చెందాయని.. హిందూ ధర్మానికి విఘాతం కలుగుతోందని.. వ్యాఖ్యానిస్తూ. విమర్శలకు దిగారు. దీనికి టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో.. శ్యామలరావు కూడా ఎదురు దాడి చేసి.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే భూమనపై బీజేపీ నాయకుడు, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్రెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసునమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఇదిలావుంటే.. అసలు వాస్తవాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తానంటూ.. భూమనరెడీ అయ్యారు. తన అను కూల మీడియాను పిలిపించుకుని.. వారితో కలిసి తిరుపతిలోని ఎస్వీ గోశాలకు వెళ్లి.. పరిశీలించాలని నిర్ణయించారు. దీనికి ప్రతిగా బీజేపీ, టీడీపీ నాయకులు కూడా.. మరో ర్యాలీ నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఈ పరిణామాలతో తిరుపతిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భూమన బయటకు వస్తే.. దాడులు, విధ్వంసాలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు ఆయనను నిలువరించారు. అయితే.. ఈ గృహ నిర్బంధంపై తాను న్యాయ పోరాటం చేస్తానని భూమన ప్రకటించడం గమనార్హం.