పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో `ది రాజా సాబ్` ఒకటి. డార్లింగ్ కెరీరలో తొలి హారర్ మూవీ ఇది. మారుతి డైరెక్టర్ కాగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో సంజయ్ దత్, అనుపమ్ ఖేర్, రిద్ధి కుమార్, సుశాంత్ తదితరులు కనిపించబోతున్నారు.
మేకర్స్ అనౌన్స్ చేసిన ప్రకారం.. రాజా సాబ్ చిత్రం 2025 ఏప్రిల్ 10వ తేదీనే విడుదల కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ పెండింగ్ ఉండటం, వీఎఫ్ఎక్స్ పనులు డిలే కావడంతో విడుదల జులైకి వాయిదా పడింది. అయితే ఈ తేదీకి రావడం కూడా కష్టమే అంటున్నారు. రూ. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన రాజా సాబ్ సెప్టెంబర్ కు షిఫ్ట్ అయినట్లు తాజాగా సమాచారం అందుతోంది. సెప్టెంబర్ 24న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
అంతేకాకుండా ఈ సమ్మర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ను కూల్ చేసేందుకు మే మొదటి వారం లేదా రెండో వారంలో రాజ్ సాబ్ టీజర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా టీజర్ బయటకు వస్తే.. రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చినట్లు అవుతుంది కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రభాస్ ఈ చిత్రంలో చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. అలాగే రాజా సాబ్ వీఎఫ్ఎక్స్ నెక్ట్స్ లెవల్ లో ఉండబోతుందని మేకర్స్ బలంగా చెబుతున్నారు.