తెలంగాణ కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు.. పార్టీ అధినాయకత్వం సిద్ధమైంది. వచ్చే రెండు మూడు మాసాల్లో జరగనున్న స్థానికసంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో జిల్లాలు, మండలాల స్థాయిలో పార్టీ బాధ్యుల పనితీరు.. డీసీసీ అధ్యక్షు ల పనివిధానం.. ప్రజలతో వారికి ఉన్న కనెక్టివిటీ, ప్రబుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి ఏవిధంగా ముందుకు తీసుకువెళ్తున్నారన్న విషయాలపై దృష్టి పెట్టింది.
ఈ క్రమంలో తాజాగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు.. పార్టీపరిశీలకులను నియమించారు. ఒక్కొక్క జిల్లాకు ఇద్దరేసి చొప్పున 70 మంది నాయకులను నియమించారు. వీరు.. తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటిం చి.. పార్టీ నాయకుల పనితీరును ప్రాధమికంగా అంచనా వేస్తారు. అదేవిధంగా అసంతృప్త నాయకులు.. పదవులు ఆకాంక్షిస్తున్నవారి జాబితాలను కూడా రెడీ చేసుకుంటారు. ముఖ్యంగా క్షేత్రస్థాయి నాయకుల తో భేటీ అయి… పార్టీ పరిస్థితిని తెలుసుకుంటారు.
ఇలా.. శుక్రవారం నుంచి ఈ నెల ఆఖరు వరకు జిల్లాల్లో పర్యటించే పరిశీలకులు…ఏయే జిల్లాల్లో పార్టీ వీక్ గా ఉంది.. ? స్థానిక ఎన్నికల్లో ఏమేరకు గెలుపు గుర్రం ఎక్కే అవకాశం ఉంది? .. నాయకుల అభిలాషలు ఆకాంక్షలను తెలుసుకుంటారు. అనంతరం.. జిల్లాల వారీగా నివేదికలు ఇస్తారు. ఈ నివేదికలను అధిష్టాననం పరిశీలించి మార్పులు… చేర్పుల దిశగా నిర్ణయాలు తీసుకుంటుంది. కాగా.. ఈ పరిశీలకుల జాబితాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవకాశం కల్పించారు. ఎంపీలను పక్కన పెట్టారు.
మార్పు అనుకునే!
అయితే.. వాస్తవానికి జిల్లాల స్థాయిలో కాంగ్రెస్ నేతల పనితీరు అంతంత మాత్రంగానే ఉందని.. పార్టీ భావి స్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా.. జిల్లా నేతల పనితీరు బాగోలేకే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంత ప్ర భావం కనిపించిందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మార్పు దిశగా ఇప్పటికే నిర్ణయించారు. అయితే.. ఉన్నట్టుండి మార్పుల దిశగా చర్యలు తీసుకుంటే.. ఇబ్బందులు తప్పవనిభావిస్తున్న పార్టీముందుగా పరిశీలకుల పేరుతో ఎవరి తప్పులు వారే గుర్తించేలా చేస్తోంది. అనంతరం.. మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయోగం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.