టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పవిత్ర చార్ ధామ్ యాత్ర కోసం వెళ్లిన ఎంపీ సోద రి, ఆమె భర్త.. ప్రమాదంలో చిక్కుకున్నారు. వీరిలో ఎంపీ సోదరి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త గాయాలతో ఆసుపత్రిలో చేరారు. దీంతో టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కుటుంబం తీవ్ర ఆవేదన లో మునిగిపోయింది.
ఏం జరిగింది?
పవిత్ర చార్ ధామ్ యాత్రలు ఈ నెల 2న ప్రారంభమయ్యాయి. బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగో త్రి ఆలయాలను కూడా ఈ నెలలోనే తెరిచారు. ఈ యాత్రలను హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ క్రమంలో అనంతపురం పార్లమెంటు సభ్యుడు, టీడీపీ సీనియర్ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ కుటుంబం కూడా.. చార్ ధామ్ యాత్రలకు వెళ్లింది. ఈ కుటుంబం.. బద్రీనాధ్, కేదార్ నాథ్ యాత్రలు ముగించుకుని.. యమునోత్రికి బయలు దేరింది.
అయితే.. ఎంపీ సోదరి వేదవతి, ఆమె భర్త భాస్కర్లు.. రోడ్డు మార్గం కాకుండా.. యమునోత్రికి హెలికాప్టర్ మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ను ఎంచుకున్నారు. వాస్తవా నికి ప్రభుత్వం కూడా హెలికాప్టర్లను రన్ చేస్తోంది. ఇది తక్కువగా ఉన్నాయి. ముందుగా బుక్ చేసుకోవా లి. ఈనేపథ్యంలో ప్రైవేటుకు డిమాండ్ పెరిగింది. గురువారం ఉదయం యమునోత్రికి బయలు దేరిన ఈ హెలికాప్టర్.. ఉత్తర కాశీలోని అడవుల్లో కుప్పకూలింది.
హెలికాప్టర్ బయలు దేరిన కొన్ని నిమిషాలకే విజన్ సరిగా కనిపించక.. ఈ ప్రమాదం సంభవించినట్టు తెలి సింది. అయితే.. ఈ ఘోరంలో ఎంపీ సోదరి వేదవతి మృతి చెందగా, ఆమె భర్త భాస్కర్.. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఇక, ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మృతి చెందారు. ఉన్నది మొత్తం ఏడుగురు. వీరిలో భాస్కర్ ఒకరికి గాయాలు అయ్యాయి. గాయపడిన భాస్కర్ ను ఎయిమ్స్ రిషికేష్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతి చెందిన వారిలో మరో మహిళ కూడా ఉన్నారు. ఆమె కూడా తెలుగు వారేనని అధికారులు చెబుతున్నారు. కాగా.. దట్టమైన మంచు కారణంగా.. సహాయక చర్యలు కూడా ఇబ్బందిగా మారాయి మరోవైపు సమాచార మార్పిడిలోనూ అంతరాయం ఏర్పడింది.