భారత సైనిక దళాలకు అండగా ఉండేందుకు.. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక నెల వేతనం విరా ళంగా ఇచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయ ల అయ్యన్న పాత్రుడు సైతం ముందుకు వచ్చారు. తన నెల రోజుల బేసిక్ వేతనాన్ని విరాళంగా అందిం చారు. ప్రకటనలు, పబ్లిసిటీతో సంబంధం లేకుండా.. ఆయన నేరుగా జాతీయ రక్షణ నిధికి తన వేతనాన్ని బదిలీ చేశారు. దీనికి సంబంధించిన పత్రాన్ని ఆయనకు మెయిల్ చేశారు.
`జాతీయ రక్షణ నిధికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేశారు. ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఈ విరాళాన్ని ఆయన జమ చేశారు.“ అని అసెంబ్లీ సెక్రటరీ ఓ ప్రకటన విడుదల చేశారు. దేశ భద్రత, దేశ ప్రజల కోసం.. సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడుతున్న సైనికులకు అండగా నిలవాలన్న ఉద్దేశంతోనే స్పీకర్ ఇలా విరాళం ఇచ్చినట్టు పేర్కొన్నా రు.
“మన దేశ సాయుధ దళాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు చేస్తున్న ధైర్యసాహసాలు ప్రతి భారతీయు నిలో గర్వాన్ని కలిగించే అంశం. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వీర జవాన్లకు నా వంతుగా సంఘీభావంగా నా నెలవేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చాను.“ అని స్పీకర్ అయ్యన్న తెలిపారు. ఉగ్రవాద నిర్మూలనలో సాయుధ దళాలు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలు దేశ ప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
సాయంపై చంద్రబాబు మీటింగ్
మరోవైపు.. దేశసైనికులకు అండగా ఉండేందుకు ఆర్థిక సాయం అందించేలా సీఎం చంద్రబాబు కూడా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా పార్టీ నాయకులు, కూటమి పక్షాలతోనూ చంద్రబాబు చర్చించనున్న ట్టు పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. అందరి ఆమోదం తీసుకున్న వెంటనే చంద్రబాబు ఓ ప్రకటన చేయనున్నారని పేర్కొన్నారు.