ఏపీ రాజధాని అమరావతిలో ఏం జరుగుతోంది? అంటే.. పెద్ద ప్రశ్నగా మారింది. కూటమి ప్రభుత్వ అను కూల మీడియా దీనిపై పెదవి విప్పడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం జోరుగా కథనాలు వస్తు న్నాయి. అమరావతిలో రైతులు నిరసనలు చేస్తున్నారన్నది వాస్తవం. అంతేకాదు.. అధికారులను మంత్రులను కూడా వారు నిలదీస్తున్నారన్నది కూడా వాస్తవం. అయితే.. దీనికి కారణం ఏంటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం అమరావతిని విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఎన్నికలకు ముందు ఈ ప్రకటన చేయలేదు. ఉన్న 33 వేల ఎకరాల నుంచే అన్నింటినీ చేస్తామని చెప్పింది. అంతేకాదు.. రైతులకు ఫ్లాట్లు, వాణిజ్య ప్రాంతాలు కూడా ఇస్తామని చెప్పింది. అయితే.. అధికారం చేపట్టిన తర్వాత.. మరింత భూమి అవసరం ఉందని.. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం నిర్మిస్తామని, రహదారులు విస్తరిస్తామని ప్రకటించింది. దీని ప్రకారం మరో 44 వేల ఎకరాల భూమిని సమీకరించేందుకు రెడీ అయింది.
ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. గతంలో భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలకు దిగారు. తమ నుంచి తీసుకున్న భూములకు న్యాయం చేయలేదని.. తాము భూములు ఇచ్చి పదేళ్లయినా.. కౌలు కూడా సక్రమంగా ఇవ్వలేదని.. తమకు ఇస్తామన్న ఫ్లాట్లు ఇవ్వలేదని వారు నిరసన వ్యక్తం చేస్తుంటే.. కొత్తగా భూములు ఇచ్చేవారు ముందుకు రావడం లేదు. పాత వారికి న్యాయం చేసిన తర్వాత.. తాము ఇస్తామని చెబుతున్నారు. అంతేకాదు.. పాతవారికి ఎలాంటి హామీలైతే ఇచ్చారో.. తకు కూడా అవే హామీలు ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు.
ఈ వివాదం నేరుగా మంత్రుల ముందే జరుగుతోంది. అయితే.. ప్రదాన మీడియా మాత్రం దీనిని వెలుగు లోకి తీసుకురావడం లేదు. తాజాగా జాతీయ ఆంగ్ల మీడియాలో కథనాలు పుంఖాను పుంఖాలుగా వస్తున్నా యి. దీనిపై ప్రభుత్వం ఒక సమగ్ర ప్రకటన చేయాలని సూచనలు కూడా వస్తున్నాయి. జరుగుతున్న దానిలో పారదర్శకత ఉన్నప్పుడు.. దాచడం ఎందుకన్న చర్చ కూడా జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు భూములు ఇచ్చేందుకు రెడీ అయిన .. రైతులు కూడా ఇప్పుడు వెనక్కి తగ్గుతుండడంపై .. సీరియస్గానే పరిగణించాలని.. దీనిపై సీఎం జోక్యం చేసుకుని సరిదిద్దాలన్న సూచనలు కూడా వస్తున్నాయి.