వైసీపీ అధినేత జగన్ కు కొంచెం ఇగో ఉందని అనుకూల నాయకులు కూడా అంటారు. ఆయనతో సుదీర్ఘ కాలం పనిచేసి.. ఆయనను మెచ్చుకునే నాయకులు కూడా.. మావోడియి.. కొంచెం ఇగో ఉన్న మాట వాస్తవమేనని ఒప్పుకొంటారు. సహజంగానే రాజకీయ నేతల కుటుంబంలో పుట్టిన వారికి ఇగో కామనే. అయితే..ప్రజాక్షేత్రంలోకి వచ్చేసరికి దానిని వదిలించుకోవాలి. వదులుకోవాలి. కానీ.. ఈవిషయంలో జగన్ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు.
తాజాగా బయటకు వచ్చిన పాత సంగతి.. మరింతగా జగన్ను డైల్యూట్ చేస్తోంది. జగన్ వద్దకు వెళ్లే కొత్త తరం నాయకులు.. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయాలన్న షరతు ఉన్నదని.. తాజాగా వెలుగు చూసింది. ఇది ఎవరు చెప్పారన్నది పక్కన పెడతే.. ఈ విషయంపై గతంలో ఓ ఏడెనిమిదేళ్ల కిందట మాజీ మంత్రి మైసూరారెడ్డి కూడా.. చెప్పుకొచ్చారు. కొత్త వారు వస్తే.. నిలబడే మాట్లాడాలని.. జగన్ ముందు మోకరిల్లాలని ఒక బ్యాచ్ ట్రైనింగ్ ఇస్తుందని కూడా చెప్పారు.
ఇక, తన వరకు వచ్చే సరికి.. జగన్ చిన్న పిల్లోడప్పటి నుంచితనకు తెలుసునని.. దీంతో తాను గౌరవం గానే పిలిచానని చెప్పారు. కానీ, తాను కూడా సార్ అని పిలవాలని షరతులు విధించే సరికి నొచ్చుకు న్నట్టు తెలిపారు. ఇక, వైవీ సుబ్బారెడ్డిస్వయానా జగన్కు చిన్నాన్న. పైగా.. పిన్ని భార్త. అయినా.. కూడా అంతర్గత సమావేశాల్లోనూ.. సర్.. అనే సంబోధిస్తానని వైవీనే ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. కాబట్టి.. జగన్కు ఇగో సమ స్య ఉంది.
ఇక, మెగా స్టార్ చిరంజీవి అంతటినటుడు కూడా.. ఒక సందర్భంలో రెండు చేతులూ.. జోడించి.. జగన్కు నమస్కారం పెట్టడం తెలిసిందే. అయితే.. దీనిపై విమర్శలు వచ్చాయి. కానీ.. జగన్ పట్టించుకోలేదు. ఇది కూడా.. కార్యాలయం చెప్పిందన్న చర్చలు నడిచాయి. సొంతగా పార్టీ పెట్టడం.. తనంతట తాను ఎదగడం వరకు బాగానేఉన్నా.. ఇలాంటి ఇగోలు ప్రజాక్షేత్రంలో సరిపోవు. ఎన్టీఆర్ కూడా సొంతగానే పార్టీ పెట్టారు. ఆయన కోరకుండానే నమస్కారాలు అందేవి. కానీ, ఆయన తిరస్కరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి.. జగన్కు ఇలాంటి ఇగోలుసరికాదని మేధావులు చెబుతున్నారు.