స్టార్ బ్యూటీ సమంత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఈమె హోమ్ బ్యానర్ ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ నుంచి రాబోతున్న తొలి చిత్రం `శుభం`. మే 9న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల నుంచి శుభం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సమంత.. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను పంచుకుంది. ‘చాలా పెద్ద దారి దాటి బలంగా తయారయ్యాను.. న్యూ బిగినింగ్స్’ అంటూ తన తాజా పోస్ట్ కు సామ్ క్యాప్షన్ ఇచ్చింది. చివరిలో శుభం సినిమా రిలీజ్ డేట్ ను కూడా పేర్కొంది.
అయితే శుభం సినిమాకు సంబంధించిన ఫోటోలే కాకుండా ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన ఫోటోలనూ సమంత పంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో రాజ్, సమంత మధ్య పరిచయం ఏర్పడింది. ఈ సీరిస్ చేశాకే నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చైతూ శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకోగా.. సమంత మాత్రం ఒంటరి జీవితాన్నే గడుపుతోంది.
అయితే గత కాలం నుంచి డైరెక్టర్ రాజ్ తో సమంత ప్రేమాయణం నడుపుతుందని బలంగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లే రాజ్-సమంత ఎప్పటికప్పుడు జంటగా కనిపిస్తూ హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. రీసెంట్ గా వీరిద్దరూ తిరుపతి కూడా వెళ్లొచ్చారు. దాంతో రాజ్, సమంత పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అటు రాజ్ కానీ, ఇటు సమంత గానీ పెళ్లి వార్తలపై స్పందించలేదు. అలాగని ఖండించనూ లేదు. తాజాగా రాజ్ తో దిగిన ఫోటోలను సమంత ఇన్స్టా ద్వారా పంచుకోవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. రెండు పెళ్లిపై సమంత ఈ విధంగా మరో హింట్ ఇచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.