• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మూడేళ్లలో ‘సాక్షి’కి రూ.380 కోట్లు

NA bureau by NA bureau
July 6, 2022
in Andhra, Politics, Top Stories
1
0
SHARES
91
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లకు న్యూస్ పేపర్ అలవెన్స్ రూపంలో నెలకు ఒక్కొక్కరికి రూ.200 చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది జగన్ సర్కారు. ఇది కచ్చితంగా జగన్ కుటుంబ పత్రిక ‘సాక్షి’కి మేలు చేకూర్చడానికి తీసుకున్న నిర్ణయమే అన్నది స్పష్టం.

రాష్ట్రంలో 2.66 లక్షల మంది వాలంటీర్లు ఉండగా.. వాళ్లందరూ కూడా వైసీపీ పార్టీ మద్దతుదారులే. కాబట్టి ఆటోమేటిగ్గా అందరూ సాక్షి పత్రికే వేయించుకుంటారు. ఈ రకంగా నెలకు రూ.5 కోట్లకు పైగా బిల్లు పరోక్షంగా సాక్షి ఖాతాకే చేరుతుందన్నది అంచనా. అంతే కాక ఆ పత్రిక సర్క్యులేషన్ పెరిగి యాడ్స్ ధర కూడా పెంచుకునే సౌలభ్యం ఉంటుంది.

దీని మీద ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టినా పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదు. ఐతే సాక్షికి ఇప్పటిదాకా చేకూర్చిన ఆర్థిక ప్రయోజనంతో పోలిస్తే ఇది చాలా చిన్న విషయం అంటోంది ఆంధ్రజ్యోతి పత్రిక. సమాచార హక్కు చట్టం కింద గత మూడేళ్లలో సాక్షి పత్రికకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల విలువ దాదాపు రూ.360 కోట్లని ఆ పత్రిక కథనం ప్రచురించడం గమనార్హం.

ప్రభుత్వ పథకాల గురించి పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం మామూలే కానీ.. అది ప్రధానంగా లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీకి ఇస్తారు. ఆ తర్వాత ప్రాధాన్యం వేరే పత్రికలకు ఇస్తారు. కానీ తెలుగులో ‘ఈనాడు’నే అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక అయినప్పటికీ.. ప్రధానంగా ప్రకటనలన్నీ సాక్షికే కట్టబెడుతోంది ప్రభుత్వం.

2019 మేలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు తొలి ఆరు నెలల్లోనే సాక్షికి రూ.30 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చింది. తర్వాతి ఏడాది నుంచి కరోనా విలయ తాండవం చేసి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి తలకిందులైనప్పటికీ.. ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున సాక్షికి ప్రకటనలు ఇచ్చారట.

ఈ ఏడాది ఇప్పటిదాకా ప్రకటనల బిల్లు రూ.60 కోట్లు దాటిపోయింది. కేవలం ప్రభుత్వ పథకాల గురించే కాక పెట్రోలు రేట్లు పెరిగినపుడు, ఇంకేదైనా ప్రజల మీద భారం పడ్డపుడు.. ఉద్యోగులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకున్నపుడు వారికి వివరణ ఇస్తూ యాడ్స్ ఇవ్వడం.. ఒక పథకానికి సంబంధించి మూణ్నాలుగు విడతలుగా డబ్బులు వేస్తే.. ప్రతిసారీ దాని గురించి ఊదరగొడుతూ ప్రకటనలు ఇవ్వడం చేస్తోంది జగన్ సర్కారు.

ప్రభుత్వ ప్రకటన లేకుండా సాక్షి పత్రిక మార్కెట్లోకి రావడం అరుదుగా జరుగుతోంది. మెయిన్ పేజీకి ఇచ్చిన యాడ్స్ విలువ రూ.280 కోట్లు కాగా.. జిల్లాల స్థాయిలో ఇంకో వంద కోట్ల మేర యాడ్స్ ఇచ్చారని.. ఇలా మొత్తంగా ప్రజల సొమ్ము రూ.380 కోట్లను సొంత పత్రికకు జగన్ కట్టబెట్టారని ఆంధ్రజ్యోతి కథనంలో పేర్కొన్నారు.

Tags: andhrapradeshJagansakshiteluguYSRCP
Previous Post

నుపుర్ శర్మ… ఇది భారీ ట్విస్ట్ !

Next Post

బాహుబలిని, RRR ను వాడేయడానికి రెడీ అయిన మోడీ

Related Posts

jagan salute
Top Stories

జ‌గ‌న్‌లో అనూహ్య మార్పు.. కార‌ణాలు ఇవేనా?!!

March 30, 2023
రామోజీ
Top Stories

రామోజీరావు పై మరో పరోక్ష దాడి మొదలుపెట్టిన జగన్

March 30, 2023
Trending

యువగళం@700 కిలోమీటర్లు..జగన్ కు లోకేష్ ఛాలెంజ్

March 30, 2023
Top Stories

జగన్ పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

March 30, 2023
Andhra

జనం ‘గడప’లో మరో వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

March 30, 2023
Trending

జ‌గ‌న్ పుట్టింది అందుకే…చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్

March 30, 2023
Load More
Next Post

బాహుబలిని, RRR ను వాడేయడానికి రెడీ అయిన మోడీ

Comments 1

  1. Pingback: మూడేళ్లలో ‘సాక్షి’కి రూ.380 కోట్లు - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • జ‌గ‌న్‌లో అనూహ్య మార్పు.. కార‌ణాలు ఇవేనా?!!
  • రామోజీరావు పై మరో పరోక్ష దాడి మొదలుపెట్టిన జగన్
  • యువగళం@700 కిలోమీటర్లు..జగన్ కు లోకేష్ ఛాలెంజ్
  • జగన్ పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
  • జనం ‘గడప’లో మరో వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
  • జ‌గ‌న్ పుట్టింది అందుకే…చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్
  • న‌వ‌ర‌త్నాల‌పై న‌మ్మ‌కం ఉంటే… జ‌గ‌న్‌కు స‌వాల్‌
  • టీడీపీ నాశ‌నం కోరిన వైఎస్ మట్టికొట్టుకుపోయారు
  • బాలీవుడ్ పాలిటిక్స్ వల్లే హాలీవుడ్ కు వెళ్లిన స్టార్ హీరోయిన్
  • ఆ బెడ్రూం సీన్ చూసి ఇన్ స్పైర్ కావాలంటోన్న టాలీవుడ్ నటి
  • BATA – బే ఏరియాలో అంగ‌రంగ వైభ‌వంగా ‘బాటా’ ఉగాది సంబ‌రాలు!
  • బాగా జోరుమీదున్న సైకిల్
  • సెగ మొద‌లైంది.. వైసీపీ నేత‌లకు భారీ షాక్‌..!
  • వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్
  • వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్ ఈ స్పీడేంటి సామీ !

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra