అచ్చ తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం, అభినయంతో ఓ వెలుగు వెలిగిన రంభ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 90వ దశకంలో టాప్ హీరోయిన్స్ గా సత్తా చాటిన వారిలో రంభ ఒకరు. గ్లామరస్ పాత్రలకు కేరాఫ్ గా నిలిచిన రంగ.. తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం, బెంగాలీ, భోజ్పురి, ఆంగ్ల భాషల్లోనూ నటించింది. 2010లో కెనడాకు చెందిన శ్రీలంక తమిళ వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాథన్ను వివాహం చేసుకున్న రంభ.. ఆ తర్వాత నుంచి సినిమాలు చేయడం మానేసింది.
అయితే సుమారు 15 ఏళ్ల తర్వాత రంభ రీఎంట్రీకి సిద్ధం అయింది. ఆమె తోటి తారలంతా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రంభ కూడా నటిగా మళ్లీ తన జర్నీని స్టార్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఓ టీవీ రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న రంభ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం కావడానికి కారణమేంటో కూడా వివరించారు.
వివాహం అనంతరం తాను భర్తతో కలిసి కెనడాలో స్థిరపడ్డానని.. ఒక తల్లిగా పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని… అందుకే సినిమాలకు దూరమయ్యానని రంభ చెప్పుకొచ్చింది. తనకిప్పుడు ఆరేళ్ల కొడుకు, 14, 10 ఏళ్ల ఇద్దరు కూతుళ్లు ఉన్నారని రంభ తెలిపింది. వారిని చూసుకోవడం కోసమే ఇన్నాళ్లు సినిమాలకు దూరమయ్యాను.. ప్రస్తుతం వారి పనులు వారు చేసుకోగలుగుతున్నారు.. అందుకే మళ్లీ యాక్టింగ్ వేపు అడుగులు వేశానని రంభ వివరించింది. ఇక సినిమాలపై నాకున్న ఆసక్తి గురించి నా భర్తకు తెలుసు.. ఆయన ప్రోత్సాహంతోనే ఒక డ్యాన్స్ షోకు జడ్జిగా చేశాను.. త్వరలోనే వెండితెరపై కూడా అడుగుపెడతానని రంభ వెల్లడించింది. తన చేతిలో కొన్ని చిత్రాలు ఉన్నట్లు కూడా స్పష్టం చేసింది.