క్రిస్టియన్ వర్గాల్లో అత్యున్నత స్థాయి మతాచార్య పదవిలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ పరలోకాలకు ఏగిపోయా రు. ప్రపంచ శాంతిని కాంక్షించిన ఫ్రాన్సిస్.. ఇక లేరన్న వార్త తెలుసుకుని.. ప్రపంచం యావత్తు.. అశృని వాళులర్పించింది. ఇటీవల గాజా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రజలపై జరుగుతున్న దమన కాండగా పేర్కొ న్న పోప్.. ఏ దేవుడు కూడా.. దీనిని క్షమించడని.. తక్షణమే దారుణ మారణకాండకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. దరిమిలా.. యుద్ధానికి విరామం ఇస్తూ.. ఇజ్రాయెల్ నిర్ణయించింది.
కాగా.. ప్రపంచ స్థాయిలో క్రిస్టియన్ వర్గాలు.. పోప్ను తమ ఆరాధ్య దైవంగానే కాకుండా.. ఏసు ప్రభువుతో సమానంగా పూజిస్తారు. అలాంటి స్థానంలో 2013న బాధ్యతలు చేపట్టిన ఫ్రాన్సిస్ గత కొంత కాలంగా వీల్ చైర్కే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆయన వయసు 88 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలు ఆయనను కూడా వెంటాడాయి. శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడు తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో దాదాపు నెల రోజుల పాటు ఆయనను ఆసుపత్రిలోనే ఉంచి చికిత్సలందించారు.
కాగా.. వాస్తవానికి సోమవారం ఉదయమే ఆయన ప్రభువులో లీనమయ్యారని ఇటలీ మీడియా పేర్కొంది. అయితే.. పోప్ స్థానంలో ఉండి తుది శ్వాసవిడిచిన తర్వాత.. పలు ధార్మిక పరమైన అంశాలతోపాటు.. ప్రభువు సందేశం ప్రకారం.. కొన్ని క్రతువులు నిర్వహించాల్సి రావడంతో వార్త వెలుగు లోకి వచ్చేసరికి ఆలస్యమైంది. ఇదిలావుంటే.. అర్జెంటీనాలో జన్మించిన ఫ్రాన్సిస్.. కేవలం దైవ ఆరాధన కే పరిమితం కాలేదు. మహిళా హక్కులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, మాంద్యం, కరోనా మహమ్మారి సమయంలో సేవలు, వంటి అనేక విషయాలను ప్రస్తావించారు. అందుకే.. ఆయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.