ప్రముఖ నటుడు, రచయిత, రాజకీయనాయకుడు పరేష్ రావల్ గురించి పరిచయాలు అక్కర్లేదు. ముంబైలో పుట్టిన పెరిగిన ఈయన.. బాలీవుడ్ చిత్రాల ద్వారా స్టార్డమ్ సంపాదించుకున్నారు. టాలీవుడ్ క్షణక్షణం, రిక్షావోడు, బావగారు బాగున్నారా?, శంకర్దాదా ఎంబీబీఎస్, తీన్మార్ తదితర చిత్రాల చిత్రాల్లో నటించి తెలుగువారికి కూడా పరేష్ రావల్ చేరవయ్యారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పరేష్ రావల్.. 15 రోజుల పాటు తాను యూరిన్ ను బీరులా తాగానంటూ ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టి వార్తల్లో నిలిచారు.
రాజ్కుమార్ సంతోషి తీసిన బ్లాక్ బస్టర్ `ఘాతక్` చిత్రం షూటింగ్ సమయంలో పరేష్ రావల్ గాయపడ్డాడు. తీవ్రమైన మోకాలి గాయంతో ముంబైలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆడ్మిట్ అయిన పరేష్ రావల్.. ఈ దెబ్బతో కెరీర్ క్లోజ్ అని భావించారట. అదే టైమ్ లో ఆస్పత్రికి విజిట్ చేసేందుకు వచ్చిన అజయ్ దేవగన్ తండ్రి, యాక్షన్ డైరెక్టర్ వీరూ దేవన్.. పరేష్ రావల్ కు ఓ సలహా ఇచ్చారట.
త్వరగా గాయం నుంచి కోలుకోవాలంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే స్వంత మూత్రాన్ని తాగాలని సలహా ఇచ్చారట. అలాగే సిగరెట్లు, మద్యం సేవించకూడదు.. మాంసాహారానికి దూరంగా ఉండాలని సూచించారట. ఆయన సలహా మేనరకు 15 రోజుల పాటు తాను యూరిన్ ను బీరులా తాగానని.. ఆ తర్వాత ఎక్స్ రే తీసిన డాక్టర్లు రిపోర్టులు చూసి షాకైపోయారని పరేశ్ రావల్ పేర్కొన్నాడు. ఇటువంటి సమస్య వచ్చినప్పుడు కోలుకోవడానికి దాదాపు రెండున్నర నెలలు పడుతుంది. కానీ తాను కేవలం నెలన్నరకే కోలుకుని డిశ్చార్జ్ అయ్యాయని.. వీరూ దేవన్ ఇచ్చిన సలహా తనకొక మ్యాజిక్లా పని చేసిందని పరేష్ రావల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.