• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మునుగోడు ఫ‌లితాలు.. కేంద్ర మంత్రి ఫోన్‌తో యాక్ష‌న్‌.. ఏం జ‌రిగిందంటే

NA bureau by NA bureau
November 6, 2022
in Politics, Telangana, Top Stories
0
kishan reddy

kishan reddy

0
SHARES
168
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు రౌండ్ల వారీగా ఉత్కంఠ పెంచుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇదే స‌మ‌యంలో ఈ ఫ‌లితాల వెల్ల‌డి కూడా రాజ‌కీయంగా మారింది. ఫ‌లితాల వెల్లడి జాప్యంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని బీజేపీ నాయ‌కులు ఆరోపించారు. ఈ క్ర‌మంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించారు.

కేంద్రమంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే.. 4 రౌండ్ల ఫలితాలను సీఈవో అప్‌లోడ్ చేయించారు. ఈ క్రమంలోనే ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో తీరుపై కిషన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మ‌రోవైపు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వైఖరిపై బండి సంజయ్‌ అనుమానం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

టీఆర్ ఎస్‌కు లీడ్‌ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్‌డేట్‌ చేయడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీకి ఆధిక్యం లభించినప్పుడు ఫలితాలను వెల్లడించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని సంజయ్ నిలదీశారు. ఈ క్రమంలోనే మొదటి, రెండు రౌండ్ల తర్వాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్‌డేట్‌ చేసేందుకు జరిగిన జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.

మీడియా నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప.. రౌండ్లవారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదన్నారు. ఫలితాల విషయంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని సంజయ్ హెచ్చరించారు. రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడించడంలో సీఈవో విఫలమయ్యారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితాల వెల్లడిలో గందరగోళంపై బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్కో అధికారి ఒక్కో విధంగా చెబుతూ ఫలితాలపై కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సీఎంవో నుంచి ఆదేశాలొస్తే తప్ప ఫలితాలు వెల్లడించరా అని ప్రశ్నించారు. కుంటి సాకులు చెబుతూ టీఆర్ ఎస్‌కు ఆధిక్యం వచ్చే దాకా కౌంటింగ్ ప్రక్రియను జాప్యం చేస్తారా అన్న ఆయన.. బీజేపీకి లీడ్ వచ్చే రౌండ్లలోనే ఫలితాలను అప్‌డేట్ చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని నిలదీశారు.

Tags: BJPCongressmunugodemunuguduTRS
Previous Post

క్రికెట్‌లో పెను సంచలనం

Next Post

Munugode : టీఆర్ఎస్ ఖాతాలో మునుగోడు, మెజార్టీ ఎంతంటే

Related Posts

Trending

చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు

March 29, 2023
Trending

టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?

March 29, 2023
Trending

ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?

March 29, 2023
Andhra

టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!

March 28, 2023
Trending

అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్

March 28, 2023
Trending

అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?

March 28, 2023
Load More
Next Post
KCR's Party Wins munugode elections

Munugode : టీఆర్ఎస్ ఖాతాలో మునుగోడు, మెజార్టీ ఎంతంటే

Latest News

  • చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు
  • టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?
  • ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?
  • అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!
  • యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!
  • టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!
  • అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్
  • అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?
  • తమ్మినేనికి ఎసరు పెట్టిన కూన రవికుమార్
  • వైసీపీ రెండుగా చీలిందంటోన్న లోకేష్
  • లక్ష్మీ పార్వతి కి సజ్జలకు లింకేంటో చెప్పిన రఘురామ!
  • జగన్ కు పులివెందుల టెన్షన్
  • ఇక.. త‌ప్ప‌దు.. జ‌గ‌న్‌ మారాల్సిందే!!
  • రాపాక నీతులు చెప్ప‌డం ఏంటి బ్రో!!
  • వివేకా కేసు విచారణపై సుప్రీం సంచలన నిర్ణయం

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra